IND vs PAK: ప్రపంచకప్లో పాక్పై భారత్దే ఆధిపత్యం.. ఎప్పుడెప్పుడు..? కీలక పాత్ర ఎవరిదంటే?
ఐసీసీ మెగా టోర్నీల్లో (వరల్డ్ కప్లు) పాకిస్థాన్పై భారత్ ఆధిపత్యమే (IND vs PAK) కొనసాగుతోంది. ఒక్కసారి కూడా పాక్ గెలవలేకపోయిది. మరోసారి భారత్ వేదికగా జరగుతున్న ప్రపంచకప్లో దాయాదుల పోరును వీక్షించే అవకాశం వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్లో (ODI World Cup 2023) అసలుసిసలు సమరానికి సమయం ఆసన్నమైంది. క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. వన్డే ప్రపంచకప్లో (ODI WC) భారత్, పాక్ ఇప్పటివరకు ఏడుసార్లు (1992, 1996, 1999, 2003, 2011, 2015, 2019) తలపడ్డాయి. ఈ ఏడుసార్లూ దాయాదిపై భారత్ తిరుగులేని ఆధిపత్యం చలాయించి జయకేతనం ఎగరేసింది. మరి ఈ మ్యాచ్లు ఎలా సాగాయి, ఏ ఆటగాళ్లు ఉత్తమ ప్రదర్శన కనబర్చారో తెలుసుకుందాం.
సిడ్నీలో చిందేసిన టీమ్ఇండియా
వన్డే ప్రపంచకప్లో భారత్, పాక్ మొదటిసారిగా 1992లో తలపడ్డాయి. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమ్ఇండియా 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత భారత్ నిర్ణీత 49 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఓపెనర్ అజయ్ జడేజా (46) రాణించగా.. మిడిల్ ఆర్డర్లో వచ్చిన సచిన్ తెందూల్కర్ (54*) అర్ధ శతకం బాదాడు. కపిల్దేవ్ (35) పరుగులు చేశాడు. ఈ లక్ష్యఛేదనలో పాక్ 173 పరుగులకు ఆలౌటైంది. అమీర్ సోహెల్ (62), జావెద్ మియాందాద్ (40) తప్ప మిగతా ఆటగాళ్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. కపిల్ దేవ్, మనోజ్ ప్రభాకర్, జవగళ్ శ్రీనాథ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. సచిన్, వెంకటపతిరాజు ఒక్కో వికెట్ తీశారు.
బెంగళూరులో బెంబేలెత్తించారు..
1996 ప్రపంచకప్లో భారత్, పాక్ మధ్య రెండో క్వార్టర్ ఫైనల్ జరిగింది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమ్ఇండియా బ్యాటర్ నవ్జ్యోత్ సింగ్ సిద్ధు (93; 115 బంతుల్లో 11 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అజయ్ జడేజా (45; 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడటంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో వెంకటేశ్ ప్రసాద్ (3/45), అనిల్ కుంబ్లే (3/48) ధాటికి పాక్ 9 వికెట్లు కోల్పోయి 248 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమ్ఇండియా 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ప్రసాద్ ‘పాంచ్’ పటాకా.. మాంచెస్టర్లో హ్యాట్రిక్
1999 ప్రపంచకప్లో భారత్, పాక్ మధ్య మూడో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా 47 పరుగుల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సచిన్ (45), రాహుల్ ద్రవిడ్ (61), అజారుద్దీన్ (59) రాణించడతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. భారత ఫాస్ట్బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ (5/27) పాక్ బ్యాటర్లను దడదడలాడించడంతో దాయాది జట్టు 180 పరుగులకు ఆలౌటైంది. శ్రీనాథ్ (3/37), అనిల్ కుంబ్లే (2/43) కూడా రాణించారు.
సచిన్ సెంచరీ మిస్.. అయినా విన్
2003 ప్రపంచకప్లో భారత్, పాక్ మరోసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. సయీద్ అన్వర్ (101) సెంచరీ బాదాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా స్కోర్లు చేయలేకపోయారు. అనంతరం 274 పరుగుల లక్ష్యాన్ని భారత్.. మరో 26 బంతులు మిగిలుండగానే పూర్తి చేసేసి విజయం సాధించింది. సచిన్ తెందూల్కర్ (98; 75 బంతుల్లో; 12 ఫోర్లు, ఒక సిక్స్) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. యువరాజ్ సింగ్ (50; 53 బంతుల్లో) హాఫ్ సెంచరీ చేశాడు. రాహుల్ ద్రవిడ్ (44), మహ్మద్ కైఫ్ (35) పరుగులు చేశారు.
పాక్ను ఓడించి ఫైనల్కు
2007 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ దశలో నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఆ సీజన్లో దాయాదుల మధ్య పోరు జరగలేదు. మళ్లీ 2011లో భారత్, పాక్ తలపడ్డాయి. మొహాలీ వేదికగా జరిగిన సెమీస్లో పాక్ను ఓడించి భారత్కు ఫైనల్కు దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పాక్.. 49.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. మిస్బా ఉల్ హక్ (56) టాప్ స్కోరర్. మహ్మద్ హఫీజ్ (43) పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జహీర్ఖాన్, ఆశిశ్ నెహ్రా, మునాఫ్ పటేల్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ విజయం సాధించి రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది.
అడిలైడ్లో అదరగొట్టారు..
ప్రపంచకప్లో భారత్, పాక్ మధ్య ఆరో మ్యాచ్ 2015లో జరిగింది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా 76 పరుగుల తేడాతో విజయం సాధించి అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (107; 126 బంతుల్లో 8 ఫోర్లు) శతకం బాదాడు. శిఖర్ ధావన్ (73; 76 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), సురేశ్ రైనా (74; 56 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఈ భారీ లక్ష్యఛేదనలో పాక్ 47 ఓవర్లలో 224 పరుగులకు కుప్పకూలింది. షమి (4/35) పాక్ పతనాన్ని శాసించాడు. మోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అశ్విన్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.
దంచికొట్టిన రోహిత్
2019 ప్రపంచకప్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ (140; 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లు) భారీ శతకం బాదాడు. కోహ్లీ (77; 65 బంతుల్లో 7 ఫోర్లు) రాణించాడు. దీంతో భారత్ 336/5 భారీ స్కోరు సాధించింది. ఈ లక్ష్యఛేదనలో పాక్ 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అనంతరం వర్షం అంతరాయం కలిగించడంతో ఆట సాధ్యం కాలేదు. దీంతో డక్వర్త్ లూయిస్ ప్రకారం భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్