IND vs AUS: డబ్ల్యూటీసీ ఫైనల్.. భారత్కే ఎక్కువ అవకాశాలు: ఆసీస్ మాజీ కెప్టెన్
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ (WTC Final) ఫైనల్కూ దూసుకెళ్లింది.
ఇంటర్నెట్ డెస్క్: జూన్ 7నుంచి 11వ తేదీ వరకు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC Final 2023) ఫైనల్ జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా అడుగుపెట్టిన పెట్టాయి. గత సీజన్ (2021) ఫైనల్లో కివీస్ చేతిలో టీమ్ఇండియా ఓడిన విషయం తెలిసిందే. అందుకే, లండన్ వేదికగా జరిగే ఈసారి ఫైనల్లో కచ్చితంగా గెలవాలని భారత్ అభిమానులు ఆశిస్తున్నారు. ఇంకా మూడు నెలల సమయం ఉంది. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. అయితే, ఈసారి ఫైనల్లో భారత్కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ వ్యాఖ్యానించాడు.
‘‘హార్దిక్ పాండ్య టెస్టు ప్రణాళిక ఏంటో నాకైతే తెలియదు. కానీ షమీ, ఉమేశ్, సిరాజ్ మాత్రం సూపర్బ్. వారంతా అద్భుతమైన ఫాస్ట్బౌలర్లు. ప్రస్తుతం సిరాజ్ టాప్ బౌలర్గా ఎదుగుతున్నాడు. గతంలో ఇంగ్లాండ్లోనే ఇంగ్లాండ్ను ఓడించారు. అందుకే, భారత్కే ఈసారి ఫైనల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తోంది. ఆసీస్పై బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. దిల్లీ టెస్టులో కేవలం గంట ఆటతోనే మ్యాచ్ను వారివైపు తిప్పేసుకుంది. ఈ సిరీస్ను వారు గెలవడానికి పూర్తిగా అర్హులు’’ అని ఫించ్ చెప్పాడు.
గాయంతో భారత్తో టెస్టు సిరీస్ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన డేవిడ్ వార్నర్పై (David Warner) ఫించ్ ప్రశంసలు కురిపించాడు. మూడుఫార్మాట్లలోనూ ఆసీస్ తరఫున అత్యుత్తమ ఆటగాడు అతడేనని కొనియాడాడు. ‘‘భారత్తో సిరీస్లో గొప్పగా రాణించలేదు. కానీ, ఇప్పటికీ ఆసీస్ తరఫున అన్ని ఫార్మాట్లలోనూ వార్నర్ అత్యుత్తమ బ్యాటర్. తప్పకుండా ఫామ్లోకి వచ్చి విజృంభిస్తాడు’’ అని తెలిపాడు. భారత్తో మూడు వన్డేల సిరీస్కు ఎంపికైన వార్నర్.. తొలి వన్డే కోసం ఎంపిక చేసిన తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం