IND vs IRE: సంజూకి అవకాశమా.. త్రిపాఠికి అరంగేట్రమా..?
ఛాన్స్ దక్కితే చాలు.. పొట్టి ఫార్మాట్లో యువ బ్యాట్స్మెన్లు అదరగొడుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్లో రిజర్వ్ బెంచ్కే పరిమితమైన దీపక్ హుడా
ఐర్లాండ్తో నేడు రెండో టీ20..
క్లీన్ స్వీప్ లక్ష్యంగా యువ భారత్
ఇంటర్నెట్ డెస్క్: ఛాన్స్ దక్కితే చాలు.. పొట్టి ఫార్మాట్లో యువ బ్యాట్స్మెన్లు అదరగొడుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్లో రిజర్వ్ బెంచ్కే పరిమితమైన దీపక్ హుడా...డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో చెలరేగి ఆడాడు. రుతురాజ్కు గాయం కావడంతో ఓపెనర్గా దిగిన హుడా...వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
రెండో టీ20లో ఎవరికి ఛాన్స్?
భారత టీ20 లీగ్లో రాణించి ఐర్లాండ్ సిరీస్కు ఎంపికైనా సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి ఇప్పుడు తుది జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. తొలి టీ20లో రుతురాజ్కు పిక్క కండరాలు పట్టేయడంతో ఓపెనింగ్ చేయలేదు. దీంతో జట్టు యాజమాన్యం మిడిలార్డర్లో ఆడే హుడాను ఓపెనర్గా పంపించింది. అయితే రెండో టీ20కి రుతురాజ్ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠిలో ఒకరు ఓపెనర్గా వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు డబ్లిన్ వేదికగా రెండో టీ20జరగనుంది.
సంజూకి సపోర్ట్
శాంసన్కు ఇదివరకే టీమ్ఇండియాకు ఆడిన అనుభవం ఉంది. టాలెంట్ ఉన్నా.. నిలకడలేమి ,సరైన సమయంలో తగినన్ని అవకాశాలు రాకపోవడంతో భారత జట్టులో సుస్థిర స్థానం దక్కించుకోలేదు. ఇటీవల జరిగిన భారత టీ20 లీగ్లో 17 మ్యాచ్ల్లో 146.79 స్ట్రెక్రేట్తో 458 పరుగులు సాధించాడు. దీంతో అతడు దక్షిణాఫ్రికా సిరీస్కు ఎంపికవుతాడని అంతా భావించారు. అయితే మిడిలార్డర్లో పంత్, శ్రేయస్ ఉండటంతో సంజూకి అవకాశం రాలేదు. తాజాగా ఐర్లాండ్ సిరీస్ తొలి మ్యాచ్లో రిజర్వ్ బెంచ్కే పరిమితం అయ్యాడు. దీంతో రెండో టీ20లో అతడిని ఎలా అయినా ఆడించాలని అభిమానులు సోషల్ మీడియాలో మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్కప్కు సంజూ లాంటి మ్యాచ్విన్నర్లు జట్టులో ఉండాలని మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు.
త్రిపాఠి అరంగేట్రం చేస్తాడా?
టీమ్ఇండియాకు తొలిసారి ఎంపికైనా రాహుల్ త్రిపాఠి అరంగేట్ర మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాడు. కొన్నేళ్లుగా భారత టీ20 లీగ్లో రాణిస్తున్నాడు. ఈ ఏడాది హైదారాబాద్ తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగి అద్భుతమైన స్ట్రెక్రేట్ (158.24)తో 413 పరుగులు( 14 మ్యాచ్ల్లో) సాధించాడు. దీంతో సెలెకర్లు అతడిని ఐర్లాండ్ సిరీస్కు ఎంపిక చేశారు. గత మ్యాచ్లో భారత టీ20 లీగ్లో హైదారాబాద్ జట్టుకే ప్రాతినిధ్యం వహించిన ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్లో కోచ్గా ఉన్న వీవీయస్ లక్ష్మణ్ త్రిపాఠికి కూడా అవకాశం కల్పిస్తాడని పలువురు అభిమానులు అంటున్నారు. భారత టీ20 లీగ్లో హైదారాబాద్ జట్టుకు లక్ష్మణ్ మెంటర్గా ఉన్న సంగతి తెలిసిందే.
వీరిద్దరూ ఆడతారా?
సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠిలో ఒకరు రెండో టీ20లో ఆడే ఛాన్స్ ఎక్కువ. అయితే ఇద్దరినీ తుది జట్టులో ఆడించాలంటే పెద్దగా రాణించని అక్షర్ పటేల్ని బెంచ్కి పరిమితం చేయాలి. ఐదో బౌలర్గా హార్దిక్, హుడా ఉండటంతో ఈ మార్పు చేయడానికి అవకాశం ఉంది. లేదంటే అక్షర్ స్థానంలో అర్ష్దీప్ని కూడా ఆడించొచ్చు. జట్టు కూర్పు పై కోచ్ లక్ష్మణ్, కెప్టెన్ హార్దిక్దే తుది నిర్ణయం కాబట్టి ఎలాంటి మార్పులైనా జరగొచ్చు. ఏం చేస్తారో చుడాలి మరి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ