T20I Record: టీ20ల్లో టీమ్ఇండియా ప్రపంచ రికార్డు..
టీ20ల్లో టీమ్ఇండియా(Team India) రికార్డు సృష్టించింది. ఈ ఫార్మాట్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా అవతరించింది.
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియాపై నాలుగో టీ20(IND vs AUS)లో ఘన విజయం సాధించిన టీమ్ఇండియా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత్(Team India).. టీ20ల్లో చరిత్ర (T20I Record) సృష్టించింది. ఈ ఫార్మాట్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా అవతరించింది. దాయాది పాకిస్థాన్ రికార్డును బద్దలు కొట్టింది.
టీ20ల్లో భారత్కిది 136వ విజయం. 2006 నుంచి ఇప్పటి వరకూ టీమ్ఇండియా 136 మ్యాచ్ల్లో గెలవగా.. 67 గేమ్ల్లో ఓడిపోయింది. ఒకటి టైగా ముగియగా.. మూడింట్లో ఎలాంటి ఫలితం రాలేదు. ఈ ఫార్మాట్లో టీమ్ఇండియా విజయాల శాతం 63.84గా ఉంది.
ఇంతకుముందు టీ20 ఫార్మాట్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన రికార్డు పాక్ పేరిట ఉండేది. మొత్తం 226 మ్యాచ్ల్లో 135 విజయాలను ఆ జట్టు నమోదు చేసింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ 200 మ్యాచ్ల్లో 102 విజయాలు.. ఆస్ట్రేలియా 181 మ్యాచ్ల్లో 95 విజయాలు.. దక్షిణాఫ్రికా 171 మ్యాచ్ల్లో 95 విజయాలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
కేఎల్ను అధిగమించిన రుతురాజ్..
ఇక ఈ మ్యాచ్లో 32 పరుగులతో రాణించిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా 4 వేల పరుగులను పూర్తి చేసుకున్న భారత బ్యాటర్గా అవతరించాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ను అధిగమించాడు. రుతురాజ్ 116 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించగా.. కేఎల్ 117 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయి చేరుకున్నాడు. ఈ జాబితాలో క్రిస్గేల్ (107 ఇన్నింగ్స్లు), షాన్ మార్ష్ (113), బాబర్ అజామ్ (115), కాన్వే (116) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.
ఇక శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో భారత్ 20 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.