IND vs ENG: కట్టడి చేయలేకపోయారు.. కప్పు సాధించలేకపోయారు
ఇంగ్లాండ్లో టీమ్ఇండియా ఇదివరకు మూడుసార్లు టెస్టు సిరీస్లు సాధించినా ఎన్నడూ 3 మ్యాచ్లు గెలిచి ఆధిపత్యం చెలాయించ లేదు...
టీమ్ఇండియా ఓటమికి కారణాలు ఇవేనా?
ఇంగ్లాండ్లో టీమ్ఇండియా ఇదివరకు మూడుసార్లు టెస్టు సిరీస్లు సాధించినా ఎన్నడూ 3 మ్యాచ్లు గెలిచి ఆధిపత్యం చలాయించలేదు. అయితే, ఈ సిరీస్లో ఐదో టెస్టుకు ముందే 2-1 ఆధిక్యంలో నిలవడంతో ఈసారి చరిత్ర తిరగరాస్తుందని అంతా అనుకున్నారు. అయితే.. జోరూట్, బెయిర్ స్టో టీమ్ఇండియా ఆశలకు గండి కొట్టారు. భారత బౌలర్లు వారిద్దరినీ కట్టడి చేయలేకపోయారు. భారత్ కప్పు సాధించలేకపోవడానికి కారణాలను పరిశీలిస్తే..
ప్రమాదం అని తెలిసినా..
ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జానీ బెయిర్ స్టో, జోరూట్ ప్రస్తుతం తమ కెరీర్ల్లోనే అత్యుత్తమ ఫామ్లో ఉన్నారు. వీరిద్దరూ ఈ ఏడాది శతకాల మీద శతకాలు బాదేస్తున్నారు. 2022లో బెయిర్స్టో ఈ ఫార్మాట్లో 6 శతకాలు బాదగా.. రూట్ 5 శతకాలు సాధించాడు. మరీ ముఖ్యంగా ఇటీవల న్యూజిలాండ్తో ఆడిన సిరీస్లో ఇంగ్లాండ్ గెలవడానికి వీరే కారణం. బెయిర్స్టో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 136, నాలుగో టెస్టులో 162, 71 నాటౌట్ పరుగులు చేసి అద్భుతంగా ఆడాడు. మరోవైపు రూట్ కూడా తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో 115 నాటౌట్, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 176 పరుగులు చేసి గొప్పగా రాణించాడు. అంత ఫామ్లో ఉన్న ఆటగాళ్లపై టీమ్ఇండియా ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు కనిపించలేదు. ఒకవేళ ఏమైనా ప్రణాళికలు రచించినా అవి పనిచేసినట్లు అనిపించలేదు.
కోహ్లీ ఇక ఆలోచించాల్సిందే..
టీమ్ఇండియా ఓటమికి మరో ప్రధాన కారణం మాజీ కెప్టె్న్ విరాట్ కోహ్లీ (11, 20) బ్యాటింగ్. ఈ మాటలు చెప్పడానికి కష్టంగానే ఉన్నా గత రెండున్నరేళ్లుగా సరైన ఫామ్లో లేడనేది ఎవరైనా అంగీకరించాల్సిన విషయం. అతడు ఫామ్లో లేడని తెలిసి కూడా ఈ సిరీస్కు ఎంపిక చేశారు. భారత టీ20 లీగ్ 15వ సీజన్లోనూ విఫలమైనా టోర్నీ పూర్తయ్యాక తగినంత విశ్రాంతి ఇచ్చారు. అయినా ఏమాత్రం ఉపయోగం లేకపోయింది. ఎంత గొప్ప ఆటగాడైనా కెరీర్లో ఒడుదొడుకులు ఎదుర్కోవడం సహజమే. కానీ, మరీ ఇంతకాలం విఫలమవ్వడం ఒకింత ఆలోచించాల్సిన విషయం. మరోవైపు ఈ మ్యాచ్లో అతడి ఆటతీరులో కొంచెం మార్పు కనిపించిందనేది కాదనలేని వాస్తవం. ముఖ్యంగా ఆడింది కొన్ని షాట్లే అయినా.. అందులో తన క్లాస్ చూపించాడు. కానీ, అతడు భారీ ఇన్నింగ్స్ ఆడకపోవడమే జట్టు ఓటమికి ఒక కారణంలా మిగిలింది. ఇక అతడిప్పుడు ఏదో ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. పలువురు నెటిజన్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ సరిగ్గా ఆడకపోతే జట్టుకు కష్టమేనని అంటున్నారు.
ఆ ముగ్గురూ దెబ్బకొట్టారు..
ఇక టీమ్ఇండియాలో చెప్పుకోవాల్సింది టాప్ ఆర్డర్ వైఫల్యం గురించి. ఓపెనర్ శుభ్మన్గిల్ (17, 4), వన్డౌన్ బ్యాట్స్మన్ హనుమ విహారి (20, 11), మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (15, 19).. ఈ ముగ్గురూ పూర్తిగా తేలిపోయారు. గతేడాది ఇదే సిరీస్లో ఓపెనర్లుగా ఆడిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఒకరుకాకపోతే మరొకరు జట్టును ఆదుకున్నారు. కానీ, ఈ మ్యాచ్లో గిల్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ విఫలమయ్యాడు. అలాగే మరో ఓపెనర్గా వచ్చిన పుజారా (13, 66) తొలి ఇన్నింగ్స్లో తడబడినా రెండో ఇన్నింగ్స్లో ఫర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్కు ముందు అతడు కౌంటీ క్రికెట్లో రెండు సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు బాదడంతో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. కానీ, వాటిని అతడు అందుకోలేకపోయాడు. మరోవైపు విహారి ఓపెనర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు ఎక్కడైనా ఆడగలడు. కానీ, వన్డౌన్ బ్యాట్స్మన్గా వచ్చి నిరాశర్చాడు. చివరగా శ్రేయస్ అయ్యర్ షార్ట్పిచ్ బంతుల బలహీనతను పసిగట్టిన ఇంగ్లాండ్ వాటితోనే రెండు ఇన్నింగ్స్ల్లోనూ ఔట్చేసింది. ఈ ముగ్గురిలో ఏ ఇద్దరు బాగా ఆడినా పరిస్థితులు మరోలా ఉండేవి.
ఇంగ్లాండ్ దూకుడు మంత్రం..
మరోవైపు టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 132 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించినా ఇంగ్లాండ్ ఎక్కడా భయపడలేదు. ఏదేమైనా దూకుడుగా ఆడాలనే ప్రణాళికతోనే బరిలోకి దిగింది. అందుకు తగ్గట్టే ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ను ఆరంభించింది. ఓపెనర్లు అలెక్స్ లీస్ (56), జాక్ క్రాలే (46) ఆది నుంచి అలాగే ఆడుతూ భారత బౌలర్ల లయను దెబ్బ తీశారు. బుమ్రా, షమి, సిరాజ్ల బౌలింగ్ను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. దీంతో 9 ఓవర్లకే 50 పరుగులు.. 20 ఓవర్లకే 100 పరుగుల స్కోర్ సాధించారు. దీంతో తొలి వికెట్కు 107 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. అయితే, స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయినా ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. తర్వాత వచ్చిన రూట్ (142), బెయిర్స్టో (114) ఆదిలో వికెట్ కాపాడుకునేందుకు కాస్త నెమ్మదిగా ఆడినా క్రీజులో కుదురుకున్నాక పోటీపడి పరుగులు చేశారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికే చెరో 70కిపైగా పరుగులు చేసి ఇంగ్లాండ్కు విజయంపై భరోసాను కలిగించారు.
హెచ్చరికలు పట్టించుకోలేదు..
అయితే, ఈ మ్యాచ్కు ముందే ఇంగ్లాండ్ సారథి బెన్స్టోక్స్ తమ ఆటతీరు గురించి స్పష్టంగా చెప్పాడు. కివీస్పై ఆడిన దూకుడు మంత్రాన్నే టీమ్ఇండియాపైనా ప్రయోగిస్తామని తెలిపాడు. అయినా, భారత్ అతడి మాటలను పట్టించుకున్నట్లు కనిపించలేదు. అందుకు నిదర్శనమే రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ యూనిట్ పూర్తిగా చేతులెత్తేయడం. తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లతో మెరిసిన సిరాజ్ రెండో ఇన్నింగ్స్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. బుమ్రా, షమి సైతం పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. రూట్, బెయిర్స్టో, స్టోక్స్ లాంటి కీలక ఆటగాళ్లతో ఇలాంటి ముఖ్యమైన మ్యాచ్లో ప్రతిఘటన ఎదురవుతుందని ఎక్కడా అంచనా వేసినట్లు కనిపించలేదు. బౌలింగ్లో పసలేకపోవడం.. ఫీల్డింగ్లో పలు తప్పిదాలు.. బంతులు ఎక్కువగా లెగ్సైడ్ వేయడం వంటివన్నీ టీమ్ఇండియా ప్రణాళికలో లోపాలుగా కనిపిస్తున్నాయి. దీంతో జట్టు ఓటమికి ఇవన్నీ కారణాలుగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఇలా తొలి ఇన్నింగ్స్లో అద్భుత ఆధిక్యం సంపాదించినా.. చివరికి ఓడిపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. ఈ నేపథ్యంలో రాబోయే పరిమిత ఓవర్ల సిరీస్ల్లోనైనా గెలవాలని ఆశిద్దాం.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ