BAN vs IND: బంగ్లాదేశ్ పర్యటనకు భారత్.. షెడ్యూల్ ఇదే.. లైవ్ స్ట్రీమింగ్ ఎలాగంటే?
పసి కూన బంగ్లాదేశ్తో మూడు వన్డేలు, రెండు టెస్టులను భారత్ ఆడనుంది. ఆదివారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, షమీ తదితరులు జట్టులోకి వచ్చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ తర్వాత వరుసగా మ్యాచ్లతో టీమ్ఇండియా బిజీబిజీగా గడిపేస్తోంది. కివీస్ పర్యటన ముగియడంతో మరో సిరీస్ కోసం బంగ్లాదేశ్తో తలపడేందుకు సిద్ధమైంది. బంగ్లాతో మూడు వన్డేలు, రెండు టెస్టులను భారత్ ఆడనుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమ్ఇండియా బరిలోకి దిగబోతోంది. భారత ఆటగాళ్లు ఇవాళ ఢాకాకు చేరుకొంటారు. వన్డే సిరీస్కు టీమ్ను ప్రకటించిన బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ కోసం మాత్రం ఇంకా ప్రకటించలేదు.
సిరీస్ ఎప్పుడు.. వీక్షించేది ఎలా..?
బంగ్లాదేశ్తో తొలుత మూడు వన్డేల సిరీస్ను భారత్ ఆడనుంది. ఆ తర్వాత రెండు టెస్టుల్లో తలపడనుంది. మ్యాచ్లను డిస్నీ+హాట్స్టార్తోపాటు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో వీక్షించే అవకాశం ఉంది. వన్డేలన్నీ ఉదయం 11.30 గంటలకు ప్రారంభమవుతాయి. టెస్టులు ఉదయం 9 గంటలకు మొదలుకానున్నాయి.
వన్డే సిరీస్ ఇలా..
* మొదటి వన్డే: డిసెంబర్ 4, ఢాకా
* రెండో వన్డే: డిసెంబర్ 7, ఢాకా
* మూడో వన్డే: డిసెంబర్ 10, చిట్టగాంగ్
టెస్టు సిరీస్..
* తొలి టెస్టు మ్యాచ్: డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 18 వరకు
* రెండో టెస్టు మ్యాచ్: డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 26 వరకు
విరాట్ వచ్చేస్తున్నాడు..
మెగా టోర్నీ ముగిశాక న్యూజిలాండ్ పర్యటనకు విశ్రాంతి తీసుకొన్న సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ వచ్చేస్తున్నారు. అయితే పంత్తో పాటు వికెట్ కీపర్ల జాబితాలోకి ఇషాన్ కిషన్కు అవకాశం దక్కింది. సంజూ శాంసన్కు చోటు కల్పించలేదు. రవీంద్ర జడేజా ఉన్నప్పటికీ.. ఫిట్నెస్ సాధించాల్సి ఉంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో బుమ్రాను బీసీసీఐ ఎంపిక చేయలేదు. వన్డే సిరీస్కు సంబంధించి తుది జట్టులో స్థానంపై తీవ్ర పోటీ ఉంది.
వన్డే సిరీస్ కోసం జట్లివే:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్కోహ్లీ, రజత్ పటిదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, యశ్ దయాళ్.
బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ షాంటో, యాసిర్ అలీ, షకిబ్ అల్ హసన్, మహముదుల్లా, మెహిదీ హసన్ మిరాజ్, అఫిఫ్ హొస్సేన్ ధ్రుబో, ఎబాడట్ హొస్సేన్, అనముల్ హక్, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీం, నురుల్ హసన్, హసన్ మహముద్, ముస్తాఫిజర్ రహ్మాన్, నసుమ్ అహ్మద్
టెస్టు సిరీస్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్యాదవ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM