IND vs WI: ప్రపంచకప్ బృందంలో ఉండేదెవరు..? విండీస్ సిరీస్ వీరికి కీలకం..!
టీమ్ఇండియాలో పోటీ తీవ్రంగా పెరిగింది. ఒక్కో స్థానానికి ఇద్దరు..ముగ్గురు రేసులో ఉన్నారు.
ఇక్కడ రాణిస్తేనే.. అక్కడ చోటు.. ఇదే మంచి తరుణం..!
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియాలో పోటీ తీవ్రంగా పెరిగింది. ఒక్కో స్థానానికి ఇద్దరు.. ముగ్గురు రేసులో ఉన్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా సెలెక్టర్లు ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నారు. ప్రతి సిరీస్లో యువకులకు అవకాశాలు ఇస్తున్నారు. ఈ రోజు నుంచి విండీస్తో ఆరంభమయ్యే టీ20 సిరీస్, ఆ తర్వాత జరగనున్న ఆసియాకప్తో సెలెక్టర్లకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ లోగా వచ్చిన ఛాన్స్లను ఎలా అందిపుచ్చుకుంటారో చుడాలి..!
ఈ సిరీస్ వారికి కీలకం..
సెలెక్టర్లు వెస్టిండీస్తో టీ20 సిరీస్కు సీనియర్లు కోహ్లీ, చాహల్, బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు. అయినా.. టీమ్ఇండియాలో తుది 11లో చోటు కోసం పోటీ తగ్గలేదు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లలో అదరగొట్టిన దీపక్ హుడా, విండీస్పై వన్డేల్లో రాణించిన శ్రేయస్ అయ్యర్ మూడో స్థానానికి పోటీ పడుతున్నారు. దక్షిణాఫ్రికా సిరీస్లో దుమ్మురేపిన ఇషాన్కు ఇంగ్లాండ్ సిరీస్లో అవకాశం రాలేదు. ఇక్కడ పంత్ ఓపెనర్గా వచ్చాడు. ఇప్పుడు విండీస్తో కూడా అతడే ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. దీంతో రిజర్వ్ ఓపెనర్గా ఖాయం అనుకున్నా కిషన్కు నిరాశే మిగులుతుందా అనేది ప్రశ్నార్థకం. ప్రపంచకప్కు ఎంపికచేసే 15 మంది సభ్యుల జట్టులో తమ పేరు ఉండాలంటే హుడా, అయ్యర్, కిషన్ ఈ సిరీస్లో తప్పక రాణించాలి. అవకాశం వస్తే.. కోచ్ ద్రవిడ్ చెప్పినట్టు టీమ్ఇండియా తలుపు తట్టడం కాదు.. బద్దలు కొట్టే ఇన్నింగ్స్ ఆడాలి.
కార్తీక్ కేక పుట్టిస్తావా..!
ఇంగ్లాండ్పై అద్భుత శతకం సాధించిన సూర్యకుమార్ యాదవ్కు నాలుగో స్థానం దాదాపు ఖాయమైనట్లే. ఎందుకంటే సూర్య టీ20ల్లో ఆడే వినూత్న షాట్లు, అతడి రికార్డులు బాగున్నాయి. దీంతో నాలుగో స్థానానికి ఫస్ట్ ఛాయిస్ ప్లేయర్గా సూర్యనే ఉంటాడు. ఇక ఆల్రౌండర్ కోటాలో హార్ధిక్ పాండ్య కచ్చితంగా ఉండే ఆటగాడు. ఇంతవరకు బాగానే ఉన్నా దినేశ్ కార్తీక్, రిషబ్పంత్ స్థానాలపైనే సందేహం ఉంది. ఈ సిరీస్లో రిషభ్ ఓపనింగ్ స్థానంలో ఆడినా, రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వస్తే ఎక్కడ ఆడతాడనేది తెలియాలి. పంత్ నైపుణ్యం ఉన్న ఆటగాడు, పైగా వికెట్కీపర్, లెఫ్ట్హ్యాండ్ బ్యాటర్.. దీంతో ఏదో ఒక స్థానంలో అతడిని ఆడించడానికి జట్టు మేనేజ్మెంట్ ప్రయత్నించవచ్చు. కానీ.. కోహ్లీ తుదిజట్టులో ఉంటే ఒక్క దినేశ్కార్తీక్ స్థానం మాత్రమే ఖాళీగా ఉంటుంది. కార్తీక్ భారత టీ20లీగ్లో మెరుపులు మెరిపించి టీమ్ఇండియాలోకి పునరాగమనం చేశాడు. అతడిని టీమ్ఇండియా ఫినిషర్గా భావిస్తోంది. నెం 7లో ఆడి మ్యాచ్ను ముగించగల సత్తా అతడి సొంతం. అయితే, దక్షిణాఫ్రికాపై అర్ధశతకం సాధించి మ్యాచ్ను గెలిపించిన కార్తీక్.. ఆ తరవాత చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో ఈ సిరీస్లో అతడు సత్తాచాటకపోతే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం కష్టం అవుతుంది. కోహ్లీ, రాహుల్ తిరిగి తుదిజట్టులోకి వస్తే పంత్, కార్తీక్లలో ఒకరికే వికెట్కీపర్ బ్యాటర్గా చోటు దక్కొచ్చు. దీంతో ఈ సిరీస్లో వీరిద్దరూ రాణించాలి.
స్పిన్నర్ల మధ్య తీవ్ర పోటీ
రవీంద్ర జడేజా, అక్షర్పటేల్ ఇద్దరు ఆల్రౌండ్ నైపుణ్యం ఉన్న ఆటగాళ్లే. లెఫ్ట్ఆర్మ్ స్పిన్తో పాటు బ్యాటింగ్ చేయగల సమర్థులే. అయితే, జడేజాకు అనుభవం, మెరుపు ఫీల్డిండ్ కారణంగా తుది జట్టులో స్పిన్నింగ్ ఆల్రౌండర్గా ఫస్ట్ ఛాయిస్ ఉండే అవకాశం ఉంది. అయితే, తాజాగా విండీస్తో వన్డే సిరీస్లో తన బ్యాటింగ్తో మ్యాచ్ను గెలిపించిన అక్షర్.. ఇక్కడ రాణిస్తే ప్రపంచకప్ జట్టులో బెర్త్ ఖాయం చేసుకోవచ్చు. తాజాగా అశ్విన్ విండీస్ సిరీస్కు ఎంపికయ్యాడు. దీంతో అతడు కూడా ఇక్కడ సత్తా చాటి స్పిన్నర్ల రేసులో ముందుండడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే, ఈ సిరీస్లో అశ్విన్ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరం. ఇక కుల్దీప్ యాదవ్ మణికట్టు స్పిన్నర్గా టీమ్ఇండియాలో రెగ్యులర్ ఆటగాడిగా కొంతకాలం కొనసాగాడు. అయితే, ఉన్నట్టుండి ఫామ్ కోల్పోయి టీమ్ఇండియాకు దూరమయ్యాడు. అయితే, ఈ సీజన్ భారత టీ20లీగ్లో దిల్లీ తరఫున రాణించి తిరిగి టీమ్ఇండియాకు ఎంపికయ్యాడు. ఈ సిరీస్ కుల్దీప్కు కీలకమైనది. ఇప్పటికే ప్రధాన స్పిన్నర్గా చాహల్ ఉన్నాడు. మరోవైపు యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్కు ఈ సిరీస్ ముఖ్యమైనదే. కుల్దీప్, అశ్విన్, బిష్ణోయ్ ఈ ముగ్గురిలో ఎవరు నిలకడగా రాణిస్తే వారు చాహల్కు జోడిగా ఆస్ట్రేలియా విమానం ఎక్కే అవకాశం ఉంది.
టాప్ లేపితేనే ఛాన్స్..!
ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరగనున్న నేపథ్యంలో పేస్ బౌలర్లు టీమ్ఇండియాకు కీలకం కానున్నారు. ప్రధాన పేసర్లుగా బుమ్రా, భువనేశ్వర్ కచ్చితంగా ప్రపంచకప్ జట్టులో ఉండే ఆటగాళ్లని తెలుస్తోంది. ఇప్పుడు చర్చంతా మూడో పేసర్ ఎవరనేదే. ఈ జాబితాలో హర్షల్ పటేల్, అర్ష్దీప్సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేశ్ ఖాన్తో పాటు గాయంతో టీమ్ఇండియాకు దూరమైన దీపక్ చాహర్ కూడా రేసులో ఉన్నాడు. ప్రస్తుతానికి వీరందరిలో స్లో డెలివరీలు, యార్కర్లు వేసి బ్యాటర్లను బోల్తా కొట్టించగల హర్షల్ పటేల్కు ఎక్కువ ఛాన్స్లు ఉన్నాయి. అయితే, అర్ష్దీప్ భారత టీ20లీగ్తో పాటు ఇంగ్లాండ్పై అరంగేట్ర మ్యాచ్లో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు ఈ సిరీస్, ఆసియాకప్లో ఎలా రాణిస్తారో చుశాక వీరిలో ఒకరిని మూడో పేసర్గా తీసుకోవచ్చు. మరోవైపు మెరుపు వేగంతో బౌలింగ్ చేస్తున్న ఉమ్రాన్ ఆశించిన స్థాయిలో బౌలింగ్ చేయలేదు. దీంతో ఈ సిరీస్కు అతడిని ఎంపిక చేయలేదు. అవేశ్ ఖాన్ ప్రతిభావంతుడైన పేస్ బౌలర్.. కానీ, ఇటీవల పరుగులు ధారళంగా ఇచ్చేస్తున్నాడు. వన్డే సిరీస్ అరంగేట్ర మ్యాచ్లోనూ ప్రభావం చూపలేకపోయాడు. టీ20 సిరీస్లో అవకాశం వస్తే వికెట్లు పడగొట్టడంతో పాటు మంచి ఎకానమీతో బౌలింగ్ చేయాలి.. లేదంటే ప్రపంచకప్ బెర్త్ కష్టం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు