IPL 2024 - WPL 2024: ఐపీఎల్ - డబ్ల్యూపీఎల్ ఫైనల్స్.. ఈ పోలికలను గమనించారా?
ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు డబ్ల్యూపీఎల్ జరిగిన సంగతి తెలిసిందే. అందులో విజేతగా ఆర్సీబీ వుమెన్ జట్టు నిలిచింది. ఇప్పుడు ఐపీఎల్లో కేకేఆర్ ఛాంపియన్. ఈ రెండింటి మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఒకటి. బీసీసీఐ ఆధ్వర్యంలో 17 సీజన్ల నుంచి దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈసారి కోల్కతా నైట్రైడర్స్ ఛాంపియన్గా నిలిచి మూడోసారి కప్ను సొంతం చేసుకుంది. బీసీసీఐ మరొక టోర్నీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మహిళల కోసం ‘వుమెన్ ప్రీమియర్ లీగ్’ను (WPL) గతేడాది నుంచి ప్రారంభించింది. ఈ సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వుమెన్ జట్టు నిలిచింది. అయితే, ఇప్పుడీ కేకేఆర్ విజయానికి.. అప్పుడు ఆర్సీబీడబ్ల్యూ టీమ్ గెలుపు మధ్య కొన్ని ఆసక్తికర పోలికలు నెట్టింట వైరల్గా మారాయి. అవేంటో ఓ లుక్కేద్దాం..
- డబ్ల్యూపీఎల్ ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్ - ఆర్సీబీ డబ్ల్యూ తలపడ్డాయి. డీసీని ఆసీస్ ప్లేయర్ మెగ్ లానింగ్ నడిపించగా.. ఆర్సీబీకి భారత స్టార్ స్మృతీ మంధాన కెప్టెన్సీ చేసింది.
- ఐపీఎల్ ఫైనల్లో సన్రైజర్స్కు ఆసీస్ స్టార్ ఆటగాడు పాట్ కమిన్స్ నాయకత్వం వహించగా.. కోల్కతాకు భారత ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఉన్నాడు.
- డబ్ల్యూపీఎల్లో టాస్ నెగ్గిన దిల్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఐపీఎల్లోనూ ఎస్ఆర్హెచ్ అదే నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
- మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. ఇక ఐపీఎల్లో హైదరాబాద్ కూడా సరిగ్గా అవే పరుగులు చేసి ఇన్నింగ్స్ను ముగించింది.
- డబ్ల్యూపీఎల్లో దిల్లీ నిర్దేశించిన లక్ష్యాన్ని బెంగళూరు కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. IPL 2024లో కేకేఆర్ కూడా 8 వికెట్ల తేడాతో గెలిచింది.
- ఐపీఎల్ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఆసీస్ క్రికెటర్ మిచెల్ స్టార్క్ అందుకోగా.. WPL 2024లోనూ ఆసీస్ ప్లేయర్ సోఫీ మోలినెక్స్ దక్కించుకోవడం గమనార్హం.
- రెండు టోర్నీల్లోనూ భారత జట్టుకు చెందిన ప్లేయర్లే కెప్టెన్గా ఉన్న టీమ్లు టైటిల్ను అందుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం