IND vs AUS: ఆసీస్తో కీలక పోరు.. భారత కూర్పు ఎలా ఉండనుందో..?
ఆస్ట్రేలియాపై మూడు టీ20ల సిరీస్ను గెలిచేందుకు హైదరాబాద్లో అడుగు పెట్టింది టీమ్ఇండియా. చెరొక విజయంతో 1-1తో సమంగా ఉండటంతో ఆదివారం...
హైదరాబాద్ వేదికగా చివరి టీ20 మ్యాచ్
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాపై మూడు టీ20ల సిరీస్ను గెలిచేందుకు హైదరాబాద్లో అడుగు పెట్టింది టీమ్ఇండియా. చెరొక విజయంతో 1-1తో సమంగా ఉండటంతో ఆదివారం జరిగే చివరి మ్యాచ్ కీలకంగా మారింది. తొలి మ్యాచ్లో 209 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైన భారత్ ఓటమిపాలైంది. ఇక ఎనిమిది ఓవర్ల ఆట జరిగిన రెండో టీ20లో 91 పరుగులను ఛేదించి మరీ సిరీస్ రేసులో నిలిచింది. ఈ క్రమంలో ఉప్పల్ వేదికగా జరిగే మూడో మ్యాచ్లో టీమ్ఇండియా బ్యాటింగ్, బౌలింగ్ సహా ఫీల్డింగ్లోనూ రాణించాల్సిందే. ఆసీస్కు ఏమాత్రం అవకాశం ఇచ్చినా సిరీస్ను ఎగరేసుకుపోవడం ఖాయం.
బౌలింగ్ పటిష్టమేనా..?
భారత్, ఆసీస్ జట్ల మధ్య నాగ్పుర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోవడం ఉత్తమం. కేవలం ఎనిమిది ఓవర్ల మ్యాచ్ మాత్రమే కావడంతో సహజంగానే బ్యాటర్ల దూకుడు అధికంగా ఉంటుంది. అయినా భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ (2/13) సూపర్గా బౌలింగ్ చేశాడు. చాలా కాలం తర్వాత గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన బుమ్రా తన రెండు ఓవర్ల కోటాలో 23 పరుగులు సమర్పించాడు. అయితే దీనికేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. తక్కవ నిడివితో జరిగే మ్యాచ్లో బౌలర్లపై బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తుంటారు.
అయితే హర్షల్ పటేల్ ప్రదర్శన మాత్రం ఆందోళనకరంగానే ఉంది. డెత్ ఓవర్లలో అద్భుతంగా వేస్తాడని అంచనాలు పెట్టుకొన్న హర్షల్ మాత్రం తేలిపోతున్నాడు. తొలి టీ20లోనూ.. అలాగే రెండో మ్యాచ్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. టాప్ ఆర్డర్ను త్వరగానే పెవిలియన్కు చేరుస్తున్న భారత్.. మ్యాథ్యూ వేడ్ను మాత్రం అడ్డుకోవడంలో విఫలం కావడం గమనార్హం. ఇక చివరి టీ20లో వేడ్ను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పూర్తి ఓవర్లపాటు ఆట సాగితే మాత్రం బుమ్రా ఉన్న నేపథ్యంలో డెత్ ఓవర్లలో ఆసీస్కు అడ్డుకట్ట పడే అవకాశం లేకపోలేదు.
కోహ్లీ గాడిలో పడాలి..
ఆసియా కప్లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ.. ఆసీస్తో టీ20 సిరీస్లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. రెండు మ్యాచుల్లో వరుసగా 2, 11 పరుగులు మాత్రమే చేశాడు. టీ20 ప్రపంచకప్లో కీలకమైన మరోక ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తొలి మ్యాచ్లో ఫర్వాలేదనిపించినా.. తీవ్ర ఒత్తిడి ఉన్న రెండో టీ20లో గోల్డెన్ డక్గా పెవిలియన్కు చేరాడు. మొన్నటి దాకా దినేశ్ కార్తిక్ ఫినిషింగ్పై కాస్త ఆందోళన పడినా.. కీలక సమయంలో తనపై ఉంచిన నమ్మకాన్ని కార్తిక్ నిలబెట్టాడు. నాగ్పుర్ టీ20 చివరి ఓవర్లో తొలి రెండు బంతులకే బౌండరీలు బాదేసి భారత్కు విజయం చేకూర్చాడు.
ఎవరు ఉంటారు..?
రెండో టీ20 జరిగిన నాగ్పుర్ మైదానం చిత్తడిగా ఉండటంతో ఓవర్లను కుదించిన విషయం తెలిసిందే. దాదాపు రెండున్నర గంటల తర్వాత మ్యాచ్ జరిగింది. దీంతో రోహిత్ శర్మ అదనంగా హిట్టర్ ఉంటే బాగుంటుందని భావించి దినేశ్ కార్తిక్తోపాటు రిషభ్ పంత్నూ తుది జట్టులో తీసుకొన్నాడు. బుమ్రా, హర్షల్, హార్దిక్ కూడా పేస్ దళం.. అక్షర్ పటేల్, చాహల్ స్పిన్నర్లను ఎంచుకొన్నాడు. ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ను పక్కన పెట్టాడు. అయితే హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్ పూర్తిస్థాయి ఓవర్లపాటు ఆడే అవకాశం ఉంది. హర్షల్ ప్రదర్శన సరిగా లేని నేపథ్యంలో బౌలింగ్ ఎంపిక సవాల్తో కూడుకున్నదే. అక్షర్ పటేల్తోపాటు చాహల్ ఉండే అవకాశం ఉంది. బ్యాటింగ్కు పనికొస్తాడని భావిస్తే అశ్విన్ ఎంపిక ఉత్తమం. ఇక హర్షల్ను పక్కన పెట్టి.. భువీ, ఉమేశ్ను తీసుకొని ఓ బ్యాటర్ను తగ్గించే అవకాశాలూ లేకపోలేదు. దీంతో మరోసారి రిషభ్/కార్తిక్లో ఎవరు తుది జట్టులో ఉంటారు.. రోహిత్ నిర్ణయం ఎలా ఉండనుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. దాదాపు మూడేళ్ల తర్వాత హైదరాబాద్లోని రాజీవ్గాంధీ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది.
భారత్ జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్,విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్/దినేశ్ కార్తిక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, చాహల్, బుమ్రా, హర్షల్ పటేల్/ఉమేశ్ యాదవ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు