IND vs ENG: ఇంగ్లాండ్తో పోరు...ఆశలన్నీ బౌలర్లపైనే..
ఇంగ్లాండ్తో కఠిన సవాలును ఎదుర్కోవడానికి టీమ్ఇండియా సీనియర్ జట్టు సిద్ధమవుతోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా శుక్రవారం నుంచి జరిగే కీలక పోరులోనూ విజయం...
ఇంగ్లాండ్తో కఠిన సవాలును ఎదుర్కోవడానికి టీమ్ఇండియా సీనియర్ జట్టు సిద్ధమవుతోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా శుక్రవారం నుంచి జరిగే కీలక పోరులోనూ విజయం సాధించి.. గతేడాది 2-1తో నిలిచిన ఆధిక్యాన్ని 3-1గా మార్చి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. దీంతో ఇంగ్లిష్ గడ్డపైనా చారిత్రక విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే, అదంత తేలికేం కాదు.. ఇప్పటికే బ్యాటింగ్లో ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరమవడం.. కెప్టెన్ రోహిత్ కరోనా బారినపడటం.. కోహ్లీ, పూజారాల ఫామ్లపై అనుమానాలు.. ఇవన్నీ చూస్తుంటే బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ గతవారమే న్యూజిలాండ్పై టెస్టు సిరీస్ క్లీన్స్వీప్ చేసిన నేపథ్యంలో.. టీమ్ఇండియా ఆశలన్నీ ఇప్పుడు బౌలింగ్ దళంపైనే ఆధారపడ్డాయి.
ఇంగ్లిష్ బ్యాటర్లను చుట్టేస్తారా?
గతేడాది ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్లో నాలుగు ఆటలు పూర్తయ్యేసరికి భారత్ ఒక మ్యాచ్ డ్రా చేసుకొని 2-1 ఆధిక్యంలో నిలిచింది. అయితే, గతంలో కరోనా కారణంగా వాయిదాపడిన ఐదో టెస్టును ఇప్పుడు తిరిగి నిర్వహిస్తున్నారు. అప్పుడు భారత బౌలర్ల విజృంభించడంతో లార్డ్స్, ఓవల్ మ్యాచ్లను సొంతం చేసుకుంది. ఇక్కడ ప్రధాన పేసర్లు.. జస్ప్రిత్ బుమ్రా 4 మ్యాచ్ల్లో 18, మహ్మద్ సిరాజ్ 4 మ్యాచ్ల్లో 14, మహ్మద్ షమి 3 మ్యాచ్ల్లో 14, శార్దూల్ ఠాకూర్ 2 మ్యాచ్ల్లో 7 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
ట్రెంట్బ్రిడ్జ్లో జరిగిన ఆరంభ టెస్టులో తొలిరోజు పేసర్లు నిప్పులు చెరగడంతో ఇంగ్లాండ్ 65.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా 4, షమి 3, శార్దూల్ 2 వికెట్లతో రాణించారు. ఇక లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్లో టీమ్ఇండియా ఇంగ్లాండ్ ముందు 272 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అది కూడా చివరిరోజు ఆటలో 60 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్న కఠిన పరిస్థితుల్లో! కానీ, భారత బౌలర్లు మరోసారి కట్టుదిట్టంగా బంతులేసి ఇంగ్లాండ్ పని పట్టారు. కేవలం 51.5 ఓవర్లలోనే 120 పరుగులకు ఆలౌట్ చేశారు. సిరాజ్ 4, బుమ్రా 3 వికెట్లు తీయడంతో టీమ్ఇండియా విజయం సాధించింది. చివరగా ఓవల్లో జరిగిన నాలుగో టెస్టులో 367 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ను టీమ్ఇండియా 210 పరుగులకే పరిమితం చేసింది. ఉమేశ్ యాదవ్ 3, బుమ్రా 2, జడేజా 2, శార్దూల్ 2 వికెట్లతో సమష్టిగా రాణించారు.
ఇంగ్లిష్ జట్టుపై భారత బౌలర్ల రికార్డు
శార్దూల్, అశ్విన్లలో ఎవరు?
అయితే, భారత్లో జరిగే మ్యాచ్లకు అశ్విన్ ప్రధాన స్పిన్నర్గా ఉంటాడనే సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఇంగ్లాండ్ పిచ్లు పేస్కు అనుకూలం కాబట్టి.. గత సిరీస్లో టీమ్ఇండియా నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ వ్యూహంతో బరిలోకి దిగింది. దీంతో జడేజాను తుది జట్టులోకి తీసుకొని.. బ్యాట్స్మన్, బౌలింగ్ సేవలను వినియోగించుకుంది. మరోవైపు ఇంగ్లాండ్ అనే కాకుండా మిగతా విదేశీ సిరీస్ల్లోనూ టీమ్ఇండియా చాలా వరకు ఇదే వ్యూహాన్ని అమలు చేస్తుంది. అవసరాన్ని బట్టి అశ్విన్ను ఆడిస్తుంది. కానీ, గతేడాది మాత్రం అతడి లాంటి కీలక స్పిన్నర్ను రిజర్వ్ బెంచ్కే పరిమితం చేసింది. అయితే రేపటి నుంచి ప్రారంభమయ్యే చివరి టెస్టుకు తుది జట్టులో ఆడనిస్తారో లేదో చూడాలి. మరోవైపు బుమ్రా, సిరాజ్, షమి తుది జట్టులో ఉండొచ్చని తెలుస్తోంది. నాలుగో బౌలర్గా శార్దూల్, అశ్విన్లలో ఎవరికైనా అవకాశం ఇవ్వొచ్చు. పిచ్ పరిస్థితులను బట్టి ఆఖరి నిమిషంలో తుది నిర్ణయం తీసుకునే వీలుంది. ఎందుకంటే వీరిద్దరూ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల సమర్థులే.
ఎడ్జ్బాస్టన్లో ఎవరు రాణించారంటే?
అయితే, 2018లో టీమ్ఇండియా చివరిసారి ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లాండ్తో టెస్టు మ్యాచ్ ఆడింది. అప్పుడు గెలవాల్సిన మ్యాచ్ను త్రుటిలో కోల్పోయింది. ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 287 పరుగులు చేయగా.. రూట్ (80), బెయిర్స్టో (70) అర్ధశతకాలతో రాణించారు. టీమ్ఇండియా బౌలర్లు అశ్విన్ 4, షమి 3 వికెట్లు తీసి మంచి ప్రదర్శన చేశారు. ఇక టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 274 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్గా ఉన్న కోహ్లీ (149) ఒక్కడే రాణించాడు. సామ్ కరన్ 4, అండర్సన్ 2 వికెట్లు తీశారు. దీంతో ఇంగ్లాండ్ 13 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ 180 పరుగులకే కుప్పకూలగా.. ఇషాంత్ 5, అశ్విన్ 3, ఉమేశ్ 2 వికెట్లతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అయితే, 193 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. స్టోక్స్ 4, బ్రాడ్ 2, అండర్సన్ 2 వికెట్ల ధాటికి 162 పరుగులకే ఆలౌటైంది. కోహ్లీ (51) ఒంటరిపోరాటం చేసినా 31 పరుగుల స్వల్ప తేడాతో భారత్ ఓటమిపాలైంది. అయితే, రేపటి నుంచి జరిగే కీలక టెస్టులో షమి, అశ్విన్ మరోసారి ఆడి.. చెలరేగితే ఇంగ్లాండ్ను కట్టడి చేసే అవకాశాలు ఉన్నాయి. వీరికి తోడు బుమ్రా, సిరాజ్ కూడా రాణించాలని ఆశిద్దాం.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ