Asia Cup: ఆసియా కప్ సూపర్-4.. టీమ్ఇండియాకు ‘19వ ఓవర్’ ఫోబియా!
భారత్కు 19వ ఓవర్ ఫోబియా పట్టుకుందా..? ఆసియా కప్లో వరుసగా రెండో ఓటమికి ప్రధాన కారణం 19వ ఓవర్లో భారీగా పరుగులు ఇవ్వడం. రెండు సార్లు కూడానూ..
వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమికి కారణం ఇదే..
ఇంటర్నెట్ డెస్క్: భారత్కు 19వ ఓవర్ ఫోబియా పట్టుకుందా..? ఆసియా కప్లో వరుసగా రెండో ఓటమికి ప్రధాన కారణం ఈ ఓవర్లో భారీగా పరుగులు ఇవ్వడం. రెండు సార్లు సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమారే బాధితుడు కావడం గమనార్హం. అసలేంటి 19వ ఓవర్ ఫోబియా.. టీమ్ఇండియా ఓటమికి సంబంధం ఏంటి..? తెలుసుకుందాం..
తొలుత పాక్పై..
యూఏఈ పిచ్లు ఛేదనకు అనుకూలంగా ఉంటున్నాయి. టాస్ నెగ్గిన జట్లు దాదాపు తొలుత బౌలింగ్ వైపే మొగ్గు చూపాయి. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 180 వరకు పరుగులు చేసినా.. లక్ష్య ఛేదనలో మాత్రం కాపాడుకోవడంలో విఫలమై ఓటమిబాట పట్టాయి. టీమ్ఇండియా కూడా ఇలాగే ఓడిపోయింది. ఆసియా కప్ సూపర్-4లో తొలి రెండు మ్యాచుల్లో భారత్ ఓటమికి రెండు ప్రధాన కారణాలు.. తొలుత బ్యాటింగ్ చేయడం, 19వ ఓవర్లో భారీగా పరుగులు సమర్పించుకోవడం.
గ్రూప్ స్టేజ్లో పాక్ మీద విజయం సాధించిన టీమ్ఇండియా.. సూపర్-4లో మాత్రం చేతులెత్తేసింది. భారీ స్కోరు సాధించినా ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసి భారత్ 181/7 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్ 182/5 చేసి విజయం సాధించింది. చివరి 2 ఓవర్లలో 26 పరుగులు చేయాల్సిన క్రమంలో సీనియర్ బౌలర్ భువనేశ్వర్ 19వ ఓవర్ వేశాడు. అప్పటి వరకు అద్భుతంగా బౌలింగ్ వేసిన భువీ ఈ ఓవర్లో మాత్రం సిక్స్, రెండు ఫోర్లు సహా 19 పరుగులు ఇచ్చాడు. దీంతో ఆఖరి ఓవర్కు కేవలం ఏడు పరుగులను మాత్రమే కాపాడుకోవాల్సి వచ్చింది. అప్పటికీ యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్ మ్యాచ్ను ఐదో బంతి వరకు తీసుకెళ్లడం అద్భుతమే.
లంక మీదా ఇలానే..
ఆసియా కప్ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో లంకపై భారత్ ఓడింది. ఇది కూడా చివరి బంతి వరకూ వెళ్లింది. కానీ ప్రత్యర్థి వైపే విజయం మొగ్గు చూపింది. దీనికి కారణం కూడా 19వ ఓవర్లో ఎక్కువగా పరుగులు ఇవ్వడమే. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం ఓపెనర్లు ధాటిగా ఆడటంతో 11 ఓవర్లకే వికెట్ నష్టపోకుండా లంక 97 పరుగులు చేసింది. అయితే చాహల్, అశ్విన్ విజృంభించడంతో స్వల్ప వ్యవధిలో ఓపెనర్లతోపాటు మరో రెండు వికెట్లను పడగొట్టి భారత్ రేసులోకి వచ్చింది. మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంకను అడ్డుకోగలిగారు. దీంతో చివరి రెండు ఓవర్లకు 21 పరుగులు కావాల్సి వచ్చింది.
మరోసారి 19వ ఓవర్ను వేసేందుకు సీనియర్ బౌలర్ భువనేశ్వర్ చేతికే రోహిత్ బంతినిచ్చాడు. తొలి రెండు బంతులకు సింగిల్స్ ఇచ్చిన భువీ ఫర్వాలేదనిపించాడు. అయితే తర్వాత వరుసగా రెండు వైడ్లు వేశాడు. దీంతో లంక బ్యాటర్లపై ఒత్తిడి కాస్త తగ్గింది. లంక కెప్టెన్ శనక వరుసగా రెండు ఫోర్లు బాది లక్ష్యాన్ని కరిగించాడు. ఇక చివరి రెండు బంతులకు మరో రెండు సింగిల్స్ వచ్చాయి. దీంతో భువనేశ్వర్ ఈ ఓవర్లో మొత్తం 14 పరుగులు ఇచ్చాడు. కీలకమైన ఓవర్లో భారీగా పరుగులు రావడంతో లంక పని సులువైంది. చివరి ఓవర్లో ఏడు పరుగులు అవసరం కాగా.. మళ్లీ అర్ష్దీప్ కట్టుదిట్టంగా బంతులను సంధించి మ్యాచ్ను 19.5వ ఓవర్ వరకూ తీసుకొచ్చాడు. అయితే.. అక్కడ అనవసర తప్పిదానికి బైస్ రూపంలో రెండు పరుగులు ఇవ్వడంతో లంక విజయం ఖరారైంది. భారత్ పరాభవం చవిచూసింది.
ఇలాగే కొనసాగితే ఆసియా కప్లోని మిగిలిన ఒక మ్యాచ్తోపాటు వచ్చే ప్రపంచకప్లోనూ టీమ్ఇండియాకు ఇబ్బందులు తప్పవు. యువ బౌలర్లు ఒత్తిడికి గురవుతారని.. సీనియర్కు బౌలింగ్ ఇస్తే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. డెత్ ఓవర్లలో పరుగులు నియంత్రించడం ఎంత కీలకమో ఇప్పటికైనా భారత ఆటగాళ్లు అర్థం చేసుకోవాలని విశ్లేషకులు సూచనలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు