Test Cricket: టెస్టులు ఇలానే ఉంటే.. అభిమానులకు ఏం మజా!
టెస్టుల్లో ఏ జట్టును విజయం వరిస్తుందనే ఆసక్తి ఐదో రోజు వరకూ ఉంటేనే మజా. అలా కాకుండా కేవలం రెండు రోజుల్లోపే ఫలితం వస్తే అభిమానులకు పెద్దగా ఆసక్తి ఉండదు.
క్రికెట్లో టెస్టులే (Test Cricket) అత్యున్నతం.. ప్రతి ఆటగాడు ఈ విషయాన్ని అంగీకరిస్తాడు. ఎందుకంటే దీనికి ఉన్న భిన్నత్వం..విలువ వేరు. అయిదురోజుల ఆట రోజుకో మలుపు తిరుగుతూ అభిమానులను అలరిస్తుంది. సెషన్కో ట్విస్టుతో క్రికెట్లో అసలు మజాను అందిస్తుంది. అలాంటి టెస్టులు అయిదురోజులు జరిగి ఫలితం వస్తేనే అసలైన ఆనందం. అలాంటిది చెత్త పిచ్ల వల్ల రెండు, మూడు రోజుల్లోనే ముగిసిపోతే ఏం బాగుంటుంది. అభిమానులకు ఏం సంతోషం మిగులుతుంది. ఆటగాళ్లకు ఆ సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుంది. తాజాగా భారత్-దక్షిణాఫ్రికా (SA vs IND) మధ్య కేప్టౌన్లో జరిగిన రెండో టెస్టే ఇందుకు తాజా ఉదాహరణ. దాదాపు వన్డేలా ముగిసిపోయి ఇదేం టెస్టు అనిపించింది.
ఈ మధ్య ఇంతే..
ఇటీవల కాలంలో చాలా టెస్టులు ఇలా మూడు రోజుల్లోనే ముగుస్తున్నాయి. ముఖ్యంగా ఉపఖండంలో జరిగే అయిదురోజుల మ్యాచ్లు 3 రోజుల్లోనే ముగిసిపోతున్నాయి. స్పిన్కు అనుకూలించే పిచ్లపై బ్యాటర్లు నిలవలేకపోతున్నారు. సేనా దేశాలు (ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) కూడా ఇందుకేం మినహాయింపు కాదు. ఉపఖండంలో స్పిన్ పిచ్లు తయారు చేసి ప్రత్యర్థి జట్లను దెబ్బ కొడితే.. సేనా దేశాల్లో పేస్ పిచ్లతో బ్యాటర్లు బెంబేలెత్తున్నారు. 145 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇలా తక్కువ వ్యవధిలో ముగుస్తున్న టెస్టులు ఈ మధ్య కాలంలోనే అధికమవుతున్నాయి. ఇది టెస్టు క్రికెట్కు ప్రమాద హెచ్చరికే. ఎందుకంటే స్పోర్టింగ్ పిచ్లు ఉంటేనే ఆట రంజుగా సాగుతుంది. అయిదురోజులపాటు మ్యాచ్ మలుపులు తిరిగి చివరిరోజు ఫలితం తేలితే ఆ ఆనందం వేరేగా ఉంటుంది. సునీల్ గావస్కర్ లాంటి మాజీలు కూడా ఈ విషయాన్నే చెబుతున్నారు. నాసిరకం పిచ్లు, బిలో యావరేజ్ పిచ్ల వల్ల టెస్టు క్రికెట్ ప్రమాదంలో పడుతుందని మాజీలు హెచ్చరిస్తున్నారు. డి మెరిట్ పాయింట్లు కేటాయించడం ఈ సమస్యకు పరిష్కారం కాదని.. క్రికెట్ బోర్డుల దృక్పథంలో మార్పు రావాలని అంటున్నారు.
తిరిగితే ఒకలా.. ఎగిరితే ఇంకోలా
భారత పిచ్లపై విపరీతంగా బంతులు తిరిగి తక్కువ రోజుల్లో మ్యాచ్లు ముగిసిపోతే ప్రత్యర్థి జట్ల మాజీ ఆటగాళ్లు, మీడియా చేసే హడావుడి అంతా ఇంతా కాదు. 2021 భారత పర్యటనలో అహ్మదాబాద్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి ఇంగ్లాండ్ 193 పరుగులే చేయగలిగింది. దీంతో ఇంగ్లాండ్ మాజీ రెచ్చిపోయి మాట్లాడారు. కానీ పేస్కు అనుకూలమైన పిచ్లపై మూడ్రోజుల్లోనే మ్యాచ్లు పూర్తయినప్పుడు మాత్రం ఎవరూ నోరెత్తలేదు. టెస్టు క్రికెట్ మనుగడ గురించి మాట్లాడలేదు. తాజాగా కేప్టౌన్ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే పూర్తవడంతో భారత కెప్టెన్ రోహిత్శర్మ కూడా ఇదే మాట అన్నాడు. స్పిన్ పిచ్లపై బంతి తిరిగితే ఒప్పుకోరు కానీ పేస్ పిచ్లపై బంతి ఎగిరితే మాత్రం మాట్లాడరు అని చురకలంటించాడు. రోహిత్ మాట వాస్తవమే కానీ టెస్టు క్రికెట్లో అసలైన మజాను ప్రస్తుత తరం ఆస్వాదించాలంటే కచ్చితంగా బంతికి, బ్యాట్కు మధ్య సమతూకం ఉండి తీరాలి. ఎవరికి అనుకూలమైన పిచ్లు వాళ్లు తయారు చేసుకోవడంలో తప్పు లేదు. అలా అని తొలిరోజే తొలి సెషన్లోనే బంతి గిర్రున తిరిగేలాగో లేక రోజంతా బౌన్స్, స్వింగ్ అయ్యేలాగో ఉంటేనే ప్రమాదం. బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బంతిదే ప్రధాన పాత్ర అయినప్పుడు ఇంకా అక్కడ మజా ఎక్కడ ఉంటుంది. అభిమానులకు ఆనందం ఎలా కలుగుతుంది. కేప్టౌన్ టెస్టును ఉదాహరణగా తీసుకొనైనా ఇకపై స్పోర్టింగ్ వికెట్లు తయారు చేస్తే టెస్టు క్రికెట్కు మంచిది.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!