IND vs AUS : నాలుగో టెస్టులో భారత్‌ గెలవచ్చు.. కానీ.. : గావస్కర్‌

నాలుగో టెస్టు జరిగే అహ్మదాబాద్‌ పిచ్‌పై మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar) స్పందించాడు. సమతుల్య పిచ్‌ల అవసరం గురించి తెలియజేశాడు.

Updated : 06 Mar 2023 12:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ(Border-Gavaskar Trophy ) నేపథ్యంలో పిచ్‌(pitch)లపై విపరీతంగా చర్చ జరుగుతోంది. మూడో టెస్టు జరిగిన ఇందౌర్‌ పిచ్‌కు ఐసీసీ(ICC) ‘పేలవం’ రేటింగ్‌తో మూడు డీమెరిట్‌ పాయింట్లు ఇచ్చింది. దీనిపై మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) మండిపడిన విషయం తెలిసిందే. దీంతో అహ్మదాబాద్‌ వేదికగా జరిగే నాలుగో టెస్టు పిచ్‌ ఎలా ఉంటుందనే విషయంపై అందరి దృష్టి నెలకొంది. ఈ నేపథ్యంలో గావస్కర్‌ పిచ్‌లపై మరోసారి స్పందించాడు. సమతుల్య పిచ్‌లు ఉండాల్సిన అవసరముందని సూచించాడు.

‘ఇలాంటి నాణ్యతతో పిచ్‌లు ఉండటం గొప్ప ఆలోచన అని నేను అనుకోను. బ్యాట్‌, బంతికి మధ్య సమతుల్యత ఉండే పిచ్‌లు ఉండాలి. మొదటి రెండు రోజులు కొత్త బంతి బౌలర్లకు కొంత సహకరించేలా.. బ్యాటర్లు పరుగులు చేయగలిగేలా పిచ్‌ ఉండాలి. ఆ తర్వాత 3, 4 రోజుల్లో బంతి కాస్త తిరగాలి’ అని పిచ్‌ల గురించి సన్నీ వివరించాడు. ఇక అహ్మదాబాద్‌లో ఏం జరుగుతుందో తనకు తెలియదన్నాడు. ‘అహ్మదాబాద్‌ పిచ్‌ టర్న్‌ అయితే.. భారత్‌ గెలిచే అవకాశాలు ఉండొచ్చు.. కానీ, మరోసారి పిచ్‌కు డీమెరిట్‌ పాయింట్లు వచ్చే ప్రమాదం ఉంది’ అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

ఈ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ విజయం సాధించగా.. మూడో టెస్టులో ఆసీస్‌ గెలిచి టీమ్‌ఇండియా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. ఇక చివరిదైన నాలుగో టెస్టు అహ్మదాబాద్‌ వేదికగా మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని