IND vs WI: అర్ష్దీప్కు అవకాశం ఇస్తారా..? సూర్య బ్యాట్ ఝుళిపిస్తాడా..?
విండీస్పై వరుసగా రెండు ఉత్కంఠపోరుల్లో నెగ్గిన టీమ్ఇండియా...ఇప్పుడు ఆఖరి సమరానికి సిద్ధం అయింది.
ఇంటర్నెట్ డెస్క్: విండీస్పై వరుసగా రెండు ఉత్కంఠ పోరుల్లో నెగ్గిన టీమ్ఇండియా.. ఇప్పుడు ఆఖరి సమరానికి సిద్ధమైంది. ఈ రోజు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా మూడో వన్డేలో తలపడనుంది. ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకొన్న భారత్ క్లీన్స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా.. విండీస్ పరాజయాల పరంపరకు పుల్స్టాఫ్ పెట్టాలని భావిస్తోంది. అయితే.. ద్రవిడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ తుదిజట్టులో మార్పులు ఎక్కువుగా జరుగుతున్నాయి. యువకులకు అవకాశాలు ఇస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్తో ముగిసిన టీ20 సిరీస్లోనూ రెండు మ్యాచ్లు నెగ్గాక మూడో టీ20లో అనేక మార్పులు చేశారు. ప్రతి ఆటగాడికి వీలైనన్ని ఎక్కువ ఛాన్స్లు లభిస్తున్నాయి. ఇప్పటికే సిరీస్ గెలవడంతో విండీస్తో మూడో వన్డేలో టీమ్ఇండియా తుదిజట్టులో మార్పులు జరగొచ్చు.
ఎవరికి అవకాశం..?
మెదటి రెండు మ్యాచ్ల్లో ఓపెనర్గా వచ్చిన శుభమన్ గిల్ ఒక అర్ధశతకంతో పాటు 43పరుగులు చేశాడు. దీంతో మూడో మ్యాచ్లో కూడా గిల్ను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. మరో ఓపెనర్గా కెప్టెన్ ధావన్ ఎలాగో ఉన్నాడు. దీంతో విజయ్ హజారే ట్రోఫీలో శతకాల మోత మోగించిన యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ రిజర్వ్ బెంచ్కే పరిమితం కావొచ్చు. ఒక వేళ అతడిని ఆడించాలని టీమ్ఇండియా భావిస్తే.. మూడో స్థానంలో ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్కు విశ్రాంతినిస్తారు. కానీ, ఈ సిరీస్లో రెండు అర్ధశతకాలతో టచ్లోకి వచ్చిన అయ్యర్.. మూడో వన్డేలో శతకం బాదుతానని ఇప్పటికే చెప్పాడు. మిడిలార్డర్లో సూర్యకుమార్, శాంసన్, హుడా ఉండటంతో రుతురాజ్ను ఆడించే అవకాశాలు తక్కువ.
మరోవైపు బౌలింగ్లో టీమ్ఇండియా కొంచెం బలహీనంగా కనిపిస్తోంది. సిరాజ్ రెండు మ్యాచ్ల్లో రాణించాడు. అయితే, మొదటి మ్యాచ్లో విఫలం అయిన ప్రసిధ్ స్ధానంలో వచ్చిన అవేశ్ఖాన్.. రెండో మ్యాచ్లో భారీగా పరుగులు సమర్పించుకొన్నాడు. అయితే, అతడికి ఇదే తొలి వన్డే కావడంతో మరో ఛాన్స్ ఇవ్వొచ్చు. ఇంగ్లాండ్పై తొలి టీ20లో అరంగేట్రం చేసిన అర్ష్దీప్.. ఇప్పుడు వన్డేల్లో అరంగేట్ర మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాడు. అర్ష్దీప్ సింగ్ను ఆడించాలంటే, సిరాజ్ లేదా శార్దూల్ ఠాకూర్లలో ఒకరిని తప్పించొచ్చు. సిరాజ్ ఫామ్లో ఉన్నాడు. ఠాకూర్ బ్యాటింగ్ చేయగల సమర్థుడు. అయినా, సిరీస్ ఖరారు కావడంతో కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు తుది జట్టులో మార్పులు జరగొచ్చు.
సూర్య టచ్లోకి వస్తాడా..?
ఇంగ్లాండ్పై చివరి టీ20లో అద్భుత శతకం సాధించి ఔరా అనిపించిన సూర్యకుమార్ యాదవ్.. ఆ తర్వాత నుంచి వరుసగా విఫలం అవుతున్నాడు. ఇంగ్లాండ్పై రెండు వన్డేల్లో కలిపి 43 పరుగులే చేసిన సూర్య.. ఈ సిరీస్లోనూ రాణించలేదు. మొదటి మ్యాచ్లో 13, రెండో మ్యాచ్లో 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో అభిమానులు అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఔట్ అవుతున్నా.. సూర్య బ్యాటింగ్ నైపుణ్యం అందిరికీ తెలిసిందే. ఈ రోజు మ్యాచ్లో బ్యాట్ ఝుళిపించి మళ్లీ పరుగుల బాట పట్టే అవకాశం ఉంది. టీ20ల్లో సూర్య స్థానానికి ఢోకా లేకపోయినా.. వన్డేల్లో కోహ్లీ జట్టులోకి వస్తే.. అయ్యర్ నాలుగో స్థానానికి గట్టి పోటీదారుగా ఉన్నాడు. దీంతో సూర్య సత్తాచాటాల్సిన అవసరం ఉంది.
విండీస్ పరిస్థితి ఏంటి?
వెస్టిండీస్ బాగానే ఆడుతున్నా కీలక సమయాల్లో బ్యాటర్లు లేదా బౌలర్లు చేతులెత్తేస్తున్నారు. విండీస్ సమష్టిగా రాణించకపోవడంతో గెలవాల్పిన మ్యాచ్ల్లో ఓడిపోయింది. జట్టులో సీనియర్లు లేకపోవడం.. ఎక్కువుగా షై హోప్, కెప్టెన్ పూరన్, పావెల్పైనే ఆధారపడటం ఆ జట్టుకు నష్టం చేకూర్చే అంశం. మూడో మ్యాచ్లోనైనా నెగ్గి ఈ నెల 29 నుంచి ఆరంభమయ్యే టీ20 సిరీస్కు విజయంతో వెళ్లాలని విండీస్ ఆశిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు