Test Cricket: టెస్టులు ఇలానే ఉంటే.. అభిమానులకు ఏం మజా!
టెస్టుల్లో ఏ జట్టును విజయం వరిస్తుందనే ఆసక్తి ఐదో రోజు వరకూ ఉంటేనే మజా. అలా కాకుండా కేవలం రెండు రోజుల్లోపే ఫలితం వస్తే అభిమానులకు పెద్దగా ఆసక్తి ఉండదు.
క్రికెట్లో టెస్టులే (Test Cricket) అత్యున్నతం.. ప్రతి ఆటగాడు ఈ విషయాన్ని అంగీకరిస్తాడు. ఎందుకంటే దీనికి ఉన్న భిన్నత్వం..విలువ వేరు. అయిదురోజుల ఆట రోజుకో మలుపు తిరుగుతూ అభిమానులను అలరిస్తుంది. సెషన్కో ట్విస్టుతో క్రికెట్లో అసలు మజాను అందిస్తుంది. అలాంటి టెస్టులు అయిదురోజులు జరిగి ఫలితం వస్తేనే అసలైన ఆనందం. అలాంటిది చెత్త పిచ్ల వల్ల రెండు, మూడు రోజుల్లోనే ముగిసిపోతే ఏం బాగుంటుంది. అభిమానులకు ఏం సంతోషం మిగులుతుంది. ఆటగాళ్లకు ఆ సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుంది. తాజాగా భారత్-దక్షిణాఫ్రికా (SA vs IND) మధ్య కేప్టౌన్లో జరిగిన రెండో టెస్టే ఇందుకు తాజా ఉదాహరణ. దాదాపు వన్డేలా ముగిసిపోయి ఇదేం టెస్టు అనిపించింది.
ఈ మధ్య ఇంతే..
ఇటీవల కాలంలో చాలా టెస్టులు ఇలా మూడు రోజుల్లోనే ముగుస్తున్నాయి. ముఖ్యంగా ఉపఖండంలో జరిగే అయిదురోజుల మ్యాచ్లు 3 రోజుల్లోనే ముగిసిపోతున్నాయి. స్పిన్కు అనుకూలించే పిచ్లపై బ్యాటర్లు నిలవలేకపోతున్నారు. సేనా దేశాలు (ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) కూడా ఇందుకేం మినహాయింపు కాదు. ఉపఖండంలో స్పిన్ పిచ్లు తయారు చేసి ప్రత్యర్థి జట్లను దెబ్బ కొడితే.. సేనా దేశాల్లో పేస్ పిచ్లతో బ్యాటర్లు బెంబేలెత్తున్నారు. 145 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇలా తక్కువ వ్యవధిలో ముగుస్తున్న టెస్టులు ఈ మధ్య కాలంలోనే అధికమవుతున్నాయి. ఇది టెస్టు క్రికెట్కు ప్రమాద హెచ్చరికే. ఎందుకంటే స్పోర్టింగ్ పిచ్లు ఉంటేనే ఆట రంజుగా సాగుతుంది. అయిదురోజులపాటు మ్యాచ్ మలుపులు తిరిగి చివరిరోజు ఫలితం తేలితే ఆ ఆనందం వేరేగా ఉంటుంది. సునీల్ గావస్కర్ లాంటి మాజీలు కూడా ఈ విషయాన్నే చెబుతున్నారు. నాసిరకం పిచ్లు, బిలో యావరేజ్ పిచ్ల వల్ల టెస్టు క్రికెట్ ప్రమాదంలో పడుతుందని మాజీలు హెచ్చరిస్తున్నారు. డి మెరిట్ పాయింట్లు కేటాయించడం ఈ సమస్యకు పరిష్కారం కాదని.. క్రికెట్ బోర్డుల దృక్పథంలో మార్పు రావాలని అంటున్నారు.
తిరిగితే ఒకలా.. ఎగిరితే ఇంకోలా
భారత పిచ్లపై విపరీతంగా బంతులు తిరిగి తక్కువ రోజుల్లో మ్యాచ్లు ముగిసిపోతే ప్రత్యర్థి జట్ల మాజీ ఆటగాళ్లు, మీడియా చేసే హడావుడి అంతా ఇంతా కాదు. 2021 భారత పర్యటనలో అహ్మదాబాద్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి ఇంగ్లాండ్ 193 పరుగులే చేయగలిగింది. దీంతో ఇంగ్లాండ్ మాజీ రెచ్చిపోయి మాట్లాడారు. కానీ పేస్కు అనుకూలమైన పిచ్లపై మూడ్రోజుల్లోనే మ్యాచ్లు పూర్తయినప్పుడు మాత్రం ఎవరూ నోరెత్తలేదు. టెస్టు క్రికెట్ మనుగడ గురించి మాట్లాడలేదు. తాజాగా కేప్టౌన్ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే పూర్తవడంతో భారత కెప్టెన్ రోహిత్శర్మ కూడా ఇదే మాట అన్నాడు. స్పిన్ పిచ్లపై బంతి తిరిగితే ఒప్పుకోరు కానీ పేస్ పిచ్లపై బంతి ఎగిరితే మాత్రం మాట్లాడరు అని చురకలంటించాడు. రోహిత్ మాట వాస్తవమే కానీ టెస్టు క్రికెట్లో అసలైన మజాను ప్రస్తుత తరం ఆస్వాదించాలంటే కచ్చితంగా బంతికి, బ్యాట్కు మధ్య సమతూకం ఉండి తీరాలి. ఎవరికి అనుకూలమైన పిచ్లు వాళ్లు తయారు చేసుకోవడంలో తప్పు లేదు. అలా అని తొలిరోజే తొలి సెషన్లోనే బంతి గిర్రున తిరిగేలాగో లేక రోజంతా బౌన్స్, స్వింగ్ అయ్యేలాగో ఉంటేనే ప్రమాదం. బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బంతిదే ప్రధాన పాత్ర అయినప్పుడు ఇంకా అక్కడ మజా ఎక్కడ ఉంటుంది. అభిమానులకు ఆనందం ఎలా కలుగుతుంది. కేప్టౌన్ టెస్టును ఉదాహరణగా తీసుకొనైనా ఇకపై స్పోర్టింగ్ వికెట్లు తయారు చేస్తే టెస్టు క్రికెట్కు మంచిది.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్