Tilak Varma Bowling: రెండో బంతికే కెరీర్లో తొలి వికెట్.. తిలక్ కొత్త బాధ్యతలు సక్సెస్!
వెస్టిండీస్తో టీ20 సిరీస్ను (WI vs IND) ఓడిపోయినప్పటికీ భారత యువ క్రికెటర్లు మాత్రం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. సీనియర్లు మాత్రం రాణించలేక విఫలం కావడం ఆందోళనకు గురి చేసే అంశం.
ఇంటర్నెట్ డెస్క్: భారత బౌలింగ్ (Team India) కోచ్ పరాస్ మాంబ్రే చెప్పినట్లుగానే యువ బ్యాటర్లు తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్కు బౌలింగ్ బాధ్యతలను కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) అప్పగించాడు. వెస్టిండీస్తో జరిగిన (WI vs IND) ఐదో టీ20 మ్యాచ్లో యశస్వి జైస్వాల్ ఒక్క ఓవర్ వేసి 11 పరుగులు ఇచ్చాడు. తిలక్ వర్మ మాత్రం తన రెండు ఓవర్ల కోటాలో డేంజరస్ బ్యాటర్ నికోలస్ పూరన్ వికెట్ను పడగొట్టాడు. అదీ అతడు సంధించిన రెండో బంతికే వికెట్ పడటం గమనార్హం. యశస్వి లెగ్ బ్రేక్ బౌలర్ కాగా.. తిలక్ ఆఫ్ స్పిన్నర్. రివర్స్ స్వీప్ చేసేందుకు ప్రయత్నించిన నికోలస్ పూరన్ (47).. తిలక్ బౌలింగ్లో హార్దిక్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్కు చేరాడు. దీంతో అంతర్జాతీయ కెరీర్ను విండీస్ పర్యటనలోనే ప్రారంభించిన తిలక్ వర్మకు.. ఇక్కడే హాఫ్ సెంచరీతోపాటు తొలి వికెట్ దక్కడం విశేషం.
అతడు బౌలింగ్ చేయగలడని తెలుసు: జాఫర్
టాప్ బ్యాటర్లు కూడా బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని భారత మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ వ్యాఖ్యానించాడు. ‘‘ అంతర్జాతీయ క్రికెట్లో యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అనుకోవడం లేదు. అయితే, తిలక్ వర్మకు దేశవాళీ క్రికెట్లోనూ బౌలింగ్ వేసిన అనుభవం ఉందని తెలుసు. వారిద్దరితో నెట్స్లోనూ ఇంకా ప్రాక్టీస్ చేయించాలి. టాప్ ఆర్డర్లోని మిగతా బ్యాటర్లూ అవసరమైతే బౌలర్ల అవతారం ఎత్తేందుకు సిద్ధంగా ఉండాలి’’ అని జాఫర్ వ్యాఖ్యానించాడు.
తక్కువగా అంచనా వేయడం వల్లే: వెంకటేశ్ ప్రసాద్
ఐదు టీ20ల సిరీస్ను విండీస్ 3-2 తేడాతో నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే, వన్డే ప్రపంచకప్ నుంచి వైదొలిగిన వెస్టిండీస్ను తక్కువగా అంచనా వేయడంతోనే భారత్కు పరాభవం ఎదురైందని మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ తెలిపాడు. ‘‘కొన్నిసార్లు భారత్ పరిమిత ఓవర్ల క్రికెట్లో చాలా సాధారణ జట్టుగా కనిపిస్తోంది. వన్డే ప్రపంచ కప్ టోర్నీకి అర్హత సాధించడంలో విఫలమైన విండీస్ చేతిలో భంగపాటు ఎదురైంది. ఇంతకుముందు బంగ్లా చేతిలోనూ వన్డే సిరీస్ను కోల్పోయాం. ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకుంటారని ఆశిస్తున్నా. వెస్టిండీస్ వన్డే ప్రపంచ కప్ టోర్నీలోనే కాదు.. గతేడాది టీ20 వరల్డ్ కప్లోనూ ఆడలేదు. ఆ బాధ విండీస్ జట్టులో కనిపించింది. మరోవైపు భారత్ దారుణమైన ప్రదర్శన చేసింది. ఊహల్లో బతుకుతూ ఉండటంతో కసి కనిపించలేదు’’ అని వెంకటేశ్ ప్రసాద్ విమర్శించాడు.
గిల్కు మద్దతు అవసరం: పార్థివ్ పటేల్
విండీస్తో టీ20 సిరీస్లో ఒక్క మ్యాచ్ మినహా మిగతా వాటిల్లో ఓపెనర్ శుభ్మన్ గిల్ రాణించలేకపోయాడు. దీంతో అతడిని పక్కన పెట్టాలనే విమర్శలు భారీస్థాయిలో వచ్చాయి. ఈ క్రమంలో భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ మాత్రం గిల్కు మద్దతుగా నిలిచాడు. ‘‘శుభ్మన్ గిల్ అద్భుతమైన ఆటగాడు. అతడి సత్తా ఏంటో మనందరికీ తెలుసు. కొన్నిసార్లు పరుగులు చేయకపోతే అతడి సామర్థ్యంపై ప్రశ్నలు సంధిస్తుంటాం. ఒకటీ రెండు మ్యాచుల్లో విఫలం కాగానే అతడు టీ20ల్లో ఆడొద్దు.. లేకపోతే వన్డేల్లో ఆడవద్దని సూచనలు చేస్తుంటారు. అయితే, బ్యాటర్ ఆడే విధానంపై నమ్మకం ఉంచాలి. దూకుడుగా ఆడే క్రమంలో ఔట్ కావడం సహజం. మరీ ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో ఓపెనర్ల పరిస్థితి భిన్నంగా ఉంటుంది’’ అని పటేల్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్