IND vs AUS: అప్పుడు ఫాలోఆన్ ఆడించి ప్రమాదంలో పడి.. దిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లివే..
భారత్, ఆసీస్ (IND vs AUS) మధ్య ఫిబ్రవరి 17 నుంచి రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్కు దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మైదానంలో ఇప్పటివరకు భారత్, ఆసీస్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ల ఫలితాలపై ఓ లుక్కేద్దాం..
బోర్డర్-గావస్కర్ సిరీస్లో భాగంగా నాగ్పుర్లో జరిగిన తొలి టెస్టులో స్పిన్ మంత్రంతో ఆసీస్ను ఓడించింది టీమ్ఇండియా. రెండో టెస్టులోనూ ఇదే వ్యూహంతో మరోసారి ‘కంగారు’ పెట్టించాలని ఆశిస్తోంది. ఫిబ్రవరి 17 నుంచి దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రెండో టెస్టు జరుగనుంది. ఈ మైదానం ఐదేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తుండటంతో అభిమానులు పోటెత్తే అవకాశం ఉంది. ఇక్కడ చివరగా 2017 డిసెంబరులో భారత్, శ్రీలంక మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య ఏడు టెస్టులు జరిగాయి. మరి ఏ టెస్టులో ఎవరు విజయం సాధించారో తెలుసుకుందాం.
ఆసీస్ ఇన్నింగ్స్ విజయం
అరుణ్ జైట్లీ (గతంలో ఫిరోజ్ షా కోట్ల) మైదానంలో 1959లో భారత్, ఆసీస్ తొలిసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్లో టీమ్ఇండియాపై కంగారు జట్టు ఇన్నింగ్స్ 127 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 135 పరుగులకు కుప్పకూలగా.. ఆసీస్ 468 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 206 రన్స్ చేసి చేతులేత్తేసింది. పంకజ్ రాయ్ (99) సెంచరీ మిస్ చేసుకున్నాడు.
పదేళ్ల తర్వాత రెండో టెస్టు
సరిగ్గా పదేళ్ల తర్వాత (1969, డిసెంబర్) ఈ స్టేడియంలో భారత్, ఆసీస్ రెండోసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా ఏడు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. ఇయాన్ చాపెల్ (138) శతకం బాదడంతో మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 296 పరుగులు చేసి ఆలౌటైంది. అశోక్ మన్కడ్ (97) రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 10 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. బిషన్ సింగ్ బేడీ (5/37), ఇరపల్లి ప్రస్నన్న (5/42 ) విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్లో కంగారు జట్టు 107 పరుగులకే చాప చుట్టేసింది. అజిత్ వాడేకర్ (91) దంచికొట్టడంతో 181 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 80.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఫాలోఆన్ ఆడించి.. ప్రమాదంలో పడి..
1979 అక్టోబర్లో దిల్లీ వేదికగా జరిగిన టెస్టు డ్రాగా ముగిసింది. నిజానికి ఈ మ్యాచ్లో భారత్ గెలవాల్సింది. గుండప్ప విశ్వనాథ్ (131), సునీల్ గావస్కర్ (115) సెంచరీలు బాదడంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 510 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. కపిల్ దేవ్ (5/82)తోపాటు శివ్లాల్ యాదవ్ (2/56), బాబ్జీ నరసింహారావు (2/46) బంతితో రాణించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 298 పరుగులకు ఆలౌటైంది. దీంతో కంగారులను భారత్ ఫాలో ఆన్ ఆడించింది. కానీ, రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ పట్టుదలతో ఆడి 413 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఒకవేళ భారత్ ఫాలో ఆన్ ఆడించకపోతే ఫలితం మరోలా ఉండేది.
మూడ్రోజులు వరుణుడిదే ఆట
దిల్లీ స్టేడియంలో టీమ్ఇండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు 1986 సెప్టెంబరులో జరిగింది. దేశ రాజధానిలో భారీ వర్షాలు కురవడంతో మ్యాచ్లో తొలి మూడు రోజుల్లో ఆట సాగలేదు. ఎట్టకేలకు నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ని ఆరంభించిన ఆసీస్.. ఐదో రోజు (207/3) వద్ద డిక్లేర్డ్ చేసింది. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో భారత్ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఇటు మోంగియా.. అటు కుంబ్లే
దేశ రాజధానిలో కంగారు జట్టుతో 1996 అక్టోబర్లో ఐదో మ్యాచ్ ఆడింది భారత్. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్లో కంగారులు 182 పరుగులకు ఆలౌటయ్యారు. అనంతరం నయన్ మోంగియా (152; 366 బంతుల్లో 18 ఫోర్లు, 1 సిక్స్) శతకానికి తోడు గంగూలీ (66) చేయడంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 361 పరుగులు చేసి ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో అనిల్ కుంబ్లే (5/67), వెంకటేశ్ ప్రసాద్ (3/18) విజృంభించడంతో ఆసీస్ 234 పరుగులకు కుప్పకూలింది. 56 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
పరుగుల వరద.. గంభీర్, లక్ష్మణ్ డబుల్
అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, ఆసీస్ మధ్య ఆరో టెస్టు మ్యాచ్ (2008 అక్టోబర్ 29- నవంబర్ 2) జరిగింది. ఈ మ్యాచ్లో పరుగుల వరద పారింది. గంభీర్ (206), వీవీఎస్ లక్ష్మణ్ (200) డబుల్ మోత మోగించడంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 613/7 వద్ద డిక్లేర్డ్ చేసింది. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్లో 577 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 208/5 వద్ద డిక్లేర్డ్ చేసింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులు ఐదో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఆఖరి మ్యాచ్ మనదే
ఈ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా చివరగా 2013 మార్చిలో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అశ్విన్ (5/57)కు తోడు ప్రజ్ఞాన్ ఓజా, ఇషాంత్ శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టడంతో తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 262 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 272 రన్స్కు ఆలౌటైంది. నాథన్ లైయన్ ఏడు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్.. 164 పరుగులకు కుప్పకూలింది. 155 పరుగుల లక్ష్యాన్ని భారత్ నాలుగు వికెట్లు నష్టపోయి ఛేదించింది.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
ఐపీఎల్ ముగిసిన వారం తర్వాత టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మాత్రం ఆడే అవకాశాలు తక్కువే. -
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
ముల్లాన్పుర్ వేదికగా పంజాబ్తో తలపడేందుకు ముంబయి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ రాణించాలని మాజీ క్రికెటర్ ఫించ్ వ్యాఖ్యానించాడు. -
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది. -
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ