IPL 2023: ఐపీఎల్లో ‘ఇంపాక్ట్’ ఎవరికి కలిసొచ్చిందంటే?
ఐపీఎల్లో (IPL 2023) టాస్ తర్వాత జట్టును ప్రకటించే అవకాశం ఉండటంతోపాటు ఐదుగురితో కూడిన ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాను సమర్పించే పద్ధతి ఉంది. చాలా జట్లు బ్యాటర్లు, బౌలర్లలో అవసరాన్ని బట్టి మార్చుకుంటూ ఫలితాలను అనుకూలంగా రాబట్టేందుకు ప్రయత్నించాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) చరిత్రలో తొలిసారి ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ను తీసుకొచ్చారు. ప్రతి జట్టూ ఇంపాక్ట్ రూల్ను వినియోగించుకుంది. కొన్ని మ్యాచుల్లో అద్భుత ఫలితాలు రాగా.. మరికొన్నింట్లో మాత్రం విఫలమైంది. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ను వినియోగించిన తొలి జట్టుగా ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. మరి ఈ సీజన్లో ఇలా ఆయా జట్లపై ‘ఇంపాక్ట్’ చూపిన ప్లేయర్ల జాబితాను ఓ సారి పరిశీలిద్దాం.
- చెన్నై సూపర్ కింగ్స్: గుజరాత్ టైటాన్స్తో తొలి లీగ్ మ్యాచ్లో అంబటి రాయుడి స్థానంలో పేసర్ తుషార్ దేశ్పాండేను సీఎస్కే ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుంది. ఆ మ్యాచ్లో తుషార్ 3.2 ఓవర్లలో ఒక్క వికెట్ తీసి 51 పరుగులు సమర్పించాడు. ఇలా మొదటి ఇంపాక్ట్ ప్లేయర్ ఘోరంగా విఫలమయ్యాడు. తర్వాత పుంజుకుని తుది జట్టులో కీలక బౌలర్గా మారాడు. అప్పటి నుంచి ఇంపాక్ట్గా వస్తున్న అంబటి రాయుడు.. చివరి మ్యాచ్లో మినహా అన్నింటిలోనూ విఫలమయ్యాడు.
- గుజరాత్ టైటాన్స్: ఆరెంజ్ క్యాప్ హోల్డర్ శుభ్మన్ గిల్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన ఆటగాడే. సెంచరీలతో ప్రత్యర్థుల బౌలింగ్ను తుత్తునీయలు చేశాడు. మొదటి లీగ్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ లీగ్ ఆసాంతం అదే జోరు ప్రదర్శించాడు. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన సుదర్శన్ ఓపెనర్ల తర్వాత దూకుడుగా ఆడుతూ కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. అందులో ఫైనల్ మ్యాచ్లో 96 పరుగులు చేసి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. గుజరాత్కు మాత్రం ఇంపాక్ట్ రూల్ భలేగా కలిసొచ్చింది. మోహిత్ శర్మను కూడా ‘ఇంపాక్ట్’ ఆటగాడిగా వాడుకొని సత్ఫలితాలను అందుకుంది.
- లఖ్నవూ సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్య నాయకత్వంలోని లఖ్నవూ సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ వరకు వెళ్లింది. లఖ్నవూ కూడా ఆయుష్ బదోని, కృష్ణప్ప గౌతమ్, అవేశ్ ఖాన్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్.. ఇలా ఇంపాక్ట్గా ఎంపిక చేసుకుంది. ఆయుష్ బదోని ప్రదర్శన మాత్రం గొప్పగా ఏమీ లేదు. ఎలిమినేటర్ మ్యాచ్లో కేల్ మేయర్స్ బదులు బౌలింగ్కు వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ యశ్ ఠాకూర్ ఉత్తమ ప్రదర్శన ఇచ్చాడు. కీలకమైన మూడు వికెట్లు తీశాడు. అయితే, లఖ్నవూ ఎలిమినేటర్లోనే ఓడిపోయింది.
- ముంబయి ఇండియన్స్: ముంబయి ఇండియన్స్ ఏకంగా కెప్టెన్ను ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకుంది. రోహిత్ శర్మతోపాటు మిస్టర్ 360 బ్యాటర్ సూర్యకుమార్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, నెహాల్ వధెరా ఇంపాక్ట్ ప్లేయర్లుగా బరిలోకి దిగి అదరగొట్టారు. అయితే, రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో కంకేషన్ సబ్స్టిట్యూట్గా ముంబయి తరఫున బరిలోకి దిగిన విష్ణు వినోద్ మాత్రం ఘోరంగా విఫలం కావడం ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇషాన్ కిషన్ గాయపడటంతో విష్ణు క్రీజ్లోకి వచ్చి సరిగా ఆడలేదు.
- రాజస్థాన్ రాయల్స్: సంజూ నాయకత్వంలోని రాజస్థాన్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్తో మిశ్రమ ఫలితాలను నమోదు చేసింది. హెట్మెయిర్ జోరుగా ఆడాడు. ఓబెడ్ మెక్కాయ్, రియాన్ పరాగ్, దేవదత్ పడిక్కల్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయారు. భారీగా ఆశలు పెట్టుకున్న రియాన్ పరాగ్ ఈసారి ఘోరంగా విఫలమై జట్టులో స్థానం ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు. సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్కు గురయ్యాడు. రాజస్థాన్కు ఇంపాక్ట్ పెద్దగా కలిసిరాలేదు.
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: గాయం కారణంగా కెప్టెన్ డుప్లెసిస్ కొన్ని మ్యాచుల్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. బ్యాటింగ్లో అదరగొట్టేశాడు. ఆర్సీబీ ఎక్కువగా బౌలర్ హర్షల్ పటేల్ కోసం ఇంపాక్ట్ రూల్ను వాడుకుంది. అనుజ్ రావత్తో బ్యాటింగ్ చేయించి హర్షల్తో బౌలింగ్ వేయించుకుంది. కానీ, హర్షల్ ఒకటీ రెండు మ్యాచుల్లో మినహా గొప్పగా రాణించలేదు. ప్రత్యర్థులను కట్టడి చేయడంలో విఫలమయ్యాడు.
- కోల్కతా నైట్రైడర్స్: కేకేఆర్కు వెంకటేశ్ అయ్యర్ రూపంలో ఆల్రౌండర్ ఉన్నప్పటికీ.. అది బౌలింగ్ ప్రతిభను వాడుకోలేదు. మెరుపు ఇన్నింగ్స్లతో అయ్యర్ అలరించాడు. సుయాశ్ శర్మ మ్యాజిక్ స్పెల్తో బెంగళూరుపై విజృంభించాడు. ఇక ఆ తర్వాత గొప్ప ప్రదర్శన మాత్రం చేయలేకపోయాడు. వెంకటేశ్, సుయాశ్, అనుకుల్ మధ్యే ఇంపాక్ట్ కుర్చీ తిరిగింది. తొలుత బౌలింగ్ అయితే జట్టులోకి సుయాశ్ను తీసుకొని.. కీలక సమయంలో వెంకటేశ్ అయ్యర్ను బ్యాటింగ్ దించింది. ఎక్కువ మ్యాచుల్లో ఇంపాక్ట్ రూల్ కోల్కతాకు అక్కరకు రాకుండాపోయింది.
- పంజాబ్ కింగ్స్: పంజాబ్ కింగ్స్లో రిషి ధావన్ను బౌలింగ్ కోసం వినియోగించుకుని.. బ్యాటింగ్కు వచ్చేసరికి ప్రభ్సిమ్రన్ సింగ్ను క్రీజ్లోకి తీసుకొచ్చింది. ఇద్దరూ తమ వంతు న్యాయం చేశారు. అలాగే రాహుల్ చాహర్ - భానుక రాజపక్స కూడా జట్టుపై ప్రభావం చూపారు. మిగతా ఆటగాళ్లు సరైన ప్రదర్శన ఇవ్వకపోవడంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో దిగువనే ఉండిపోవాల్సి వచ్చింది.
- దిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్.. వీరిద్దరూ దిల్లీ ప్రధాన జట్టులో ఉండాల్సిన ఆటగాళ్లు. కానీ, కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా అప్పుడప్పుడు వచ్చిపోయారు. పెద్దగా ప్రభావం చూపిన దాఖలాలు అస్సల్లేవు. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజర్ వంటి బౌలర్లు మాత్రం తమ పాత్రకు న్యాయం చేశారు. ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. బ్యాటింగ్ విభాగంలో దిల్లీకి ‘ఇంపాక్ట్’ రూల్ కలిసిరాలేదు.
- సన్రైజర్స్ హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన గొప్పగా లేదు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం ఎస్ఆర్హెచ్దే. అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, నటరాజన్, అన్మోల్ప్రీత్ సింగ్, కార్తిక్ త్యాగి ‘ఇంపాక్ట్’గా వచ్చారు. వీరిలో అందరూ సింగిల్ షో చేసినవారే అధికం. నిలకడగా నటరాజన్ బౌలింగ్ తప్ప... అన్మోల్, రాహుల్, అబ్దుల్ సమద్ జట్టును గెలిపించిన ఇన్నింగ్స్లు లేవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు