IND vs NZ: గ్రౌండ్లోకి దూసుకొచ్చి రోహిత్ శర్మను హగ్ చేసుకున్న బాలుడు.. హిట్మ్యాన్ ఏమన్నాడంటే?
న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలుడు మైదానంలోకి దూసుకొచ్చి టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను హగ్ చేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో (IND vs NZ) టీమ్ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మూడు వన్డేల సిరీస్ని 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 109 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. రోహిత్ శర్మ (51; 50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లు), శుభ్మన్ గిల్ (40; 53 బంతుల్లో 6 ఫోర్లు) రాణించడంతో 20.1 ఓవర్లలో సునాయసంగా ఛేదించింది. అయితే, భారత్ ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు మైదానంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలుడు భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకొచ్చి క్రీజులో ఉన్న రోహిత్ శర్మ (Rohit Sharma)ను హగ్ చేసుకున్నాడు. దీంతో ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగింది.
టిక్నర్ వేసిన 10వ ఓవర్లో మూడో బంతికి ఫోర్ బాదిన రోహిత్ (Rohit Sharma) తర్వాతి బంతిని సిక్సర్గా మలిచాడు. ఇది జరిగిన వెంటనే మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ బాలుడు భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. వెంటనే ఈ విషయాన్ని గమనించిన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకునేందుకు పరుగెత్తారు. వారు వచ్చేలోపే ఆ బాలుడు రోహిత్ శర్మను హగ్ చేసుకున్నాడు. పోలీసులు వెంటనే అతడిని రోహిత్ నుంచి వేరు చేశారు. ఆ బాలుడుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని భారత కెప్టెన్ సెక్యూరిటీ సిబ్బందితో చెప్పాడు. తన అభిమానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రోహిత్ భద్రతా సిబ్బందికి సూచించడంతో ‘రోహిత్ ఎంతో మంచి మనసున్నవాడు’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్