IPL 2023: ఐపీఎల్లో ‘ఇంపాక్ట్’ ఎవరికి కలిసొచ్చిందంటే?
ఐపీఎల్లో (IPL 2023) టాస్ తర్వాత జట్టును ప్రకటించే అవకాశం ఉండటంతోపాటు ఐదుగురితో కూడిన ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాను సమర్పించే పద్ధతి ఉంది. చాలా జట్లు బ్యాటర్లు, బౌలర్లలో అవసరాన్ని బట్టి మార్చుకుంటూ ఫలితాలను అనుకూలంగా రాబట్టేందుకు ప్రయత్నించాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) చరిత్రలో తొలిసారి ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ను తీసుకొచ్చారు. ప్రతి జట్టూ ఇంపాక్ట్ రూల్ను వినియోగించుకుంది. కొన్ని మ్యాచుల్లో అద్భుత ఫలితాలు రాగా.. మరికొన్నింట్లో మాత్రం విఫలమైంది. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ను వినియోగించిన తొలి జట్టుగా ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. మరి ఈ సీజన్లో ఇలా ఆయా జట్లపై ‘ఇంపాక్ట్’ చూపిన ప్లేయర్ల జాబితాను ఓ సారి పరిశీలిద్దాం.
- చెన్నై సూపర్ కింగ్స్: గుజరాత్ టైటాన్స్తో తొలి లీగ్ మ్యాచ్లో అంబటి రాయుడి స్థానంలో పేసర్ తుషార్ దేశ్పాండేను సీఎస్కే ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుంది. ఆ మ్యాచ్లో తుషార్ 3.2 ఓవర్లలో ఒక్క వికెట్ తీసి 51 పరుగులు సమర్పించాడు. ఇలా మొదటి ఇంపాక్ట్ ప్లేయర్ ఘోరంగా విఫలమయ్యాడు. తర్వాత పుంజుకుని తుది జట్టులో కీలక బౌలర్గా మారాడు. అప్పటి నుంచి ఇంపాక్ట్గా వస్తున్న అంబటి రాయుడు.. చివరి మ్యాచ్లో మినహా అన్నింటిలోనూ విఫలమయ్యాడు.
- గుజరాత్ టైటాన్స్: ఆరెంజ్ క్యాప్ హోల్డర్ శుభ్మన్ గిల్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన ఆటగాడే. సెంచరీలతో ప్రత్యర్థుల బౌలింగ్ను తుత్తునీయలు చేశాడు. మొదటి లీగ్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ లీగ్ ఆసాంతం అదే జోరు ప్రదర్శించాడు. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన సుదర్శన్ ఓపెనర్ల తర్వాత దూకుడుగా ఆడుతూ కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. అందులో ఫైనల్ మ్యాచ్లో 96 పరుగులు చేసి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. గుజరాత్కు మాత్రం ఇంపాక్ట్ రూల్ భలేగా కలిసొచ్చింది. మోహిత్ శర్మను కూడా ‘ఇంపాక్ట్’ ఆటగాడిగా వాడుకొని సత్ఫలితాలను అందుకుంది.
- లఖ్నవూ సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్య నాయకత్వంలోని లఖ్నవూ సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ వరకు వెళ్లింది. లఖ్నవూ కూడా ఆయుష్ బదోని, కృష్ణప్ప గౌతమ్, అవేశ్ ఖాన్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్.. ఇలా ఇంపాక్ట్గా ఎంపిక చేసుకుంది. ఆయుష్ బదోని ప్రదర్శన మాత్రం గొప్పగా ఏమీ లేదు. ఎలిమినేటర్ మ్యాచ్లో కేల్ మేయర్స్ బదులు బౌలింగ్కు వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ యశ్ ఠాకూర్ ఉత్తమ ప్రదర్శన ఇచ్చాడు. కీలకమైన మూడు వికెట్లు తీశాడు. అయితే, లఖ్నవూ ఎలిమినేటర్లోనే ఓడిపోయింది.
- ముంబయి ఇండియన్స్: ముంబయి ఇండియన్స్ ఏకంగా కెప్టెన్ను ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకుంది. రోహిత్ శర్మతోపాటు మిస్టర్ 360 బ్యాటర్ సూర్యకుమార్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, నెహాల్ వధెరా ఇంపాక్ట్ ప్లేయర్లుగా బరిలోకి దిగి అదరగొట్టారు. అయితే, రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో కంకేషన్ సబ్స్టిట్యూట్గా ముంబయి తరఫున బరిలోకి దిగిన విష్ణు వినోద్ మాత్రం ఘోరంగా విఫలం కావడం ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇషాన్ కిషన్ గాయపడటంతో విష్ణు క్రీజ్లోకి వచ్చి సరిగా ఆడలేదు.
- రాజస్థాన్ రాయల్స్: సంజూ నాయకత్వంలోని రాజస్థాన్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్తో మిశ్రమ ఫలితాలను నమోదు చేసింది. హెట్మెయిర్ జోరుగా ఆడాడు. ఓబెడ్ మెక్కాయ్, రియాన్ పరాగ్, దేవదత్ పడిక్కల్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయారు. భారీగా ఆశలు పెట్టుకున్న రియాన్ పరాగ్ ఈసారి ఘోరంగా విఫలమై జట్టులో స్థానం ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు. సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్కు గురయ్యాడు. రాజస్థాన్కు ఇంపాక్ట్ పెద్దగా కలిసిరాలేదు.
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: గాయం కారణంగా కెప్టెన్ డుప్లెసిస్ కొన్ని మ్యాచుల్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. బ్యాటింగ్లో అదరగొట్టేశాడు. ఆర్సీబీ ఎక్కువగా బౌలర్ హర్షల్ పటేల్ కోసం ఇంపాక్ట్ రూల్ను వాడుకుంది. అనుజ్ రావత్తో బ్యాటింగ్ చేయించి హర్షల్తో బౌలింగ్ వేయించుకుంది. కానీ, హర్షల్ ఒకటీ రెండు మ్యాచుల్లో మినహా గొప్పగా రాణించలేదు. ప్రత్యర్థులను కట్టడి చేయడంలో విఫలమయ్యాడు.
- కోల్కతా నైట్రైడర్స్: కేకేఆర్కు వెంకటేశ్ అయ్యర్ రూపంలో ఆల్రౌండర్ ఉన్నప్పటికీ.. అది బౌలింగ్ ప్రతిభను వాడుకోలేదు. మెరుపు ఇన్నింగ్స్లతో అయ్యర్ అలరించాడు. సుయాశ్ శర్మ మ్యాజిక్ స్పెల్తో బెంగళూరుపై విజృంభించాడు. ఇక ఆ తర్వాత గొప్ప ప్రదర్శన మాత్రం చేయలేకపోయాడు. వెంకటేశ్, సుయాశ్, అనుకుల్ మధ్యే ఇంపాక్ట్ కుర్చీ తిరిగింది. తొలుత బౌలింగ్ అయితే జట్టులోకి సుయాశ్ను తీసుకొని.. కీలక సమయంలో వెంకటేశ్ అయ్యర్ను బ్యాటింగ్ దించింది. ఎక్కువ మ్యాచుల్లో ఇంపాక్ట్ రూల్ కోల్కతాకు అక్కరకు రాకుండాపోయింది.
- పంజాబ్ కింగ్స్: పంజాబ్ కింగ్స్లో రిషి ధావన్ను బౌలింగ్ కోసం వినియోగించుకుని.. బ్యాటింగ్కు వచ్చేసరికి ప్రభ్సిమ్రన్ సింగ్ను క్రీజ్లోకి తీసుకొచ్చింది. ఇద్దరూ తమ వంతు న్యాయం చేశారు. అలాగే రాహుల్ చాహర్ - భానుక రాజపక్స కూడా జట్టుపై ప్రభావం చూపారు. మిగతా ఆటగాళ్లు సరైన ప్రదర్శన ఇవ్వకపోవడంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో దిగువనే ఉండిపోవాల్సి వచ్చింది.
- దిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్.. వీరిద్దరూ దిల్లీ ప్రధాన జట్టులో ఉండాల్సిన ఆటగాళ్లు. కానీ, కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా అప్పుడప్పుడు వచ్చిపోయారు. పెద్దగా ప్రభావం చూపిన దాఖలాలు అస్సల్లేవు. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజర్ వంటి బౌలర్లు మాత్రం తమ పాత్రకు న్యాయం చేశారు. ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. బ్యాటింగ్ విభాగంలో దిల్లీకి ‘ఇంపాక్ట్’ రూల్ కలిసిరాలేదు.
- సన్రైజర్స్ హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన గొప్పగా లేదు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం ఎస్ఆర్హెచ్దే. అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, నటరాజన్, అన్మోల్ప్రీత్ సింగ్, కార్తిక్ త్యాగి ‘ఇంపాక్ట్’గా వచ్చారు. వీరిలో అందరూ సింగిల్ షో చేసినవారే అధికం. నిలకడగా నటరాజన్ బౌలింగ్ తప్ప... అన్మోల్, రాహుల్, అబ్దుల్ సమద్ జట్టును గెలిపించిన ఇన్నింగ్స్లు లేవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?