IND vs SL : లంకతో పోరు.. ఓడితే భారత్ ఆశలు చేజారు!
పాకిస్థాన్ మీద విజయంతో ఆసియా కప్ను ఘనంగా ప్రారంభించిన భారత్.. సూపర్-4 దశలో మాత్రం పాక్ చేతిలో ఓటమిపాలైంది. మిగిలిన రెండు మ్యాచ్లను...
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ మీద విజయంతో ఆసియా కప్ను ఘనంగా ప్రారంభించిన భారత్.. సూపర్-4 దశలో మాత్రం పాక్ చేతిలో ఓటమిపాలైంది. మిగిలిన రెండు మ్యాచ్లను గెలిస్తేనే ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఈ క్రమంలో మంగళవారం శ్రీలంకతో భారత్ తలపడనుంది. లంకపై టీమ్ఇండియానే కాస్త పైచేయి సాధించేలా ఉన్నప్పటికీ.. టీ20ల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందో అంచనా వేయలేం. ఈ క్రమంలో ఇరు జట్ల బలాలు ఏంటి.. దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏంటనేవి తెలుసుకుందాం..
దూకుడుగానే ఆరంభించినా..
భారత బ్యాటింగ్ ఎప్పుడూ దూకుడుగానే ప్రారంభమవుతుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఆరంభం నుంచే భారీ షాట్లు కొట్టేందుకు ప్రయత్నిస్తారు. అయితే వాటిని పెద్ద స్కోర్లుగా మలుచుకోవడంలోనే ఇబ్బంది ఎదురవుతుంది. ఉదాహరణకు పాక్తో మ్యాచ్లో తొలి వికెట్ పవర్ ప్లే ఓవర్లలోనే దాదాపు 60 పరుగులను జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోవడంతో 200కిపైగా పరుగెత్తాల్సిన స్కోరు 181 వద్దే ఆగిపోయింది. అదీనూ విరాట్ కోహ్లీ (60) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లేకపోతే పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. మిడిలార్డర్లో సూర్యకుమార్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, దీపక్ హుడా విఫలం కావడం కలవరపెడుతోంది. మొదటి మ్యాచ్లో హార్దిక్ రాణించాడు. అయితే ఈసారి మాత్రం డకౌట్గా పెవిలియన్కు చేరాడు. అందుకే ఓపెనర్లు ఇచ్చిన శుభారంభం భారీ స్కోరుగా మారడంలో మిడిలార్డర్ బాధ్యత తీసుకోవాలి. కీలక మ్యాచుల్లో చేతులెత్తేస్తే మాత్రం బౌలర్లకు కష్టంగా మారే అవకాశం ఉంది.
బౌలర్లు కష్టపడాల్సిందే..
అఫ్గానిస్థాన్ నిర్దేశించిన 176 పరుగులను లంక బ్యాటర్లు ఛేదించారు. టీ20 ఫార్మాట్లో టాప్క్లాస్ బౌలర్లు ఉన్న అఫ్గాన్నే లంక ఎదుర్కొని విజయం సాధించిందంటే ఆ జట్టును తక్కువగా అంచనా వేయకూడదని హెచ్చరిక లాంటిది. అందుకే టీమ్ఇండియా బౌలర్లు ఇంకొంచెం శ్రమించాల్సిన అవసరం ఉంది. భువనేశ్వర్ తన చివరి ఓవర్లో భారీగా పరుగులు ఇవ్వడం.. హార్దిక్ పాండ్య సరైన రిథమ్తో బౌలింగ్ చేయలేకపోవడం పాక్పై భారత్ ఓటమికి ముఖ్య కారణాలని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. తొలి పదిఓవర్లలో అద్భుతంగా కట్టడి చేసిన టీమ్ఇండియా బౌలర్లు.. రెండో భాగంలో పాక్ బ్యాటర్ల ముందు చిత్తయ్యారు. పాక్ జట్టులో నవాజ్, షాదాబ్ రాణిస్తే.. చాహల్ మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. యువ బౌలర్లు అర్ష్దీప్, రవి బిష్ణోయ్ మంచి ప్రదర్శనే ఇచ్చారు. ప్రత్యర్థి ఛేజింగ్ సమయంలో బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధిస్తేనే ఫలితం సానుకూలంగా వచ్చే అవకాశం ఉంది.
ఫీల్డర్లూ బహు పరాక్..
పాకిస్థాన్ మీద ఓడి పోవడానికి బౌలింగ్, బ్యాటింగ్లో నిర్లక్ష్యం ఎంత కారణమో.. ఫీల్డింగ్ వైఫల్యం కూడా కీలక పాత్ర పోషించింది. కేవలం సింగిల్ మాత్రమే వచ్చే సందర్భంలోనూ పాక్ బ్యాటర్లు ధైర్యంగా డబుల్ సాధించారు. మరీ ముఖ్యంగా కాలి నొప్పితో బాధపడుతూనే కీలక ఇన్నింగ్స్ ఆడిన రిజ్వాన్ కూడా వికెట్ల మధ్య చురుగ్గా పరుగెత్తాడు. కానీ మన ఫీల్డర్లు మాత్రం అంత దూకుడు ప్రదర్శించలేకపోయారు. అదేవిధంగా కీలక సమయంలో పాక్ బ్యాటర్ అసిఫ్ అలీ ఇచ్చిన సులువైన క్యాచ్ను యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్ వదిలేశాడు. దీనికి భారత్ భారీ మూల్యమే చెల్లించుకొంది. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఏకంగా సిక్స్, ఫోర్ బాదేసి మ్యాచ్ను పాక్వైపు తిప్పేశాడు. మంగళవారం శ్రీలంకతో జరిగే మ్యాచ్లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఫీల్డింగ్ చేయాలి. గ్రూప్ స్టేజ్లో హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో కీలక బ్యాటర్, ఆ జట్టు కెప్టెన్ నిజాకత్ ఖాన్ను రనౌట్ చేసిన విధానం అద్భుతం. ఆ మ్యాచ్లో భారత ఫీల్డింగ్ ప్రమాణాలు కూడా అత్యుత్తమంగా ఉన్నాయి.
లంకను తక్కువ అంచనా వేయొద్దు..
ఆసియా కప్ ఆరంభ మ్యాచ్లో అఫ్గాన్ చేతిలో లంక ఘోర ఓటమిని చవిచూసింది. కానీ ఆ తర్వాత బంగ్లాదేశ్పై సంచలన విజయం సాధించి సూపర్-4 దశకు చేరుకుంది. ఈ స్టేజ్లోనూ మొదటి మ్యాచ్ ఇరు జట్ల మధ్యే పడింది. అయితే అఫ్గాన్పై ప్రతీకార విజయం సాధించి లంక బ్యాటర్లు అదరగొట్టేశారు. అఫ్గాన్ నిర్దేశించిన 176 పరుగులను లంక ఛేదించింది. నిస్సాంక, కుశాల్ మెండిస్, కెప్టెన్ డాసున్ శనక, భానుక రాజపక్స, దనుష్క గుణతిలక, హసరంగ వంటి బ్యాటర్లు ఆ జట్టు సొంతం. వీరిలో హసరంగ, చమిక కరుణరత్నె, శనక ఆల్రౌండర్లు. లంక మిస్టరీ స్పిన్నర్గా మారిన తీక్షణ బౌలింగ్తో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మ్యాచ్ను లంక లాగేసుకొనే అవకాశం ఉంది.
జట్లు వివరాలు (అంచనా):
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్/దినేశ్ కార్తిక్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్
శ్రీలంక: నిస్సాంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, భానుక రాజపక్స, డాసున్ శనక (కెప్టెన్), వహిందు హసరంగ, చమిక కరుణ రత్నె, మహీష్ తీక్షణ, అసిత్ ఫెర్నాండో, దిల్షాన్ మదుశనక
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు