IND vs ENG : ప్రత్యర్థిని చుట్టేయాలి.. సిరీస్ను పట్టేయాలి
ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ను ఘనంగా ఆరంభించిన టీమ్ఇండియా రెండో వన్డేలో వంద పరుగుల తేడాతో ఓడి ఢీలాపడిపోయింది. తొలి మ్యాచ్లో...
ఆదివారం ఇంగ్లాండ్తో భారత్ కీలక పోరు
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ను ఘనంగా ఆరంభించిన టీమ్ఇండియా రెండో వన్డేలో వంద పరుగుల తేడాతో ఓడి డీలాపడిపోయింది. తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ను 110 పరుగులకే కుప్పకూల్చిన భారత జట్టు.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో తన బలహీనతలను బయటపెట్టుకొని 146 పరుగులకే ఆలౌటై ఘోరపరాభవం ఎదుర్కొంది. ఈ క్రమంలో మాంచెస్టర్ వేదికగా ఆదివారం కీలకమైన మూడో వన్డే జరగనుంది. ఫైనల్లాంటి మ్యాచ్లో విజయం సాధించి టీ20 సిరీస్తోపాటు వన్డే సిరీస్ను తీసుకెళ్లాలని టీమ్ఇండియా భావిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ కూడా అద్భుతంగా పుంజుకొని మరీ రేసులో నిలిచింది. ఈ క్రమంలో ఆఖరి మ్యాచ్ రసవత్తరంగా ఉండటం మాత్రం ఖాయం..
ఆందోళనకరంగా బ్యాటింగ్
బౌలింగ్కు సహకరించిన మొదటి వన్డేలో వికెట్ ఇవ్వకుండా విజయభేరి మోగించిన భారత్.. రెండో వన్డేలో ఘోరంగా దెబ్బతింది. బ్యాటర్లు క్రీజ్లో నిలబడలేకపోయారు. సూర్యకుమార్ (27), హార్దిక్ (29), జడేజా (29)తోపాటు షమీ (23) ఫర్వాలేదనిపించడంతో 146 పరుగులైనా చేయగలిగింది. టాప్ఆర్డర్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. తొలి వన్డేలో ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (0) తడబాటుకు గురయ్యాడు. ఇంకో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ధాటిగా ఆడేందుకు ప్రయత్నించలేదు. విరాట్ కోహ్లీ (16) కాసేపు దూకుడు ప్రదర్శించినా తన బలహీనతతో ఆఫ్స్టంప్ ఆవల పడిన బంతిని వెంటాడి మరీ కీపర్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఇప్పటికే ఫామ్పై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీ.. కీలకమైన మూడో వన్డేలోనైనా బ్యాట్తో సమాధానం ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. రిషభ్ పంత్ కూడా బ్యాట్ను ఝుళిపించాల్సిందే.
బౌలింగ్ ఓకే.. కానీ
తొలి వన్డేలో ఇంగ్లాండ్ను 110 పరుగులకే చుట్టేసిన భారత బౌలర్లు రెండో వన్డేలో మాత్రం కాస్త పట్టువిడిచారు. సెకండ్ వన్డేలో 150 పరుగుల లోపే ఆరు వికెట్లను పడగొట్టిన టీమ్ఇండియా బౌలర్లు.. టెయిలెండర్లను కూల్చడంలో తప్పటడుగు వేశారు. దీంతో 246 పరుగులు చేసిన ఇంగ్లాండ్కు పోరాడేందుకు అవకాశం ఇచ్చారు. అదే త్వరగానే ఇంగ్లాండ్ను ఆలౌట్ చేసి ఉంటే భారత్ ఓటమిబాట పట్టేది కాదేమో.. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఇక మూడో వన్డేలో ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇంగ్లాండ్ బ్యాటర్లకు కళ్లెం వేస్తేనే సిరీస్ను సొంతం చేసుకునే వీలుంది. లేకపోతే ప్రతీకారేచ్ఛతో ఉన్న ఇంగ్లాండ్ను ఆపడం కష్టతరమవుతుంది.
ఇంగ్లాండ్ మరీ డేంజరస్..
తొలి వన్డేలో తేలిగ్గా గెలిచామనే ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్ను రెండో వన్డేలో ఇంగ్లాండ్ చావుదెబ్బ కొట్టింది. కాబట్టే సిరీస్ విజయం కోసం ఆడే మూడో మ్యాచ్లో సర్వశక్తులు ఒడ్డి మరీ ఇంగ్లాండ్ ఆడుతుందనడంలో సందేహం లేదు. రాయ్, బెయిర్స్టో ఫామ్లోకి వస్తే వారిని ఆపడం కష్టం. ఫాస్ట్బౌలింగ్ ఆల్రౌండర్ డేవిడ్ (41) విల్లే రెండో వన్డేలో విలువైన పరుగులు సాధించాడు. అందుకే దాదాపు తొమ్మిదో స్థానం వరకు ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తుంది. వన్డే సిరీస్ విజేతను తేల్చే మ్యాచ్లో ఇంగ్లాండ్ చాలా ధాటిగా ఆడుతుంది.
జట్లు వివరాలు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, బుమ్రా, షమీ, ప్రసిధ్ కృష్ణ
ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), జాసన్ రాయ్, జానీ బెయిర్స్టో, లియామ్ లివింగ్స్టోన్, జో రూట్, బెన్స్టోక్స్, మొయిన్ అలీ, కార్సే, ఓవర్టన్, డేవిడ్ విల్లే, టోప్లే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు