Hockey India: హాకీ వరల్డ్ కప్.. భారత్ సెమీస్కు చేరాలంటే.. ‘క్రాస్ ఓవర్’ చేయాల్సిందే..!
స్వదేశంలో జరుగుతున్న హాకీ ప్రపంచకప్లో (Hockey World Cup 2023) భారత్ (Team India) కీలక పోరు సిద్ధమవుతోంది. పూల్ దశలో రెండో స్థానంలో నిలవడంతో ‘క్రాస్ ఓవర్’ (CrossOver)లో భాగంగా న్యూజిలాండ్తో మ్యాచ్ను ఆడనుంది. అందులో గెలిస్తేనే.. కప్ను సాధించాలనే కలకు ముందడుగు పడుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: 1980ల్లో వెస్టిండీస్ క్రికెట్ టీమ్ అంటే ప్రత్యర్థులకు హడల్.. అలాగే ఒకప్పుడు భారత హాకీ జట్టంటే కూడానూ బెంబేలెత్తిపోయేవి. ఒలింపిక్స్ బరిలోకి దిగితే స్వర్ణంతో కానీ ఇంటిముఖం పట్టేది కాదు. అలాగే హాకీ ప్రపంచకప్లోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేది. ఒకసారి ఫైనల్.. మరోసారి సెమీస్కు వెళ్లినా కప్ను మాత్రం తీసుకురాలేకపోయింది. ఎట్టకేలకు మూడోసారి 1975లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. అయితే ఇదంతా గతం..
దాదాపు 47 ఏళ్ల పాటు ఒక్కసారి కూడా ప్రపంచకప్ సెమీస్కు పోలేని పరిస్థితి. అత్యధికంగా ఐదో స్థానానికి మాత్రమే చేరుకోగలిగింది. మనం తొలిసారి కప్ను దక్కించుకొన్న తర్వాత ఇప్పటి వరకు 12 టోర్నమెంట్లు జరిగాయి. తాజాగా భారత్ వేదికగానే వరల్డ్ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈసారైనా సుదీర్ఘ కలను నెరవేర్చుకోవాలని టీమ్ఇండియా హాకీ అభిమానులు ఆశిస్తున్నారు. భారత ఆటగాళ్లు కూడా అదే ఊపులోనే ఉన్నట్లుగా ఉంది. ఎందుకంటే పూల్ స్థాయిలో మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించి క్రాస్ఓవర్ మ్యాచ్కు వెళ్లిపోయింది. ఇంతకీ ఈ క్రాస్ ఓవర్ మ్యాచ్ అంటే ఏంటి..? ఇందులో గెలిస్తే పరిస్థితేంటి? భారత్ అవకాశాలు ఎలా ఉన్నాయి...? అనే విషయాలను చూద్దాం
మొత్తం నాలుగు గ్రూప్లుగా విడిపోయిన 16 జట్లు ప్రపంచకప్ కోసం తలపడ్డాయి. ప్రతి పూల్ నుంచి టాప్లో నిలిచిన రెండు జట్లు రేసులో నిలవగా.. మిగతావి ఇంటిముఖం పట్టాయి. ఇప్పుడు క్రాస్ ఓవర్ మ్యాచ్లను ఆడిన తర్వాత.. క్వార్టర్ ఫైనల్, సెమీస్, ఫైనల్ మ్యాచ్లను నిర్వహిస్తారు. క్రాస్ ఓవర్ మ్యాచ్లు అంటే.. ప్రతి పూల్లో టాప్ టీమ్ మినహా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు మరోక పూల్లోని ఇతర జట్లతో తలపడి క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించేందుకు కల్పించే అవకాశమే క్రాస్ ఓవర్. అంటే ఆయా గ్రూప్లోని టాప్ జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లగా.. ఈ రెండు స్థానాల్లో నిలిచిన టీమ్ల్లో క్రాస్ ఓవర్ మ్యాచ్లో ఇతర జట్లతో తలపడి ఎవరు గెలిస్తే వారు క్వార్టర్ ఫైనల్కు చేరుకొంటారు. ఇప్పుడు భారత్ కూడా గ్రూప్ - Dలో రెండో స్థానంలో ఉంది. దీంతో గ్రూప్ - Cలో మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్తో క్రాస్ఓవర్ మ్యాచ్ ఆడనుంది.
ముందు క్రాస్ ఓవర్లో గెలిస్తే..
డిఫెన్స్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ.. గ్రూప్ స్టేజ్లో భారత్ మూడు మ్యాచుల్లో రెండు గెలిచి, ఒకదానిని డ్రా చేసుకొంది. కాబట్టి మరోసారి సమష్ఠిగా రాణిస్తే న్యూజిలాండ్పై విజయం సాధిస్తే భారత్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్తుంది. అక్కడ మాత్రం కఠిన ప్రత్యర్థి బెల్జియం సిద్ధంగా ఉంది. బెల్జియ ఆడిన మూడు మ్యాచుల్లో ఏకంగా 14 గోల్స్ కొట్టింది. కేవలం ప్రత్యర్థులకు మూడు గోల్స్ను మాత్రమే ఇచ్చింది. అన్ని విభాగాల్లో పటిష్ఠమైన జట్టును ఢీకొట్టాలంటే టీమ్ఇండియా మరింత అప్రమత్తంగా ఉండాలి. బెల్జియంపై కచ్చితంగా గెలిస్తేనే సెమీస్కు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక వేళ డ్రాగా ముగించినా.. గత మ్యాచ్లకు సంబంధించిన గోల్స్ లెక్కలతో భారత్ ఇంటిముఖం పట్టక తప్పదు. గత టోక్యో ఒలింపిక్స్లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత భారత్ ఆటగాళ్లు మరింత ఉత్సాహంతో ఉన్నారు. క్వార్టర్ ఫైనల్లో బెల్జియంను ఓడిస్తే మాత్రం ఆత్మవిశ్వాసం పెరిగి తదుపరి మ్యాచ్లకు ఎంతో అక్కరకొస్తుంది.
పైచేయి ఎవరిది..? మ్యాచ్ ఎప్పుడు.. ఎలా చూడాలి..?
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య క్రాస్ ఓవర్ మ్యాచ్ ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. భువనేశ్వర్లోని కళింగ మైదానంలో మ్యాచ్ జరగనుంది. స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2, స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్లో మ్యాచ్ను వీక్షించొచ్చు. ఇరు జట్లు అంతర్జాతీయంగా 44 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో భారత్ 24 మ్యాచుల్లో విజయం సాధించగా.. కివీస్ 15 మ్యాచుల్లోనే గెలిచింది. మరో ఐదు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఈ క్రమంలో గత రికార్డు ప్రకారం.. కివీస్పై భారత్ సమరోత్సాహంతో ఆడాలని ఆశిద్దాం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు