Team India: వరల్డ్ కప్ సెమీస్లు.. టీమ్ఇండియా నిష్పత్తి 3 : 4
వన్డే ప్రపంచకప్ల్లో (ODI World Cup 2023) భారత్ ఎనిమిదోసారి సెమీస్కు చేరుకుంది. ఇప్పటి వరకు జరిగిన ఏడింట్లో టీమ్ఇండియా పరిస్థితి ఇదీ..
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ 2023 (ODI World Cup 2023) మెగా టోర్నీ సెమీస్ దశకు చేరింది. తొలి సెమీఫైనల్ భారత్-న్యూజిలాండ్ (IND vs NZ) జట్ల మధ్య ముంబయిలోని వాంఖడే వేదికగా జరగనుంది. ఇప్పటికే రెండుసార్లు ఛాంపియన్గా నిలిచిన టీమ్ఇండియా స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ను ముచ్చటగా మూడోసారి సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. లీగ్ స్టేజ్లో అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించిన భారత్ అగ్రస్థానంతో సగర్వంగా సెమీస్కు వెళ్లింది. ఇప్పటి వరకు వరల్డ్ కప్ చరిత్రలో ఏడుసార్లు భారత్ సెమీఫైనల్కు చేరుకోగా.. మూడుసార్లు విజేతగా నిలిచింది. అందులోనూ రెండుమార్లు ఛాంపియన్ కావడం విశేషం.
- 1983: భారత క్రికెట్ దశను మార్చిన సంవత్సరం. కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. సెమీస్లో ఇంగ్లాండ్ను 213 పరుగులకే కట్టడి చేసిన భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఫైనల్లో పటిష్ఠమైన విండీస్ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
- 1987: డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్ సెమీస్కు చేరింది. అయితే, ఈసారి ఇంగ్లాండ్దే పైచేయిగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 254/6 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 219 పరుగులకే పరిమితమై 35 రన్స్ తేడాతో ఓటమిపాలైంది.
- 1996: వన్డే ప్రపంచకప్ 1992లో భారత్ గ్రూప్ స్టేజ్కే పరిమితమై నిరాశపరిచింది. అయితే 96 వరల్డ్ కప్లో మాత్రం పుంజుకుని మళ్లీ సెమీస్కు వచ్చింది. కోల్కతా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఘోర పరాభవం ఎదురైంది. లంక నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యఛేదనలో 34 ఓవర్లకు 120/8 స్కోరుతో ఉన్నప్పుడు స్టేడియంలోని అభిమానులు మ్యాచ్కు తీవ్ర అంతరాయం కలిగించారు. ఆట నిర్వహణకు సాధ్యపడలేదు. దీంతో శ్రీలంకను విజేతగా ప్రకటిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈసారి కప్ను శ్రీలంక కైవసం చేసుకుంది.
- 2003: భారత్కు ఇది అద్భుత టోర్నీ. కీలక ఆటగాళ్లంతా మంచి ఫామ్లో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించారు. అనూహ్యంగా సెమీస్కు వచ్చిన కెన్యాపై టీమ్ఇండియా భారీ విజయం నమోదు చేసింది. తొలుత భారత్ 270/4 స్కోరు చేయగా.. అనంతరం కెన్యా 179 పరుగులకే ఆలౌటైంది. అయితే, ఫైనల్లో మాత్రం ఆసీస్ చేతిలో భారత్కు ఓటమి ఎదురైంది. దీంతో రన్నర్గానే టోర్నీని ముగించింది.
- 2011: రెండోసారి టీమ్ఇండియా విశ్వ విజేతగా నిలిచిన ఏడాది. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్కు చివరి టోర్నీ. సెమీస్లో పాకిస్థాన్ను చిత్తు చేయడం విశేషం. తొలుత భారత్ 260/9 స్కోరు చేయగా.. పాకిస్థాన్ 231 పరుగులకే ఆలౌటైంది. సచిన్ (85) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లు సమష్ఠిగా రాణించి పాక్ను ఓడించంలో కీలక పాత్ర పోషించారు.
- 2015: ఇలాంటి సెమీ ఫైనల్ మ్యాచ్ మళ్లీ చూడాలనుకోరు భారత క్రికెట్ అభిమానులు. వరుసగా రెండోసారి సెమీస్కు చేరిన టీమ్ఇండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఆసీస్ నిర్దేశించిన 329 పరుగుల టార్గెట్ ఛేదనకు దిగిన భారత్ 233 పరుగులకే ఆలౌటైంది.
- 2019: ఎంఎస్ ధోనీ రనౌట్ ఎప్పటికీ మరిచిపోలేని సంఘటన. వర్షం కారణంగా రెండు రోజులపాటు జరిగిన మ్యాచ్లో భారత్పై న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు పోరాడిన ధోనీ రనౌట్ కావడంతోపాటు కీలక సమయంలో రవీంద్ర జడేజా పెవిలియన్కు చేరాడు. కివీస్ 239/8 స్కోరు చేయగా.. టీమ్ఇండియా 221 పరుగులకే ఆలౌటైంది. ఇప్పుడు మరోసారి కివీస్తోనే భారత్ తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు