IND vs ENG: జడేజా ఈజ్ బ్యాక్.. అతడుంటే ఓ భరోసా..!
టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు బ్యాట్తో ఇటు బంతితో టీమ్ఇండియాకు కీలకమైన ఆల్రౌండర్గా సేవలందిస్తాడు...
టీమ్ఇండియా యోధుడు..
టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు బ్యాట్తో ఇటు బంతితో జట్టుకు కీలకమైన ఆల్రౌండర్గా సేవలందిస్తాడు. ముఖ్యంగా బ్యాటింగ్ పరంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటరిపోరాటం చేయడం అతడి నైజం. ఒకరికి అండగా నిలవాలన్నా.. ఒకరు అతడికి అండగా నిలిచినా కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కిస్తాడు. లోయర్ ఆర్డర్లో కనీసం 50 పరుగులు చేసి జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడు. అందుకే అతడంటే ఓ భరోసా..
జడ్డూ రాకముందు.. వచ్చాక..
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో భాగంగా ఐదో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అలాంటిది చివరికి 416 పరుగులు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. జడేజా క్రీజులోకి రాకముందు.. వచ్చాక అదీ పరిస్థితి. టాప్ఆర్డర్ మొత్తం విఫలమైనా లోయర్ ఆర్డర్లో మిగిలిన బ్యాట్స్మెన్తో కలిసి సుమారు 300 పరుగులు జోడించాడు. దీన్ని బట్టే అతడు ఈ మ్యాచ్లో ఎలాంటి పాత్ర పోషించాడో అర్థం చేసుకోవచ్చు. తొలుత రిషభ్ పంత్ (146; 111 బంతుల్లో 20x4, 4x6)తో కలిసి ఆరో వికెట్కు 222 పరుగుల విలువైన భాగస్వామ్యం నిర్మించిన జడ్డూ తర్వాత షమి(16)తో కలిసి ఎనిమిదో వికెట్కు 48 పరుగులు అందించాడు. అయితే, ఇక్కడ పంతే సగం పరుగులు చేసినా.. టీమ్ఇండియా 400 పైచిలుకు స్కోర్ చేసిందంటే దానికి కారణం జడేజానే.
పరిణతితో ఆడిన తీరు..
అయితే, ఈ మ్యాచ్లో జడేజా క్రీజులోకి రాగానే ఎడాపెడా బౌండరీలు బాదలేదు. నెమ్మదిగా ఇన్నింగ్స్ నడిపించాడు. పంత్కు సహకరిస్తూనే బ్యాటింగ్ కొనసాగించాడు. ఒకవైపు పంత్ చెలరేగుతుంటే మరోవైపు స్ట్రైక్రొటేట్ చేశాడు. దీంతో ఇద్దరూ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే వడివడిగా పరుగులు సాధిస్తూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. అలా తొలుత 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక.. దాన్ని 100.. 150.. చివరికి 222 పరుగులకు చేర్చారు. అయితే, పంత్ ఔటయ్యాక కూడా జడేజా ఎలాంటి తడబాటుకు గురవ్వలేదు. ఎక్కడా తొందరపడలేదు. తొలిరోజు 83 పరుగుల వద్ద నిలిచిన అతడు రెండోరోజు ఆట ఆరంభంలోనూ ఎంతో సంయమనంతో ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లు చురకత్తుల్లాంటి బంతులేస్తున్నా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. షమి వంటి టెయిలెండర్తో కలిసి 48 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. టీమ్ఇండియా ఇలా టెస్టుల్లో 100లోపే 5 వికెట్లు కోల్పోయాక 400 పైచిలుకు పరుగులు చేయడం ఇది మూడోసారి మాత్రమే. అంతగొప్ప ప్రదర్శనకు జడేజా కూడా కారణం.
ఈ మ్యాచ్కు ముందు జడ్డూ పరిస్థితి ఇదీ..
కాగా, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు జడేజా ఇలా రాణించడం ఇదేం కొత్త కాదు. కానీ, ఇటీవల జరిగిన భారత టీ20 లీగ్ 15వ సీజన్లో అతడు ఘోరంగా విఫలమయ్యాడు. ఈసారి టీ20 లీగ్లో టోర్నీ ప్రారంభానికి ముందే చెన్నై కెప్టెన్గా ఎంపికైన అతడు ఆ జట్టును నడిపించడంలో పూర్తిగా తడబడ్డాడు. ఒత్తిడికి చిత్తయి చేతులెత్తేశాడు. సారథిగానే కాకుండా బ్యాట్స్మన్గానూ తేలిపోయాడు. 8 మ్యాచ్లకు నాయకత్వం వహించి కేవలం రెండు విజయాలే సాధించాడు. అలాగే బ్యాట్స్మన్గా 10 మ్యాచ్ల్లో 116 పరుగులే చేశాడు. స్ట్రైక్రేట్ 19.33గా నమోదైంది. గత నాలుగేళ్లలో ఇదే అత్యంత దారుణ ప్రదర్శన. దీన్ని బట్టి జడేజా కెప్టెన్గా ఎంపికై ఎంత ఒత్తిడికి గురయ్యాడో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే మధ్యలో ఆ బాధ్యతల నుంచి తప్పుకొని తిరిగి ఆటగాడిగా కొనసాగాడు. అయినా సరిగ్గా ఆడలేకపోయాడు. అయితే, ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ బయోబబుల్ వీడి ఇంటికెళ్లాడు. చెన్నై టీమ్ గాయం కారణంగా ఆడట్లేదని చెప్పింది. దీంతో అతడు ఇప్పట్లో కోలుకోవడం కష్టమని పలువురు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, ఇంతలోనే తిరిగి భారత జట్టులోకి వచ్చి నేరుగా తొలి మ్యాచ్లోనే ఇప్పుడు అద్భుత ప్రదర్శన చేయడం విశేషం.
జడేజా ఆదుకున్న మ్యాచ్లు..
* గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో ఇదే సిరీస్లోని తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా టాప్ ఆర్డర్ విఫలమైనా జడేజా (56; 86 బంతుల్లో 8x4, 1x6) అర్ధ శతకంతో రాణించాడు. దీంతో జట్టు 95 పరుగుల ఆధిక్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, చివరికి ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
* ఈ ఏడాది టీ20 లీగ్కు ముందు మొహాలి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఏకంగా 175 పరుగులు చేశాడు. ఇది అతడి కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్. దాంతో టీమ్ఇండియా 574/8 (డిక్లేర్డ్) భారీ స్కోర్ చేసింది. ఆపై బౌలింగ్లో రెండు ఇన్నింగ్స్ల్లోనూ కలిపి 9 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయం సాధించింది.
* 2020లో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్లో జడేజా తొలి ఇన్నింగ్స్లో 57 పరుగులు చేశాడు. బౌలింగ్లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 3 వికెట్లు తీశాడు. దీంతో ఈ మ్యాచ్లో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు.
* 2019లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లోనూ జడేజా 81 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్లో టీమ్ఇండియా 622/7 (డిక్లేర్డ్ ) భారీ స్కోర్ చేసింది. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 300 పరుగులు చేయగా జడేజా నాలుగు వికెట్లు తీశాడు. అయితే, ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
* 2018లో ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్లోనూ జడేజా 86 (నాటౌట్) పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అలాగే బౌలింగ్లో రెండు ఇన్నింగ్స్ల్లో మొత్తం కలిపి 7 వికెట్లు తీశాడు. అయితే, ఈ మ్యాచ్లో టీమ్ఇండియా ఓటమిపాలైంది.
* 2017లో శ్రీలంక పర్యటనలో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో తొమ్మిదో నంబర్ ఆటగాడిగా వచ్చిన జడేజా 70 పరుగులు చేశాడు. బౌలింగ్లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి మరోసారి 7 వికెట్లు సాధించాడు. దీంతో టీమ్ఇండియా ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో విజయం సాధించడంలో తనవంతు మెరిశాడు.
* 2017లోనే ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో జడేజా 63 పరుగులు చేశాడు. బౌలింగ్లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది.
* 2015లో మొహాలి వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడిన తొలి టెస్టులో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 201 పరుగులే చేసింది. అందులో జడేజా (38) రెండో టాప్ స్కోరర్. అనంతరం ఆ జట్టు 184 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసిన జడ్డూ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీశాడు. దీంతో టీమ్ఇండియా విజయంలో మరోసారి కీలకంగా ఆడాడు.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ