Team India: వరల్డ్ కప్ సెమీస్లు.. టీమ్ఇండియా నిష్పత్తి 3 : 4
వన్డే ప్రపంచకప్ల్లో (ODI World Cup 2023) భారత్ ఎనిమిదోసారి సెమీస్కు చేరుకుంది. ఇప్పటి వరకు జరిగిన ఏడింట్లో టీమ్ఇండియా పరిస్థితి ఇదీ..
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ 2023 (ODI World Cup 2023) మెగా టోర్నీ సెమీస్ దశకు చేరింది. తొలి సెమీఫైనల్ భారత్-న్యూజిలాండ్ (IND vs NZ) జట్ల మధ్య ముంబయిలోని వాంఖడే వేదికగా జరగనుంది. ఇప్పటికే రెండుసార్లు ఛాంపియన్గా నిలిచిన టీమ్ఇండియా స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ను ముచ్చటగా మూడోసారి సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. లీగ్ స్టేజ్లో అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించిన భారత్ అగ్రస్థానంతో సగర్వంగా సెమీస్కు వెళ్లింది. ఇప్పటి వరకు వరల్డ్ కప్ చరిత్రలో ఏడుసార్లు భారత్ సెమీఫైనల్కు చేరుకోగా.. మూడుసార్లు విజేతగా నిలిచింది. అందులోనూ రెండుమార్లు ఛాంపియన్ కావడం విశేషం.
- 1983: భారత క్రికెట్ దశను మార్చిన సంవత్సరం. కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. సెమీస్లో ఇంగ్లాండ్ను 213 పరుగులకే కట్టడి చేసిన భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఫైనల్లో పటిష్ఠమైన విండీస్ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
- 1987: డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్ సెమీస్కు చేరింది. అయితే, ఈసారి ఇంగ్లాండ్దే పైచేయిగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 254/6 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 219 పరుగులకే పరిమితమై 35 రన్స్ తేడాతో ఓటమిపాలైంది.
- 1996: వన్డే ప్రపంచకప్ 1992లో భారత్ గ్రూప్ స్టేజ్కే పరిమితమై నిరాశపరిచింది. అయితే 96 వరల్డ్ కప్లో మాత్రం పుంజుకుని మళ్లీ సెమీస్కు వచ్చింది. కోల్కతా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఘోర పరాభవం ఎదురైంది. లంక నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యఛేదనలో 34 ఓవర్లకు 120/8 స్కోరుతో ఉన్నప్పుడు స్టేడియంలోని అభిమానులు మ్యాచ్కు తీవ్ర అంతరాయం కలిగించారు. ఆట నిర్వహణకు సాధ్యపడలేదు. దీంతో శ్రీలంకను విజేతగా ప్రకటిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈసారి కప్ను శ్రీలంక కైవసం చేసుకుంది.
- 2003: భారత్కు ఇది అద్భుత టోర్నీ. కీలక ఆటగాళ్లంతా మంచి ఫామ్లో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించారు. అనూహ్యంగా సెమీస్కు వచ్చిన కెన్యాపై టీమ్ఇండియా భారీ విజయం నమోదు చేసింది. తొలుత భారత్ 270/4 స్కోరు చేయగా.. అనంతరం కెన్యా 179 పరుగులకే ఆలౌటైంది. అయితే, ఫైనల్లో మాత్రం ఆసీస్ చేతిలో భారత్కు ఓటమి ఎదురైంది. దీంతో రన్నర్గానే టోర్నీని ముగించింది.
- 2011: రెండోసారి టీమ్ఇండియా విశ్వ విజేతగా నిలిచిన ఏడాది. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్కు చివరి టోర్నీ. సెమీస్లో పాకిస్థాన్ను చిత్తు చేయడం విశేషం. తొలుత భారత్ 260/9 స్కోరు చేయగా.. పాకిస్థాన్ 231 పరుగులకే ఆలౌటైంది. సచిన్ (85) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లు సమష్ఠిగా రాణించి పాక్ను ఓడించంలో కీలక పాత్ర పోషించారు.
- 2015: ఇలాంటి సెమీ ఫైనల్ మ్యాచ్ మళ్లీ చూడాలనుకోరు భారత క్రికెట్ అభిమానులు. వరుసగా రెండోసారి సెమీస్కు చేరిన టీమ్ఇండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఆసీస్ నిర్దేశించిన 329 పరుగుల టార్గెట్ ఛేదనకు దిగిన భారత్ 233 పరుగులకే ఆలౌటైంది.
- 2019: ఎంఎస్ ధోనీ రనౌట్ ఎప్పటికీ మరిచిపోలేని సంఘటన. వర్షం కారణంగా రెండు రోజులపాటు జరిగిన మ్యాచ్లో భారత్పై న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు పోరాడిన ధోనీ రనౌట్ కావడంతోపాటు కీలక సమయంలో రవీంద్ర జడేజా పెవిలియన్కు చేరాడు. కివీస్ 239/8 స్కోరు చేయగా.. టీమ్ఇండియా 221 పరుగులకే ఆలౌటైంది. ఇప్పుడు మరోసారి కివీస్తోనే భారత్ తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. పాక్లో టీమ్ఇండియా పర్యటిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
టీమ్ఇండియా బ్యాటర్ శివమ్ దూబె (Shivam Dube)పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్లో పవర్ఫుల్ హిట్టింగ్తో అలరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి