IND vs AUS: అప్పుడు ఫాలోఆన్ ఆడించి ప్రమాదంలో పడి.. దిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లివే..
భారత్, ఆసీస్ (IND vs AUS) మధ్య ఫిబ్రవరి 17 నుంచి రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్కు దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మైదానంలో ఇప్పటివరకు భారత్, ఆసీస్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ల ఫలితాలపై ఓ లుక్కేద్దాం..
బోర్డర్-గావస్కర్ సిరీస్లో భాగంగా నాగ్పుర్లో జరిగిన తొలి టెస్టులో స్పిన్ మంత్రంతో ఆసీస్ను ఓడించింది టీమ్ఇండియా. రెండో టెస్టులోనూ ఇదే వ్యూహంతో మరోసారి ‘కంగారు’ పెట్టించాలని ఆశిస్తోంది. ఫిబ్రవరి 17 నుంచి దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రెండో టెస్టు జరుగనుంది. ఈ మైదానం ఐదేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తుండటంతో అభిమానులు పోటెత్తే అవకాశం ఉంది. ఇక్కడ చివరగా 2017 డిసెంబరులో భారత్, శ్రీలంక మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య ఏడు టెస్టులు జరిగాయి. మరి ఏ టెస్టులో ఎవరు విజయం సాధించారో తెలుసుకుందాం.
ఆసీస్ ఇన్నింగ్స్ విజయం
అరుణ్ జైట్లీ (గతంలో ఫిరోజ్ షా కోట్ల) మైదానంలో 1959లో భారత్, ఆసీస్ తొలిసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్లో టీమ్ఇండియాపై కంగారు జట్టు ఇన్నింగ్స్ 127 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 135 పరుగులకు కుప్పకూలగా.. ఆసీస్ 468 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 206 రన్స్ చేసి చేతులేత్తేసింది. పంకజ్ రాయ్ (99) సెంచరీ మిస్ చేసుకున్నాడు.
పదేళ్ల తర్వాత రెండో టెస్టు
సరిగ్గా పదేళ్ల తర్వాత (1969, డిసెంబర్) ఈ స్టేడియంలో భారత్, ఆసీస్ రెండోసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా ఏడు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. ఇయాన్ చాపెల్ (138) శతకం బాదడంతో మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 296 పరుగులు చేసి ఆలౌటైంది. అశోక్ మన్కడ్ (97) రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 10 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. బిషన్ సింగ్ బేడీ (5/37), ఇరపల్లి ప్రస్నన్న (5/42 ) విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్లో కంగారు జట్టు 107 పరుగులకే చాప చుట్టేసింది. అజిత్ వాడేకర్ (91) దంచికొట్టడంతో 181 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 80.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఫాలోఆన్ ఆడించి.. ప్రమాదంలో పడి..
1979 అక్టోబర్లో దిల్లీ వేదికగా జరిగిన టెస్టు డ్రాగా ముగిసింది. నిజానికి ఈ మ్యాచ్లో భారత్ గెలవాల్సింది. గుండప్ప విశ్వనాథ్ (131), సునీల్ గావస్కర్ (115) సెంచరీలు బాదడంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 510 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. కపిల్ దేవ్ (5/82)తోపాటు శివ్లాల్ యాదవ్ (2/56), బాబ్జీ నరసింహారావు (2/46) బంతితో రాణించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 298 పరుగులకు ఆలౌటైంది. దీంతో కంగారులను భారత్ ఫాలో ఆన్ ఆడించింది. కానీ, రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ పట్టుదలతో ఆడి 413 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఒకవేళ భారత్ ఫాలో ఆన్ ఆడించకపోతే ఫలితం మరోలా ఉండేది.
మూడ్రోజులు వరుణుడిదే ఆట
దిల్లీ స్టేడియంలో టీమ్ఇండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు 1986 సెప్టెంబరులో జరిగింది. దేశ రాజధానిలో భారీ వర్షాలు కురవడంతో మ్యాచ్లో తొలి మూడు రోజుల్లో ఆట సాగలేదు. ఎట్టకేలకు నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ని ఆరంభించిన ఆసీస్.. ఐదో రోజు (207/3) వద్ద డిక్లేర్డ్ చేసింది. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో భారత్ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఇటు మోంగియా.. అటు కుంబ్లే
దేశ రాజధానిలో కంగారు జట్టుతో 1996 అక్టోబర్లో ఐదో మ్యాచ్ ఆడింది భారత్. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్లో కంగారులు 182 పరుగులకు ఆలౌటయ్యారు. అనంతరం నయన్ మోంగియా (152; 366 బంతుల్లో 18 ఫోర్లు, 1 సిక్స్) శతకానికి తోడు గంగూలీ (66) చేయడంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 361 పరుగులు చేసి ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో అనిల్ కుంబ్లే (5/67), వెంకటేశ్ ప్రసాద్ (3/18) విజృంభించడంతో ఆసీస్ 234 పరుగులకు కుప్పకూలింది. 56 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
పరుగుల వరద.. గంభీర్, లక్ష్మణ్ డబుల్
అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, ఆసీస్ మధ్య ఆరో టెస్టు మ్యాచ్ (2008 అక్టోబర్ 29- నవంబర్ 2) జరిగింది. ఈ మ్యాచ్లో పరుగుల వరద పారింది. గంభీర్ (206), వీవీఎస్ లక్ష్మణ్ (200) డబుల్ మోత మోగించడంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 613/7 వద్ద డిక్లేర్డ్ చేసింది. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్లో 577 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 208/5 వద్ద డిక్లేర్డ్ చేసింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులు ఐదో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఆఖరి మ్యాచ్ మనదే
ఈ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా చివరగా 2013 మార్చిలో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అశ్విన్ (5/57)కు తోడు ప్రజ్ఞాన్ ఓజా, ఇషాంత్ శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టడంతో తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 262 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 272 రన్స్కు ఆలౌటైంది. నాథన్ లైయన్ ఏడు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్.. 164 పరుగులకు కుప్పకూలింది. 155 పరుగుల లక్ష్యాన్ని భారత్ నాలుగు వికెట్లు నష్టపోయి ఛేదించింది.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!