SA vs IND : దక్షిణాఫ్రికా పర్యటన.. ఇప్పుడీ సిరీస్లతో భారత్కు కలిగే ప్రయోజనాలివే..
విదేశీ గడ్డపై తొలిసారి సిరీస్లు ఆడేందుకు యువ ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్ఇండియా (SA vs IND) సిద్ధమైంది.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికా టూర్కు భారత్ (IND vs SA).. వన్డే ప్రపంచకప్ తర్వాత టీమ్ఇండియా తలపెట్టిన తొలి విదేశీ పర్యటన.. దాదాపు నెల రోజులపాటు అన్ని ఫార్మాట్లలో సిరీస్లు.. క్రికెట్ అభిమానులకు ఎంటర్టైన్మెంట్ పక్కా. మరోవైపు టీమ్ఇండియాతో పాటు, ఆటగాళ్లకు ఈ పర్యటన ఎంతో కీలకం.. ఎందుకంటే..?
ఆ ఇద్దరూ నిలవాలంటే..
దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులను డిసెంబర్ 10 నుంచి జనవరి 7 వరకు భారత్ ఆడనుంది. పొట్టి సిరీస్కు సూర్యకుమార్, వన్డేలకు కేఎల్ రాహుల్, టెస్టు సిరీస్కు రోహిత్ శర్మను కెప్టెన్లుగా మేనేజ్మెంట్ నియమించింది. పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి రోహిత్తోపాటు విరాట్ కోహ్లీ కాస్త విరామం తీసుకున్నారు. వీరిద్దరూ టెస్టు సిరీస్ నాటికి జట్టుతో చేరిపోతారు. ఇప్పుడీ పర్యటనలో మిగతా రెండు ఫార్మాట్లతో పోలిస్తే వన్డే సిరీస్కు పెద్దగా ప్రాధాన్యం లేదనే చెప్పాలి. ఇప్పటికే వన్డే ప్రపంచకప్ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే, చాలా రోజుల తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్కు ఇప్పుడు వచ్చిన అవకాశం అత్యంత కీలకం. తుది జట్టులో ఆడే అవకాశం వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. విఫలమైతే జట్టులోకి తిరిగి రావడం మరింత సంక్లిష్టంగా మారడం ఖాయం.
టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా..
వరల్డ్ కప్ తర్వాత భారత్ టీ20 సిరీస్లో ఆసీస్ను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమ్ఇండియా అద్భుత ఫలితం సాధించింది. ఆ జట్టులో ఒకరిద్దరు మినహా అందరూ యువకులే. ఇప్పుడు మరోసారి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు సిద్ధమైంది. అయితే జడేజా, సిరాజ్ వంటి మరో ఇద్దరు సీనియర్లు జట్టుతో కలిశారు. ఈ సిరీస్కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్ జరగనుంది. కాబట్టి, ఈ సిరీస్లో ఉత్తమ ప్రదర్శన చేస్తే ఆటోమేటిక్గా వరల్డ్ కప్ కోసం పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉంది. ఆసీస్తో సిరీస్లో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, జితేశ్ శర్మ తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. మరోవైపు రోహిత్ కెప్టెన్సీలోనే టీమ్ఇండియా పొట్టి ప్రపంచకప్ ఆడే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడసలు సమస్య రోహిత్కు జోడీగా ఎవరు ఉంటారు? వన్డే ప్రపంచ కప్లో గిల్ ఆడినా పెద్దగా ఆకట్టుకోలేదు. 20 ఓవర్ల క్రికెట్లో ఆరంభం అద్భుతంగా ఉంటే ఆ తర్వాత వచ్చే ఆటగాళ్లపై పెద్దగా ఒత్తిడి ఉండదు. యశస్వి జైస్వాల్ ఆసీస్పై దూకుడైన ప్రదర్శన క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. లోయర్ ఆర్డర్లో రింకు సింగ్ విలువైన పరుగులు సాధించాడు. దక్షిణాఫ్రికాలోనూ రాణిస్తే ‘ఫినిషర్’ పోస్టు అతడికే సొంతమవుతుంది. బౌలర్లు దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ భారీగా పరుగులు ఇస్తున్నా వికెట్లు పడగొట్టారు. వచ్చే ఏడాది జూన్లోగా టీమ్ఇండియా ఆరు టీ20లను మాత్రమే ఆడనుంది. దీంతో ప్రతి మ్యాచ్లో ఆటగాళ్లు రాణిస్తేనే వరల్డ్ కప్ ‘స్క్వాడ్’ రేసులో ఉంటారు.
డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే?
వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్కు చేరిన టీమ్ఇండియా విజేతగా మాత్రం నిలవలేకపోయింది. ఈసారైనా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరి ఛాంపియన్గా మారాలనే లక్ష్యంతో ఆడుతోంది. ఈ ఏడాది జూన్లో మొదలైన మూడో డబ్ల్యూటీసీ సీజన్లో భారత్ రెండు టెస్టుల్లో తలపడింది. విండీస్పై వారి స్వదేశంలోనే సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇందులో ఒక మ్యాచ్ను టీమ్ఇండియా గెలుచుకోగా.. మరొకటి డ్రాగా ముగిసింది. దీంతో పాయింట్ల పట్టికలో భారత్ (66.67 శాతం) మూడో స్థానంలో కొనసాగుతోంది. 2025 మార్చి నాటికి టాప్-2లో ఉన్న జట్లే ఫైనల్లో టెస్టు ‘గద’ కోసం తలపడతాయి. భారత్ ముచ్చటగా మూడోసారి ఫైనల్కు చేరుకోవాలంటే ప్రతి టెస్టులోనూ విజయం సాధించాలి. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ భారత్కు కీలకంగా మారనుంది. వారి సొంతగడ్డపై సఫారీ జట్టును తట్టుకోవడం కఠిన సవాలే అయినప్పటికీ ఇటీవల ఫామ్ను బట్టి చూస్తే భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉంది. అయితే, ఎలా ఆడుతుందనేదే ఇక్కడ ఆసక్తికరం.
చివరిగా.. ఒకే పర్యటనలో ముగ్గురు సారథులతో బరిలోకి దిగుతున్న టీమ్ఇండియాకు ఇలాంటి ప్రయోగం కొత్త. గతంలో పరిమిత ఓవర్ల క్రికెట్కు, టెస్టు ఫార్మాట్కు వేర్వేరు జట్లతోపాటు కెప్టెన్లను బీసీసీఐ నియమించింది. ఇప్పుడు ఈ ‘ముగ్గురు సారథుల’ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులోనూ కొనసాగించే అవకాశం లేకపోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా