INDIA W vs BARBADOS W : ఓడితే ఇంటికే.. బార్బడోస్ను తక్కువగా అంచనా వేస్తే కష్టమే!
తొలి మ్యాచ్లో తడబడినా.. తదుపరి పోరులో పాక్ను చిత్తు చేసి సెమీస్ రేసులో నిలబడింది భారత మహిళల క్రికెట్ జట్టు. కామన్వెల్త్ గేమ్స్లో భాగంగా ఇవాళ బార్బడోస్తో...
కామన్వెల్త్ గేమ్స్లో మహిళల భారత జట్టుకు కీలక పోరు
ఇంటర్నెట్ డెస్క్: తొలి మ్యాచ్లో తడబడినా.. తదుపరి పోరులో పాక్ను చిత్తు చేసి సెమీస్ రేసులో నిలబడింది భారత మహిళల క్రికెట్ జట్టు. కామన్వెల్త్ గేమ్స్లో భాగంగా ఇవాళ బార్బడోస్తో కీలక పోరుకు సిద్ధమైంది. మరి ఈ మ్యాచ్లో ఎవరు ఆధిక్యం సాధిస్తారు.. బలాలేంటి.. గెలుపోటములు ఎవరికి ఎలా ఉన్నాయి..?
ఓడితే.. ఇక అంతే సంగతులు
గ్రూప్ -Aలో ఆసీస్ (4), భారత్ (2), బార్బడోస్ (2), పాకిస్థాన్ (0)లు ఉన్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్కు చేరుకున్నట్లే. ఇక రెండో బెర్తు కోసం భారత్, బార్బోడస్ జట్ల మధ్యే పోటీ. ఇవాళ రాత్రి 10.30గంటలకు (భారత కాలమానం ప్రకారం) బార్బోడస్తో జరిగే మ్యాచ్లో టీమ్ఇండియా విజయం సాధిస్తే నేరుగా సెమీస్కు దూసుకెళ్తుంది. ఒక వేళ ఓడితే మాత్రం సెమీస్ ఆశలు గల్లంతైనట్లే. బార్బోడస్కు సెమీస్ బెర్తు ఖరారు అవుతుంది. అప్పుడు ఈ గ్రూప్ నుంచి ఆసీస్తోపాటు బార్బడోస్ జట్లు సెమీఫైనల్కు చేరుకుంటాయి. భారత్, పాక్ ఇంటిముఖం పట్టక తప్పదు. ఆసీస్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ కూడా ఇవాళే ఉంది.
పాక్నే ఓడించింది.. బీ కేర్ఫుల్
క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం లేని జట్టు బార్బడోస్ మహిళా క్రికెట్ టీమ్. కానీ పాకిస్థాన్ వంటి జట్టుకే షాక్ ఇస్తూ తమ తొలి మ్యాచ్లో విజయం సాధించడం విశేషం. మొదటి మ్యాచ్లో తమ జట్టు సాధించిన 144 పరుగులను బార్బోడస్ బౌలర్లు కాపాడుకుని మరీ గెలిచారు. కాబట్టి బార్బడోస్ బౌలింగ్ను భారత క్రికెటర్లు తక్కువగా అంచనా వేస్తే మాత్రం బోర్లాపడటం ఖాయం. కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఆల్రౌండ్ ప్రదర్శనతో బార్బడోస్ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించింది. ఆమెతో పాటు షకెరా చాలా పొదుపుగా బౌలింగ్ చేసింది. భారత బ్యాటర్లు మాత్రం వారిద్దరితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కైసియా నైట్ పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో అర్ధశతకం సాధించింది.
మన బౌలింగ్ అదుర్స్..
కామన్వెల్త్ గేమ్స్ తొలి మ్యాచ్లో ఆసీస్పై ఆఖరివరకు పోరాడి ఓటమిపాలైంది టీమ్ఇండియా. అయితే తర్వాత సెమీస్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్లో పాక్పై అద్భుత విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్ సహా అన్ని విభాగాల్లో రాణించి పాక్ను చిత్తు చేసింది. వర్షం వల్ల బౌలింగ్కు అనుకూలించిన పిచ్ను సద్వినియోగం చేసుకున్న టీమ్ఇండియా బౌలర్లు.. పాక్ బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 99 పరుగులకే ఆలౌట్ చేశారు. బ్యాటింగ్లోనూ ఓపెనర్ స్మృతీ మంధాన (63*) ధాటిగా ఆడేయడంతో భారీగా నెట్ రన్రేట్ పెరిగిపోయింది. ఇలాంటి ప్రదర్శనే బార్బడోస్ మీదా చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి జరుగుతున్న మహిళల క్రికెట్లో పతకం తేవాలంటే ప్రతి మ్యాచ్లోనూ విజయం సాధించాల్సిందే.
జట్ల వివరాలు (అంచనా):
భారత్: స్మృతీ మంధాన, షఫాలీ వర్మ, యస్తికా భాటియా, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, దీప్తి శర్మ, రాధా యాదవ్, స్నేహ్ రాణా, మేఘ్నా సింగ్, రేణుకా సింగ్
బార్బడోస్: హేలే మాథ్యూస్ (కెప్టెన్), డాటిన్, నైట్, కైషోనా నైట్, అలియా అలెన్, అలిసా స్కాట్లెబరీ, షకెరా సెల్మాన్, షమిలియా కానెల్, విలియమ్స్, బ్రూస్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు