SA vs IND: భారత్ ఆలౌట్.. మెరిసిన సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ 211 పరుగులకు ఆలౌటైంది.
గబెరా: మూడు వన్డేల సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య రెండో వన్డే జరుగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. సాయి సుదర్శన్ (62; 83 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (56; 64 బంతుల్లో 7 ఫోర్లు) కూడా హాఫ్ సెంచరీ బాదాడు. వీరిద్దరూ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రి బర్గర్ 3, బ్యురాన్ హెండ్రిక్స్ 2, కేశవ్ మహరాజ్ 2, లిజాడ్ విలియమ్స్, మార్క్రమ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే టీమ్ఇండియాకు షాక్ తగిలింది. రుతురాజ్ గైక్వాడ్ (4)ని ఇన్నింగ్స్ రెండో బంతికే బర్గర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తర్వాత తిలక్ వర్మతో కలసి సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. తిలక్ చాలా నెమ్మదిగా ఆడగా.. సుదర్శన్ నిలకడగా పరుగులు రాబట్టాడు. చివరకు బర్గర్ బౌలింగ్లో తిలక్ హెండ్రిక్స్కు చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ మొదట్లో ఆచితూచి ఆడి క్రమంగా దూకుడు పెంచాడు. 60 బంతుల్లో అర్ధ శతకం బాదిన సుదర్శన్ను విలియమ్స్ వెనక్కి పంపాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యారు. సంజు శాంసన్ (12)ను హెండ్రిక్స్ బౌల్డ్ చేశాడు. హాఫ్ సెంచరీ చేసిన రాహుల్.. బర్గర్ బౌలింగ్లో మిల్లర్కు చిక్కాడు. రింకు సింగ్ (17), కుల్దీప్ యాదవ్ (1)లను కేశవ్ మహరాజ్ వరుస ఓవర్లలో పెవిలియన్కు పంపాడు. అక్షర్ పటేల్ (7; 23 బంతుల్లో)ని మార్క్రమ్ ఔట్ చేశాడు. చివర్లో అర్ష్దీప్ సింగ్ (18; 17 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) పోరాడటంతో స్కోరు 200 దాటింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి