IND vs IRL: ఐర్లాండ్తో పోరు.. 3, 4 స్థానాలు వాళ్లిద్దరివేనా?
టీమ్ఇండియా ఈనెల 26, 28 తేదీల్లో ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్ ఆడనుంది. అయితే, ఇప్పుడు జట్టు కూర్పుపైనే ఆసక్తి నెలకొంది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా ఓపెనర్లుగా...
రేసులో ఎవరున్నారు.. ఎలా ఆడుతున్నారు..
టీమ్ఇండియా ఈనెల 26, 28 తేదీల్లో ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్ ఆడనుంది. అయితే, ఇప్పుడు జట్టు కూర్పుపైనే అందరి దృష్టి నెలకొంది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా ఓపెనర్లుగా కొనసాగిన రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ ఇప్పటికే జట్టుతో ఉన్నారు. కానీ, తర్వాతి 3, 4 స్థానాల్లో వచ్చిన ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నారు. దీంతో ఐర్లాండ్ సిరీస్లో ఆయా స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే, ఆ రేసులో ఐదుగురు ఆటగాళ్లు ఉండటంతో.. ఎవరెవరు ఎలా ఉన్నారో ఓ లుక్కేద్దాం.
సూర్యకుమార్..
ముంబయి బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ భారత టీ20 లీగ్ 15వ సీజన్ మధ్యలో గాయపడటంతో సగం మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో ఐర్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఇంతకుముందు అతడు టీమ్ఇండియా, ముంబయి జట్ల తరఫున టాప్ ఆర్డర్లో రాణించిన అనుభవం ఉండటంతో మూడో స్థానంలో వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దానికి తోడు ఈసారి టీ20 లీగ్లోనూ అతడు ఆడిన కొన్ని మ్యాచ్ల్లోనే మెరుపు బ్యాటింగ్ చేశాడు. మొత్తం 8 మ్యాచ్లు ఆడిన సూర్య.. 43.29 సగటుతో.. 145.67 స్ట్రైక్రేట్ సాధించి.. 303 పరుగులు చేశాడు. అందులో 3 అర్ధ శతకాలు ఉన్నాయి. దీంతో సూర్యకుమార్కు మూడో స్థానం ఖాయమయ్యేలా కనిపిస్తోంది.
సంజూ శాంసన్..
సంజూ శాంసన్ కొన్నేళ్ల క్రితమే టీమ్ఇండియాలో చోటు దక్కించుకున్నా.. ఇప్పటికీ సుస్థిర స్థానం సంపాదించుకోలేకపోయాడు. కానీ, ఈసారి టీ20 లీగ్లో రాజస్థాన్ కెప్టెన్గా అదరగొట్టడమే కాకుండా ఆటగాడిగానూ రాణించాడు. ఆ జట్టు తరఫున రెండో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా నిలిచాడు. మొత్తం 17 మ్యాచ్లు ఆడిన అతడు 28.63 సగటుతో.. 146.79 స్ట్రైక్రేట్ నమోదు చేసి.. 458 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. అయితే, నిలకడలేమి సంజూకు ప్రధాన సమస్య. అందువల్లే టీమ్ఇండియాలో సరైన అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. కానీ, ఈ టీ20 లీగ్లో పరిస్థితులకు తగ్గట్టు ఆడటంతో ఐర్లాండ్ సిరీస్కు ఎంపికయ్యాడు. అతడికి టాప్ ఆర్డర్లో ఎక్కడైనా ఆడే అనుభవం ఉండటం కలిసొచ్చే అంశం. దీంతో ఈ సిరీస్లో వన్డౌన్ లేదా సెకండ్ డౌన్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
దీపక్ హూడా..
(Photo: Deepak Hooda Instagram)
మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా దీపక్ హూడాకు భారత టీ20 లీగ్తో పాటు దేశవాళీ క్రికెట్లోనూ మంచి రికార్డు ఉంది. మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లోనూ టీమ్ఇండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇటీవల జరిగిన టీ20లీగ్లో కొత్త ఫ్రాంఛైజీ లఖ్నవూ తరఫున అదరగొట్టాడు. పలు కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయాల్లో.. ప్లేఆఫ్స్కు చేరడంలో తనవంతు పాత్ర పోషించాడు. మొత్తంగా 15 మ్యాచ్లు ఆడిన దీపక్.. 32.21 సగటుతో 136.66 స్ట్రైక్రేట్తో 451 పరుగులు చేశాడు. అలాగే నాలుగు అర్ధ శతకాలతో సత్తా చాటాడు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా సిరీస్కు హుడాను సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే, తుది జట్టులో అవకాశం రాలేదు. ఈ సిరీస్కు కూడా ఎంపికైన దీపక్.. తుది జట్టులో అవకాశం వస్తే నాలుగు లేదా ఐదు స్థానాల్లో బరిలోకి దిగే వీలుంది.
రాహుల్ త్రిపాఠి..
(Photo: Rahul Tripathi Instagram)
రాహుల్ త్రిపాఠి కొంత కాలంగా భారత టీ20లీగ్లో అదరగొడుతూ టీమ్ఇండియాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల జరిగిన 15వ సీజన్లోనూ ఈ యువ బ్యాట్స్మన్ హైదరాబాద్ టీమ్ తరఫున రాణించాడు. ఈ సీజన్లో మొత్తం 14 మ్యాచ్లు ఆడిన త్రిపాఠి 37.55 సగటుతో.. 158.23 స్ట్రైక్రేట్తో.. 413 పరుగులు చేశాడు. అందులో మూడు అర్ధ శతకాలు నమోదు చేశాడు. దీంతో తొలిసారి జాతీయ జట్టు నుంచి ఐర్లాండ్ పర్యటనకు పిలుపు వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో అతడికి ఇదే తొలి సిరీస్ కాబట్టి తుది జట్టులో ఉండడం కష్టమనే చెప్పాలి. ఒకవేళ రిజర్వ్ బెంచ్ కాదని అవకాశం ఇస్తే.. పైన పేర్కొన్న దీపక్ లేదా సంజూ స్థానాలకు గండి కొట్టే వీలుంది.
వెంకటేశ్ అయ్యర్..
గతేడాది భారత టీ20 లీగ్ 14వ సీజన్ యూఏఈ లెగ్లో కోల్కతా ఓపెనర్గా అనూహ్యంగా రాణించిన వెంకటేశ్ అయ్యర్.. 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ఇండియాకు ఎంపికయ్యాడు. దీంతో న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక సిరీస్లకు ఎంపికై ఫర్వాలేదనిపించాడు. కానీ, ఈసారి టీ20 లీగ్లో విఫలమయ్యాడు. మొత్తం 12 మ్యాచ్లు ఆడిన వెంకటేశ్.. 16.55 సగటుతో.. 107.69 స్ట్రైక్రేట్తో.. కేవలం 182 పరుగులే చేశాడు. అయితే, వెంకటేశ్ కేవలం బ్యాట్స్మన్గానే కాకుండా మీడియం పేస్ బౌలింగ్ వేయగలడు. దీంతో ఈ సిరీస్కు ఆల్రౌండర్గా చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కెప్టెన్ హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్ మిడిల్ ఆర్డర్లో రాణిస్తుండటంతో.. వెంకటేశ్ తుది జట్టులోకి రావడం కష్టమనే చెప్పాలి. ఒకవేళ ఆడినా లోయర్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కు వస్తాడు.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం