Tilak Varma Bowling: రెండో బంతికే కెరీర్లో తొలి వికెట్.. తిలక్ కొత్త బాధ్యతలు సక్సెస్!
వెస్టిండీస్తో టీ20 సిరీస్ను (WI vs IND) ఓడిపోయినప్పటికీ భారత యువ క్రికెటర్లు మాత్రం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. సీనియర్లు మాత్రం రాణించలేక విఫలం కావడం ఆందోళనకు గురి చేసే అంశం.
ఇంటర్నెట్ డెస్క్: భారత బౌలింగ్ (Team India) కోచ్ పరాస్ మాంబ్రే చెప్పినట్లుగానే యువ బ్యాటర్లు తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్కు బౌలింగ్ బాధ్యతలను కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) అప్పగించాడు. వెస్టిండీస్తో జరిగిన (WI vs IND) ఐదో టీ20 మ్యాచ్లో యశస్వి జైస్వాల్ ఒక్క ఓవర్ వేసి 11 పరుగులు ఇచ్చాడు. తిలక్ వర్మ మాత్రం తన రెండు ఓవర్ల కోటాలో డేంజరస్ బ్యాటర్ నికోలస్ పూరన్ వికెట్ను పడగొట్టాడు. అదీ అతడు సంధించిన రెండో బంతికే వికెట్ పడటం గమనార్హం. యశస్వి లెగ్ బ్రేక్ బౌలర్ కాగా.. తిలక్ ఆఫ్ స్పిన్నర్. రివర్స్ స్వీప్ చేసేందుకు ప్రయత్నించిన నికోలస్ పూరన్ (47).. తిలక్ బౌలింగ్లో హార్దిక్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్కు చేరాడు. దీంతో అంతర్జాతీయ కెరీర్ను విండీస్ పర్యటనలోనే ప్రారంభించిన తిలక్ వర్మకు.. ఇక్కడే హాఫ్ సెంచరీతోపాటు తొలి వికెట్ దక్కడం విశేషం.
అతడు బౌలింగ్ చేయగలడని తెలుసు: జాఫర్
టాప్ బ్యాటర్లు కూడా బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని భారత మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ వ్యాఖ్యానించాడు. ‘‘ అంతర్జాతీయ క్రికెట్లో యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అనుకోవడం లేదు. అయితే, తిలక్ వర్మకు దేశవాళీ క్రికెట్లోనూ బౌలింగ్ వేసిన అనుభవం ఉందని తెలుసు. వారిద్దరితో నెట్స్లోనూ ఇంకా ప్రాక్టీస్ చేయించాలి. టాప్ ఆర్డర్లోని మిగతా బ్యాటర్లూ అవసరమైతే బౌలర్ల అవతారం ఎత్తేందుకు సిద్ధంగా ఉండాలి’’ అని జాఫర్ వ్యాఖ్యానించాడు.
తక్కువగా అంచనా వేయడం వల్లే: వెంకటేశ్ ప్రసాద్
ఐదు టీ20ల సిరీస్ను విండీస్ 3-2 తేడాతో నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే, వన్డే ప్రపంచకప్ నుంచి వైదొలిగిన వెస్టిండీస్ను తక్కువగా అంచనా వేయడంతోనే భారత్కు పరాభవం ఎదురైందని మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ తెలిపాడు. ‘‘కొన్నిసార్లు భారత్ పరిమిత ఓవర్ల క్రికెట్లో చాలా సాధారణ జట్టుగా కనిపిస్తోంది. వన్డే ప్రపంచ కప్ టోర్నీకి అర్హత సాధించడంలో విఫలమైన విండీస్ చేతిలో భంగపాటు ఎదురైంది. ఇంతకుముందు బంగ్లా చేతిలోనూ వన్డే సిరీస్ను కోల్పోయాం. ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకుంటారని ఆశిస్తున్నా. వెస్టిండీస్ వన్డే ప్రపంచ కప్ టోర్నీలోనే కాదు.. గతేడాది టీ20 వరల్డ్ కప్లోనూ ఆడలేదు. ఆ బాధ విండీస్ జట్టులో కనిపించింది. మరోవైపు భారత్ దారుణమైన ప్రదర్శన చేసింది. ఊహల్లో బతుకుతూ ఉండటంతో కసి కనిపించలేదు’’ అని వెంకటేశ్ ప్రసాద్ విమర్శించాడు.
గిల్కు మద్దతు అవసరం: పార్థివ్ పటేల్
విండీస్తో టీ20 సిరీస్లో ఒక్క మ్యాచ్ మినహా మిగతా వాటిల్లో ఓపెనర్ శుభ్మన్ గిల్ రాణించలేకపోయాడు. దీంతో అతడిని పక్కన పెట్టాలనే విమర్శలు భారీస్థాయిలో వచ్చాయి. ఈ క్రమంలో భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ మాత్రం గిల్కు మద్దతుగా నిలిచాడు. ‘‘శుభ్మన్ గిల్ అద్భుతమైన ఆటగాడు. అతడి సత్తా ఏంటో మనందరికీ తెలుసు. కొన్నిసార్లు పరుగులు చేయకపోతే అతడి సామర్థ్యంపై ప్రశ్నలు సంధిస్తుంటాం. ఒకటీ రెండు మ్యాచుల్లో విఫలం కాగానే అతడు టీ20ల్లో ఆడొద్దు.. లేకపోతే వన్డేల్లో ఆడవద్దని సూచనలు చేస్తుంటారు. అయితే, బ్యాటర్ ఆడే విధానంపై నమ్మకం ఉంచాలి. దూకుడుగా ఆడే క్రమంలో ఔట్ కావడం సహజం. మరీ ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో ఓపెనర్ల పరిస్థితి భిన్నంగా ఉంటుంది’’ అని పటేల్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదరగొట్టిన హైదరాబాద్.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్పై విజయం
సొంత గడ్డపై హైదరాబాద్ అదరగొట్టింది. రాజస్థాన్తో చివరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. -
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. జట్టు సభ్యుల ఎంపికపై వస్తోన్న విమర్శలు, సందేహాలపై వివరణ ఇచ్చారు. -
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
ధోనీని రనౌట్ చేసిన వికెట్ కీపర్ జితేశ్ శర్మపై నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. అతడి ఫ్యాన్స్ విమర్శలు గుప్పించారు. -
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆట తీరుపై నెట్టింట విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీ20 ఫార్మాట్కు తగ్గట్టుగా స్ట్రైక్రేట్ ఉండటం లేదని కొందరు మాజీలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వాటిపై ఏబీ డివిలియర్స్ స్పందించాడు. -
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
ఈ ఐపీఎల్ సీజన్లో తొలిసారి ధోనీ ఔటయ్యాడు. అయితే, అతడు చివరి ఓవర్లో సింగిల్ను తిరస్కరించడంపై నెట్టింట చర్చకు తెర లేచింది. -
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
అదరగొట్టిన హైదరాబాద్.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్పై విజయం
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!