IND vs IRE: సంజూకి అవకాశమా.. త్రిపాఠికి అరంగేట్రమా..?
ఛాన్స్ దక్కితే చాలు.. పొట్టి ఫార్మాట్లో యువ బ్యాట్స్మెన్లు అదరగొడుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్లో రిజర్వ్ బెంచ్కే పరిమితమైన దీపక్ హుడా
ఐర్లాండ్తో నేడు రెండో టీ20..
క్లీన్ స్వీప్ లక్ష్యంగా యువ భారత్
ఇంటర్నెట్ డెస్క్: ఛాన్స్ దక్కితే చాలు.. పొట్టి ఫార్మాట్లో యువ బ్యాట్స్మెన్లు అదరగొడుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్లో రిజర్వ్ బెంచ్కే పరిమితమైన దీపక్ హుడా...డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో చెలరేగి ఆడాడు. రుతురాజ్కు గాయం కావడంతో ఓపెనర్గా దిగిన హుడా...వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
రెండో టీ20లో ఎవరికి ఛాన్స్?
భారత టీ20 లీగ్లో రాణించి ఐర్లాండ్ సిరీస్కు ఎంపికైనా సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి ఇప్పుడు తుది జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. తొలి టీ20లో రుతురాజ్కు పిక్క కండరాలు పట్టేయడంతో ఓపెనింగ్ చేయలేదు. దీంతో జట్టు యాజమాన్యం మిడిలార్డర్లో ఆడే హుడాను ఓపెనర్గా పంపించింది. అయితే రెండో టీ20కి రుతురాజ్ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠిలో ఒకరు ఓపెనర్గా వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు డబ్లిన్ వేదికగా రెండో టీ20జరగనుంది.
సంజూకి సపోర్ట్
శాంసన్కు ఇదివరకే టీమ్ఇండియాకు ఆడిన అనుభవం ఉంది. టాలెంట్ ఉన్నా.. నిలకడలేమి ,సరైన సమయంలో తగినన్ని అవకాశాలు రాకపోవడంతో భారత జట్టులో సుస్థిర స్థానం దక్కించుకోలేదు. ఇటీవల జరిగిన భారత టీ20 లీగ్లో 17 మ్యాచ్ల్లో 146.79 స్ట్రెక్రేట్తో 458 పరుగులు సాధించాడు. దీంతో అతడు దక్షిణాఫ్రికా సిరీస్కు ఎంపికవుతాడని అంతా భావించారు. అయితే మిడిలార్డర్లో పంత్, శ్రేయస్ ఉండటంతో సంజూకి అవకాశం రాలేదు. తాజాగా ఐర్లాండ్ సిరీస్ తొలి మ్యాచ్లో రిజర్వ్ బెంచ్కే పరిమితం అయ్యాడు. దీంతో రెండో టీ20లో అతడిని ఎలా అయినా ఆడించాలని అభిమానులు సోషల్ మీడియాలో మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్కప్కు సంజూ లాంటి మ్యాచ్విన్నర్లు జట్టులో ఉండాలని మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు.
త్రిపాఠి అరంగేట్రం చేస్తాడా?
టీమ్ఇండియాకు తొలిసారి ఎంపికైనా రాహుల్ త్రిపాఠి అరంగేట్ర మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాడు. కొన్నేళ్లుగా భారత టీ20 లీగ్లో రాణిస్తున్నాడు. ఈ ఏడాది హైదారాబాద్ తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగి అద్భుతమైన స్ట్రెక్రేట్ (158.24)తో 413 పరుగులు( 14 మ్యాచ్ల్లో) సాధించాడు. దీంతో సెలెకర్లు అతడిని ఐర్లాండ్ సిరీస్కు ఎంపిక చేశారు. గత మ్యాచ్లో భారత టీ20 లీగ్లో హైదారాబాద్ జట్టుకే ప్రాతినిధ్యం వహించిన ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్లో కోచ్గా ఉన్న వీవీయస్ లక్ష్మణ్ త్రిపాఠికి కూడా అవకాశం కల్పిస్తాడని పలువురు అభిమానులు అంటున్నారు. భారత టీ20 లీగ్లో హైదారాబాద్ జట్టుకు లక్ష్మణ్ మెంటర్గా ఉన్న సంగతి తెలిసిందే.
వీరిద్దరూ ఆడతారా?
సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠిలో ఒకరు రెండో టీ20లో ఆడే ఛాన్స్ ఎక్కువ. అయితే ఇద్దరినీ తుది జట్టులో ఆడించాలంటే పెద్దగా రాణించని అక్షర్ పటేల్ని బెంచ్కి పరిమితం చేయాలి. ఐదో బౌలర్గా హార్దిక్, హుడా ఉండటంతో ఈ మార్పు చేయడానికి అవకాశం ఉంది. లేదంటే అక్షర్ స్థానంలో అర్ష్దీప్ని కూడా ఆడించొచ్చు. జట్టు కూర్పు పై కోచ్ లక్ష్మణ్, కెప్టెన్ హార్దిక్దే తుది నిర్ణయం కాబట్టి ఎలాంటి మార్పులైనా జరగొచ్చు. ఏం చేస్తారో చుడాలి మరి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం