Rohit Sharma: ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో కెప్టెన్సీకి దూరమైన తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma) బ్యాటర్గా అదరగొట్టేస్తున్నాడు. అయితే, పంజాబ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ కాసేపు కెప్టెన్ అవతారం ఎత్తాడు. చివరి ఓవర్లలో ఫీల్డింగ్ను సెట్ చేయడంతోపాటు బౌలర్లకు కీలక సూచనలు ఇచ్చాడు. దీంతో తమ అభిమాన క్రికెటర్ మళ్లీ కెప్టెన్గా యాక్టివేట్ అవుతున్నాడని ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. రెగ్యులర్ సారథి హార్దిక్ పాండ్య, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో సమాలోచనలు చేస్తూ రోహిత్ ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘పంజాబ్తో మ్యాచ్లో ముంబయి జట్టును చూస్తే ముచ్చటేసింది. హార్దిక్, రోహిత్, బుమ్రా ఒకరినొకరు సంప్రదించుకుంటూ జట్టును నడిపించారు. చివరి రెండు ఓవర్లలో రోహిత్ను ముంబయి సారథిగా చూశాం. అతడే ఫీల్డింగ్ పెట్టాడు. బౌలర్లకు ఎలా వేయాలో సూచించాడు. కెప్టెన్గా మళ్లీ తన పాత అవతారం ఎత్తాడు. ఇప్పుడు ముంబయి మళ్లీ విజయం సాధించింది. అయితే, ప్లే ఆఫ్స్కు చేరుకోవాలంటే ఇంకా కష్టపడాలి. అదేమంతా ఈజీ కాదు’’ అని హర్భజన్ తెలిపాడు.
బుమ్రాను సరిగ్గా వాడుకోవడం లేదు: మూడీ
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బుమ్రాను కెప్టెన్ హార్దిక్ సరైన పద్ధతిలో వాడుకోవడం లేదని ఆసీస్ మాజీ కెప్టెన్ టామ్ మూడీ వ్యాఖ్యానించాడు. ‘‘పంజాబ్తో మ్యాచ్లోనూ ఇది సుస్పష్టంగా కనిపించింది. ఆరంభంలోనే రెండు వికెట్లను పడగొట్టిన బుమ్రాతో మళ్లీ 13వ ఓవర్ తర్వాత వేయించారు. పవర్ప్లేలో రెండు ఓవర్లలోనే కీలక బ్యాటర్లను ఔట్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ పంజాబ్ పుంజుకొనేందుకు అవకాశం ఇచ్చేలా బుమ్రాను ఆలస్యంగా బౌలింగ్ తీసుకొచ్చారు. గెరాల్డ్ పరిస్థితి కూడా అలానే ఉంది. ప్రత్యర్థి జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడే వారిద్దరితో బౌలింగ్ చేయించి ఉంటే కోలుకొనేందుకు కష్టమయ్యేది. మ్యాచ్ చివరి వరకూ వచ్చేదే కాదు. వ్యూహాత్మకంగా ముంబయి ఇబ్బందులు పడుతూనే ఉంది. బుమ్రా, కోయిట్జీకి సహకారం అందించేందుకు మిగతా బౌలర్లూ ముందుకు రావాలి’’ అని వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ