IND vs PAK : భారత్ X పాకిస్థాన్ పోరు.. 10 పాయింట్లలో వివరాలు!
మరోసారి దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. ఆసియా కప్లో దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. కొంతకాలంగా ఇరు జట్లు...
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు ఢీకొంటున్నాయి. కొంతకాలంగా ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్లు ఆడకపోవడం కూడా ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తిని పెంచింది. రోహిత్ శర్మ సారథ్యంలో తొలిసారి టీమ్ఇండియా ఐసీసీ టోర్నమెంట్లో పాల్గొనబోతుండటం విశేషం. ఈ క్రమంలో భారత్-పాక్ మ్యాచ్కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు..
- గత టీ20 ప్రపంచకప్ తర్వాత భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్న తొలి మ్యాచ్ ఇదే. అప్పటి ఓటమికి ప్రతీకారం తీర్చుకొని మరోసారి పాక్పై ఆధిపత్యం ప్రదర్శించాలని టీమ్ఇండియా కసిగా ఉంది. ఆసియా కప్లో భారత్దే హవా. అత్యధికంగా ఏడుసార్లు ఆసియా కప్ను గెలుచుకుంది. గత ఛాంపియన్ కూడా టీమ్ఇండియానే.
- ఆసియా కప్లో పాకిస్థాన్తో జరిగిన చివరి మూడు మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది. 2016లో ఒకసారి, 2018లో రెండు సార్లు పాకిస్థాన్ను భారత్ ఓడించింది. అయితే 2014లో మాత్రం టీమ్ఇండియాపై పాక్ విజయం సాధించింది.
- ప్రస్తుతం జరిగే ఆసియాకప్ టోర్నీలో మూడుసార్లు భారత్-పాక్ తలపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరు జట్లూ ఒకే గ్రూప్లో ఉన్నాయి. కాబట్టి గ్రూప్ దశలో ఒకసారి (ఇవాళ్టి మ్యాచ్) తలపడటం ఖాయం. మూడు జట్లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4కి అర్హత సాధిస్తాయి. అప్పుడు మరొకసారి దాయాదుల పోరు చూడొచ్చు. ఇక ఫైనల్కు చేరుకుంటే భారత్-పాక్ల మ్యాచ్ను ముచ్చటగా మూడోసారి వీక్షించే భాగ్యం అభిమానులకు దక్కుతుంది.
- టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (3,487) మరో పది పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం కివీస్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్ (3,497) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ ఫామ్ను చూస్తే పది పరుగులు చేయడం అసలు సమస్యేకాదు. అలాగే ఇదే మ్యాచ్లో రోహిత్ శర్మ (367) మరో 66 పరుగులు చేస్తే భారత్-పాక్ మ్యాచుల్లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్గా మారతాడు. పాక్ బ్యాటర్ షోయబ్ మాలిక్ (432) ముందున్నాడు.
- ఫామ్ కోల్పోయి విమర్శలపాలవుతున్న భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ తుది జట్టులో ఉంటే వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ అవుతుంది. ఆసియా కప్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన స్కోరర్ కోహ్లీనే. 2012లో (వన్డే ఫార్మాట్) పాక్పై 183 పరుగులు చేశాడు.
- 2016లో (టీ20 ఫార్మాట్) భారత్పై పాకిస్థాన్ కేవలం 83 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసియా కప్లో టీమ్ఇండియాపై పాక్కు ఇదే అత్యల్ప స్కోరు. వన్డే ఫార్మాట్లో భారత్పై పాక్ 329/6 అత్యధిక స్కోరు సాధించగా.. టీమ్ఇండియా 330/4 చేసి విజయం సాధించింది. భారత్-పాక్ ఆసియా కప్ మ్యాచుల్లో సయీద్ అజ్మల్ (8), అనిల్ కుంబ్లే (7), అబ్దుల్ రజాక్ (6) వికెట్లు తీశారు.
- భారత్, పాక్ జట్లను గాయాలు వీడలేదు. గాయం కారణంగా టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కోల్పోగా.. పాకిస్థాన్ తన పేస్ సంచలనం షహీన్ షా అఫ్రిదిని మిస్ చేసుకుంది. ముఖ్యమైన టోర్నీలో ప్రధాన పేసర్లు లేకుండా ఇరు జట్లు బరిలోకి దిగడం బహుశా ఇదే తొలిసారేమో.
- పాకిస్థాన్తో ఆడిన గత 5 మ్యాచుల్లో భారత్ నాలుగుసార్లు నెగ్గింది. ఒక మ్యాచ్ పాకిస్థాన్ సొంతమైంది. ఆసియా కప్లో భారత్, పాక్ 14సార్లు తలపడగా.. 8 మ్యాచ్ల్లో టీమ్ఇండియా నెగ్గితే, పాకిస్థాన్ ఆరుసార్లు గెలిచింది. ఒక్కసారి కూడా భారత్, పాకిస్థాన్ ఆసియా కప్ ఫైనల్లో తలపడకపోవడం గమనార్హం.
- ఇవాళ మ్యాచ్ జరిగే దుబాయ్ వేదికపైనే గత టీ20 ప్రపంచకప్లో భారత్, పాక్ తలపడ్డాయి. ఆ మ్యాచ్లో భారత్పై పాక్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమ్ఇండియాలో విరాట్ కోహ్లీ (57) మినహా టాప్ ఆర్డర్ విఫలమైంది.
- 2008 వరకు భారత్, పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరిగేవి. ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించకపోవడంతో వాటిని నిలిపివేశారు. ఇప్పటివరకు 132 వన్డేల్లో భారత్ 55, పాక్ 73 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఇక 9 టీ20ల్లో టీమ్ఇండియా ఆరు విజయాలు, పాక్ కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. మరొక మ్యాచ్ ఫలితం తేలలేదు. చివరిసారిగా గత టీ20 ప్రపంచకప్లో పాక్పై భారత్ ఓటమిపాలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు