IND vs AUS : నాలుగో టెస్టులో భారత్ గెలవచ్చు.. కానీ.. : గావస్కర్
నాలుగో టెస్టు జరిగే అహ్మదాబాద్ పిచ్పై మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) స్పందించాడు. సమతుల్య పిచ్ల అవసరం గురించి తెలియజేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy ) నేపథ్యంలో పిచ్(pitch)లపై విపరీతంగా చర్చ జరుగుతోంది. మూడో టెస్టు జరిగిన ఇందౌర్ పిచ్కు ఐసీసీ(ICC) ‘పేలవం’ రేటింగ్తో మూడు డీమెరిట్ పాయింట్లు ఇచ్చింది. దీనిపై మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) మండిపడిన విషయం తెలిసిందే. దీంతో అహ్మదాబాద్ వేదికగా జరిగే నాలుగో టెస్టు పిచ్ ఎలా ఉంటుందనే విషయంపై అందరి దృష్టి నెలకొంది. ఈ నేపథ్యంలో గావస్కర్ పిచ్లపై మరోసారి స్పందించాడు. సమతుల్య పిచ్లు ఉండాల్సిన అవసరముందని సూచించాడు.
‘ఇలాంటి నాణ్యతతో పిచ్లు ఉండటం గొప్ప ఆలోచన అని నేను అనుకోను. బ్యాట్, బంతికి మధ్య సమతుల్యత ఉండే పిచ్లు ఉండాలి. మొదటి రెండు రోజులు కొత్త బంతి బౌలర్లకు కొంత సహకరించేలా.. బ్యాటర్లు పరుగులు చేయగలిగేలా పిచ్ ఉండాలి. ఆ తర్వాత 3, 4 రోజుల్లో బంతి కాస్త తిరగాలి’ అని పిచ్ల గురించి సన్నీ వివరించాడు. ఇక అహ్మదాబాద్లో ఏం జరుగుతుందో తనకు తెలియదన్నాడు. ‘అహ్మదాబాద్ పిచ్ టర్న్ అయితే.. భారత్ గెలిచే అవకాశాలు ఉండొచ్చు.. కానీ, మరోసారి పిచ్కు డీమెరిట్ పాయింట్లు వచ్చే ప్రమాదం ఉంది’ అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
ఈ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించగా.. మూడో టెస్టులో ఆసీస్ గెలిచి టీమ్ఇండియా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. ఇక చివరిదైన నాలుగో టెస్టు అహ్మదాబాద్ వేదికగా మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్