Rahul Tripathi: విరాట్ అందుబాటులో లేకపోతే.. త్రిపాఠి సరైన ప్రత్యామ్నాయం: డీకే
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టుకు అందుబాటులో లేని సమయంలో యువ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి సరైన ప్రత్యామ్నాయమని టీమ్ఇండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టుకు అందుబాటులో లేని సమయంలో యువ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి సరైన ప్రత్యామ్నాయమని టీమ్ఇండియా క్రికెటర్ దినేశ్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు. కివీస్తో మూడో టీ20లో రాహుల్ అద్భుతంగా రాణించాడని చెప్పాడు.
‘‘కివీస్తో జరిగిన మూడో టీ20, శ్రీలంకతో జరిగిన సిరీస్లోనూ రాహుల్ త్రిపాఠి మంచి ప్రదర్శన చేశాడు. ఒకవేళ కోహ్లీ అందుబాటులో లేకపోతే భారత జట్టు తరఫున అతడు మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగాలి. ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉన్నా అతడు రిస్క్ తీసుకుంటాడు. దూకుడుగా ఆడతాడు. భారీ షాట్లు బాదుతాడు. అది అతని డీఎన్ఏలోనే ఉంది. ఒక కోచ్, కెప్టెన్కు కావాల్సింది అలాంటి ఆటగాడే. పెద్ద మ్యాచుల్లో భారత జట్టుకు అతడి అవసరం ఉంది. అతడికి పదే పదే అవకాశాలు రావు. కానీ వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోగలడు’’ అని దినేశ్ పేర్కొన్నాడు. భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ20లో త్రిపాఠి నాలుగు ఫోర్లు మూడు సిక్స్లు బాది 22 బంతుల్లో 44 పరుగులు సాధించాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20లో ఐదు ఫోర్లు, రెండు సిక్స్లు బాది 16 బంతుల్లో 35 పరుగులు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం