Team India: ప్రపంచకప్ ఆశలపై ‘గాయాలు’ నీళ్లు చల్లుతాయా?
పొట్టి ప్రపంచకప్ సమీపిస్తోన్న కొద్దీ భారత శిబిరంలో గాయాల బెడద ఎక్కువుతోంది. ఇప్పటికే బుమ్రా, జడేజా దూరం కాగా.. తాజాగా గాయం కారణంగా దీపక్ చాహర్ కూడా వైదొలగనుండటం టీమ్ఇండియా అభిమానులకు షాక్ తగిలింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్ ముందు టీమ్ఇండియాకు వరుస గాయాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ సారి ఎలాగైనా ఐసీసీ టైటిల్ను ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్న భారత్కు.. దీపక్ చాహర్ గాయంతో మూడో షాక్ తగిలిందని సమాచారం. ఇప్పటికే ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా వైదొలిగారు. దీంతో టీ20 ప్రపంచకప్లో భారత్ ప్రదర్శనపై గాయాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అనే ఆందోళన మొదలైంది.
ఇద్దరూ టాపర్లే..
రోహిత్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ ఫామ్లోకి వచ్చేశారు.. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య కూడా కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమైపోయాడు.. అని ఆనందంతో ఉన్న టీమ్ఇండియాకు తొలి ఎదురు దెబ్బ రవీంద్ర జడేజా రూపంలో తగిలింది. ఆసియా కప్ తొలి మ్యాచ్లో పాక్పై కీలక ఇన్నింగ్స్ ఆడిన జడేజా మోకాలి గాయం కారణంగా.. శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకోవడంతో మెగా టోర్నీకి జట్టును ప్రకటించకముందే వైదొలిగిన తొలి ఆటగాడిగా మారిపోయాడు.
చాలా రోజులపాటు ఆటకు దూరమై.. ఆసీస్తో టీ20 సిరీస్లో జట్టులోకి వచ్చిన స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా కూడా భారీ షాక్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు వెన్ను నొప్పి వస్తోందని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆ మ్యాచ్తోపాటు టీ20, వన్డే సిరీస్లకూ దూరమయ్యాడు. సరే ఇంకా సమయం ఉంది కదా.. ఈ లోపు కోలుకొని మెగా టోర్నీకి అందుబాటులోకి వస్తాడని భావించిన సగటు భారత క్రికెట్ అభిమానికి షాకింగ్ నిర్ణయం వచ్చింది. ఆ సిరీస్తోపాటు టీ20 ప్రపంచకప్నకూ అందుబాటులో ఉండడని బీసీసీఐ ప్రకటించింది. దీనిపై బుమ్రా కూడా స్పందిస్తూ.. మెగా టోర్నీలో ఆడలేకపోవడం బాధగా ఉందని పేర్కొన్నాడు.
‘‘జాతీయ జట్టు తరఫున ఆడేందుకు ఆటగాళ్లకు గాయాలు సాకుగా మారాయి. అదే భారత టీ20 లీగులో మాత్రం అన్ని మ్యాచ్లను ఆడేస్తారు’’.. ఇదీ బుమ్రా వైదొలగడంపై అభిమానుల నుంచి వచ్చిన కౌంటర్.
ఏంటి నష్టం?
ఓ ముగ్గురు ఆటగాళ్లు లేకపోతేనే భారత్ టీ20 ప్రపంచకప్ నెగ్గలేదా..? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇతర ప్లేయర్లు ఆ స్థానాలను భర్తీ చేయలేరా..? అని ప్రశ్నలు వస్తున్నాయి. బుమ్రాకి బదులు షమీ, సిరాజ్ వంటి పేసర్లు భారత్కు ఉన్నారు. అలాగే రవీంద్ర జడేజా లేకపోయినా.. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ ఆల్రౌండర్లూ భారత్ సొంతం. అయితే కీలక ఆటగాళ్లు గైర్హాజరైతే.. జట్టు ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ప్రత్యర్థి ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించేందుకు చూస్తారు. ఉదాహరణకు ఫాస్ట్ బౌలర్ బుమ్రా లేకపోవడం వల్ల.. డెత్ ఓవర్లలో టీమ్ఇండియా కాస్త బలహీనంగా మారింది. బుమ్రా స్థానంలో తుది జట్టులో షమీ/సిరాజ్.. ఎవరు ఉంటారో తెలియదు. షమీ అయితే డెత్ ఓవర్లను చాలా బాగా హ్యాండిల్ చేయగలడని మాజీల విశ్లేషణ. కానీ బుమ్రా లేనిలోటు మాత్రం తీర్చలేనిదని స్పష్టం. ఎందుకంటే తనదైన యార్కర్లతో టాప్ బ్యాటర్లను సైతం వణికిస్తాడు. ఇప్పుడు బుమ్రా లేకపోవడంతో ప్రత్యర్థులు మన బౌలింగ్ను తేలిగ్గా ఎదుర్కోగలమనే భావిస్తారు.
ఇంకెవరైనా ఉన్నారా..?
ముగ్గురు ప్లేయర్లు గాయాల కారణంగా మెగా టోర్నీ నుంచి వైదొలగడంతో ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న.. తర్వాత ఎవరు?. భారత టీ20 లీగ్ గత సీజన్కు ముందు వరకు గాయాలతో సహవాసం చేసిన హార్దిక్ పాండ్య.. కోలుకొని అద్భుతంగా ఆడేస్తున్నాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఏకైక పేస్ ఆల్రౌండర్ అతడే. గాయాల పరంపర కొనసాగుతున్న వేళ.. పాండ్య మళ్లీ వెన్నునొప్పితో ఇబ్బంది పడితే మాత్రం టీమ్ఇండియాకు కష్టాలు రెట్టింపైనట్లే. బ్యాటింగ్లో ధాటిగా ఆడుతూ.. బౌలింగ్లో రాణించగల పేస్ ఆల్రౌండర్ మరొకరు లేరనే చెప్పాలి. ఇప్పుడు శార్దూల్ ఠాకూర్ను కూడా ఆస్ట్రేలియాకు పంపాలని బీసీసీఐ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. అయితే శార్దూల్ ఠాకూర్ ఉన్నప్పటికీ అతడి నుంచి హార్దిక్ స్థాయిలో ఆటను ఆశించడం అత్యాశే అవుతుంది. చాహల్ స్థానంలో ఎలాగూ రవి బిష్ణోయ్ను ఎంపిక చేసుకొనే వెసులుబాటు ఉంది. ఎవరైనా బ్యాటర్ కావాలంటే మాత్రం శ్రేయస్ అయ్యర్ సిద్ధంగా ఉండనే ఉన్నాడు. వీరిద్దరూ స్టాండ్బై ఆటగాళ్లే. కానీ ఆస్ట్రేలియా పిచ్ల మీద అదనంగా పేసర్తోపాటు బ్యాటర్ను ఎంచుకొంటేనే ఉత్తమమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆందోళన అవసరం లేదు: మాజీలు
జడేజా, బుమ్రా, దీపక్.. దూరమైనప్పటికీ కంగారు పడాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఆయా ప్లేయర్లు లేకపోతే.. ఇతర ఆటగాళ్లకు అవకాశం వచ్చినట్లేనని.. చక్కగా వినియోగించుకొంటే వారే హీరోలవుతారని పేర్కొన్నారు. తమ టాలెంట్తో మంచి ప్రదర్శన చేస్తే అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేపోయే అవకాశం వచ్చిందని సూచనలు చేశారు. జడేజా స్థానంలో వచ్చిన అక్షర్ పటేల్ తన ఆల్రౌండ్ టాలెంట్తో రాణిస్తే మాత్రం జట్టులో స్థానం సుస్థిరం చేసుకొనే అవకాశం ఉంది. అయితే రవీంద్ర జడేజా.. బ్యాటింగ్, బౌలింగ్తోపాటు ఫీల్డింగ్లోనూ అదరగొట్టేస్తాడు.
‘‘బుమ్రా లేకపోవడంపై భారత్ చింతించాల్సిన అవసరం లేదు. ఆసీస్తో టీ20 సిరీస్ మినహా ఈ సంవత్సరం అతడు ఆడింది చాలా తక్కువ మ్యాచ్లు. అయితే బుమ్రా లేని టీమ్ఇండియాను ప్రత్యర్థులు చూసే విధానం మరోలా ఉంటుందనేది కాదనలేని సత్యం. కానీ బుమ్రా స్థానంలో వచ్చే వారికి ఇదొక మంచి అవకాశం’’ అని టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి, మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్