Hardik Pandya: హార్దిక్ పాండ్య ఔట్.. ఈ దెబ్బను భారత్ తట్టుకోగలదా?
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా ప్రదర్శన అంచనాలను మించిపోయింది. మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా ఆడిన ఏడు మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించి అందరికంటే ముందుగా సెమీస్ బెర్తును సొంతం చేసుకుంది రోహిత్ సేన. కానీ ఇంతలో భారత్కు పెద్ద షాక్. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు.
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా ప్రదర్శన అంచనాలను మించిపోయింది. మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా ఆడిన ఏడు మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించి అందరికంటే ముందుగా సెమీస్ బెర్తును సొంతం చేసుకుంది రోహిత్ సేన. కానీ ఇంతలో భారత్కు పెద్ద షాక్. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు. హార్దిక్ లేకుండానే భారత్ నాలుగు విజయాలు సాధించింది కాబట్టి అతను దూరమైనా ఇబ్బంది లేదనుకుంటే పొరపాటే. నాకౌట్ దశలో ఈ లోటు ఎక్కడ ప్రతికూల ప్రబావం చూపుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రపంచకప్లో ఇప్పటికే సెమీస్ చేరిన భారత్కు లీగ్ దశలో మిగిలిన రెండు మ్యాచ్లూ నామమాత్రమే. వాటి ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత నాకౌట్లో రెండు మ్యాచ్లు గెలిస్తే భారత్ చేతిలోకి ప్రపంచకప్ వస్తుంది. టోర్నీ ఆరంభానికి ముందు భారత జట్టు మీద అంచనాలు ఓ మోస్తరుగానే ఉండేవి కానీ.. ఇప్పుడు అలా కాదు. ఇంగ్లాండ్ లాంటి హాట్ ఫేవరెట్ పేలవ ప్రదర్శనతో నిష్క్రమించే స్థితిలో.. భారత జట్టు వరుసగా ప్రతి జట్టునూ మట్టికరిపిస్తూ సెమీస్ బెర్తును సొంతం చేసుకున్నాక అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కప్పు మీద బోలెడు ఆశలతో ఉన్నారు అభిమానులు. ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపిస్తూ ముందుకు సాగిపోతున్నారు. సెమీస్ ముంగిట భారత్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. నాకౌట్ దశకు హార్దిక్ పాండ్య కూడా వస్తే మరింత బలంగా మారుతుందని.. టీమ్ఇండియాకు ఎదురుండదని అంతా అనుకున్నారు. కానీ ఇంతలో హార్దిక్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడన్న వార్త షాక్కు గురి చేసింది. ఈ నెల 19న బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా తన తొలి ఓవర్ బౌలింగ్ చేస్తూ హార్దిక్ గాయపడ్డాడు. చీలమండకు తగిలిన గాయం ముందు చిన్నదే అన్నారు. ఒకట్రెండు మ్యాచ్ల తర్వాత అందుబాటులోకి వస్తాడన్నారు. కానీ చివరికి మొత్తం టోర్నీకే అందుబాటులో లేకుండా పోయాడు.
ఇప్పుడంతా బాగుంది కానీ..
నిజానికి హార్దిక్ పాండ్య లేని లోటు బంగ్లాతో పోరులో, ఆ తర్వాతి మ్యాచ్ల్లో పెద్దగా కనిపించలేదు. కాకపోతే కూర్పు పరంగా కొన్ని మార్పులు తప్పలేదు. ఒక్క హార్దిక్ దూరమైతే రెండు మార్పులు చేయాల్సి వచ్చింది. అతను బ్యాటింగ్లో మిడిలార్డర్లో కీలకం. అలాగే బౌలింగ్లోనూ ముఖ్యమే. దాదాపుగా ప్రధాన బౌలర్లతో సమానంగా ఓవర్లు వేశాడు తొలి మూడు మ్యాచ్ల్లో. అందుకే శార్దూల్ను సైతం తప్పించి షమిని స్పెషలిస్టు బౌలర్గా, అలాగే సూర్యకుమార్ను స్పెషలిస్టు బ్యాటర్గా ఎంచుకున్నారు. ఇది ఒక రకంగా మంచే చేసింది. షమి వచ్చినప్పటి నుంచి ఎలా చెలరేగిపోతున్నాడో తెలిసిందే. హార్దిక్ను తప్పించడం వల్ల శార్దూల్ లాంటి సాధారణ బౌలర్ పోయి షమి లాంటి తిరుగులేని బౌలర్ జట్టులోకి వచ్చాడు. సూర్యకుమార్ కూడా ఇంగ్లాండ్తో మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటిదాకా అయితే హార్దిక్ లేని లోటు కనిపించలేదు. కానీ అతనుంటే ఉండే పెద్ద లాభం ఏంటంటే.. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ పూర్తి స్థాయిలో ఉపయోగపడతాడు. కాబట్టి అదనంగా ఒక బ్యాటర్ లేదా బౌలర్ను తీసుకోవచ్చు. హార్దిక్ దూరమైనప్పటి నుంచి భారత్ అయిదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్లన్నింట్లో మన బౌలర్లు అంచనాలను మించి రాణించారు, ప్రత్యర్థి జట్ల నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోయింది కాబట్టి సరిపోయింది. కానీ అవతలి జట్టు ఎదురుదాడి చేసి ప్రధాన బౌలర్లలో ఒకరిద్దరు గాడి తప్పితే.. మ్యాచ్లో మరో ప్రత్యామ్నాయం కనిపించదు.
టోర్నీలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఎంత దూకుడుగా ఆడుతున్నాయో తెలిసిందే. వీటిలో ఒకటి నాకౌట్లో ఎదురై, తమదైన శైలిలో చెలరేగిపోతే ఏంటి పరిస్థితి అన్నది ప్రశ్న. అలా అని ఒక అదనపు బౌలర్ను తీసుకుంటే.. బ్యాటింగ్ బలహీన పడుతుంది. అది కూడా ప్రమాదమే. హార్దిక్ స్థానంలో ఎంచుకోవడానికి దేశంలో మరో నాణ్యమైన ఆల్రౌండర్ లేకపోవడం ఈ విషయంలో మన బలహీనతను చాటి చెబుతుంది. అలాంటి ఆల్రౌండర్ ఉంటే జట్టుకు వచ్చే సమతూకమే వేరు. ప్రపంచకప్లో మిగతా పెద్ద జట్లన్నింటికీ ఇద్దరికి తక్కువ కాకుండా పేస్ ఆల్రౌండర్లు అందుబాటులో ఉన్నారు. కానీ భారత్ మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి హార్దిక్ మీదే ఆధారపడుతోంది. అతను జట్టుకు దూరమైనపుడల్లా సమతూకం దెబ్బ తిని ఇబ్బంది పడుతోంది. ఇలా ఒక ఆటగాడి మీద ఎక్కువ ఆధారపడటం జట్టుకు మంచిది కాదు. అదృష్టం కొద్దీ ప్రస్తుతానికి హార్దిక్ లేని లోటు కనిపించడం లేదు. ప్రపంచకప్లో చివరి వరకు ఇదే పరిస్థితి కొనసాగాలి. భారత్ కప్పు గెలవాలి. కానీ ఆ తర్వాత మాత్రం హార్దిక్ లాంటి పేస్ ఆల్రౌండర్లను తయారు చేసుకోవడం మీద జట్టు ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిందే.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?