IND vs AUS: విజయం కోసం ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు
ఆసీస్తో చివరి టీ20 మ్యాచ్లో భారత్దే (IND vs AUS) తొలుత బ్యాటింగ్. బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా పోరాడుతోంది. టీమ్ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఆసీస్ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజ్లో టిమ్ డేవిడ్ (6*), బెన్ డార్మెట్ (25) ఉన్నారు. అంతకుముందు ఓపెనర్ ట్రావిస్ హెడ్ (28) దూకుడుగా ఆడాడు. మరో ఓపెనర్ ఫిలిప్ (4), ఆరోన్ హార్డీ (6) విఫలమయ్యారు. భారత బౌలర్లు రవి బిష్ణోయ్ 2, ముకేశ్ కుమార్ ఒక వికెట్ తీశారు. చివరి పది ఓవర్లలో ఆసీస్కు 91 పరుగులు అవసరం.
ఆసీస్ లక్ష్యం 161 పరుగులు
ఆరంభంలో బ్యాటింగ్కు ఇబ్బంది పడినప్పటికీ భారత బ్యాటర్లు పుంజుకున్నారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి టీమ్ఇండియా 160 పరుగులు చేసింది. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ (53) అర్ధశతకం సాధించాడు. అతడితోపాటు జితేశ్ శర్మ (24), అక్షర్ పటేల్ (31) విలువైన పరుగులు చేశారు. ఆసీస్ ఎదుట 161 పరుగులను లక్ష్యంగా నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు యశస్వి జైస్వాల్ (21) ఫర్వాలేదనిపించగా.. రుతురాజ్ గైక్వాడ్ (10), సూర్యకుమార్ యాదవ్ (5), రింకు సింగ్ విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లు బెహ్రెన్డార్ఫ్ 2, డ్వారిషుస్ 2.. హార్డీ, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా తలో వికెట్ తీశారు.
పది ఓవర్లకు 61/4
ఐదో టీ20లో భారత బ్యాటర్లు తడబాటుకు గురయ్యారు. పది ఓవర్లు ముగిసేసరికి టీమ్ఇండియా నాలుగు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంలో పరుగుల రాక కష్టంగా మారింది. దూకుడగా ఆడే క్రమంలో యశస్వి జైస్వాల్ (21: 15 బంతుల్లో), రుతురాజ్ గైక్వాడ్ (10) వరుస ఓవర్లలో పెవిలియన్కు చేరారు. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (5) నిరాశపరిచాడు. రింకు సింగ్ (6) కూడా దూకుడుగా ఆడలేకపోయాడు. ప్రస్తుతం క్రీజ్లో శ్రేయస్ అయ్యర్ (11*), జితేశ్ శర్మ (5*) ఉన్నారు.
టాస్ నెగ్గిన ఆసీస్
భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్లో భాగంగా చివరి మ్యాచ్ బెంగళూరు వేదికగా జరగనుంది. టాస్ నెగ్గిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటికే సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ఇండియా విజయంతో ముగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు సిరీస్లో చివరి మ్యాచ్ను గెలిచి స్వదేశానికి బయల్దేరాలని ఆసీస్ భావిస్తోంది. ఈ క్రమంలో భారత జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. చాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చి నాలుగో టీ20లో ఆడిన దీపక్ చాహర్కు మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. అతడి స్థానంలో అర్ష్దీప్ను తుది జట్టులోకి తీసుకుంది. అత్యవసర వైద్యపరమైన కారణాలతో అతడు ఇంటికి వెళ్లినట్లు కెప్టెన్ సూర్యకుమార్ తెలిపాడు.
జట్లు ఇవే..
భారత్: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, అర్ష్దీప్ సింగ్
ఆసీస్: ట్రావిస్ హెడ్, జోష్ ఫిలిప్, బెన్ డార్మెట్, ఆరోన్ హార్డీ, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మాథ్యూ వేడ్ (కెప్టెన్/వికెట్ కీపర్), నాథన్ ఎల్లిస్, డ్వారిషుస్, జాసన్ బెహ్రెన్డార్ఫ్, తన్వీర్ సంఘా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం