Shubman Gill: టెస్టుల్లో తొలి శతకం బాదిన గిల్.. ఇదే జోరు కొనసాగిస్తే కేఎల్కు ఎసరు!
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ (110) సెంచరీ బాదాడు. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న గిల్కిదే తొలి టెస్టు సెంచరీ కావడం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్న శుబ్మన్ గిల్ (Shubman Gill) వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 20 పరుగులకే వెనుదిరిగినా .. రెండో ఇన్నింగ్స్లో పట్టుదలగా ఆడి శతకం పూర్తి చేసుకున్నాడు. 147 బంతుల్లోనే అతడు మూడంకెల స్కోరును అందుకున్నాడు. టెస్టుల్లో అతడికిదే తొలి శతకం కావడం విశేషం. ఈ సంవత్సరం టెస్టుల్లో సెంచరీ బాదిన తొలి భారత ఓపెనర్గా నిలిచాడు. మొత్తం 152 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 110 పరుగులు చేశాడు. మెహదీ వేసిన 50వ ఓవర్లో తొలి బంతికి సిక్సర్ బాదిన గిల్.. అదే ఓవర్లో మూడో బంతికి హసన్ జాయ్ (సబ్స్టిట్యూట్)కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో గిల్ ఇన్నింగ్స్కి తెరపడింది.
శుబ్మన్ గిల్ 2020 డిసెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో (45), రెండో ఇన్నింగ్స్లో (35) పరుగులు చేశాడు. ఇప్పటివరకు 12 వన్డేలు ఆడి 709 పరుగులు చేయగా.. 15 వన్డేల్లో 687 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లోకి గిల్ ఇంకా అరంగేట్రం చేయలేదు. ఈ 23 ఏళ్ల ఆటగాడు ఇదే ఫామ్ని కొనసాగిస్తే టెస్టుల్లో రోహిత్ శర్మకి జోడీగా కేఎల్ రాహుల్ (KL Rahul)కి బదులు గిల్ని తీసుకునే అవకాశాలున్నాయి. ఎందుకంటే గత కొన్నాళ్లుగా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ విఫలమవుతున్నాడు. ఈ మ్యాచ్లో కూడా తొలి ఇన్నింగ్స్లో (22), రెండో ఇన్నింగ్స్లో (23) పరుగులే చేసి నిరాశపర్చాడు. తర్వాతి మ్యాచ్ల్లో కూడా కేఎల్ విఫలమైతే అతడి ఓపెనింగ్ స్థానం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
ఇక, బంగ్లాదేశ్తో టెస్టు మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 404 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. దీంతో బంగ్లాదేశ్కు భారత్ 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదటి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 150 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!