IND vs SA: సఫారీ జట్టు ఆటకట్టిస్తామా..?అగ్రస్థానంలో భారత్ కొనసాగేనా?
వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) భారీ మ్యాచ్కు వేదిక కోల్కతా. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: స్వదేశంలో ప్రపంచకప్ (ODI World Cup 2023). కఠిన పరీక్షలన్నింటినీ అధిగమించుకుంటూ అప్రతిహత విజయాలతో టీమ్ఇండియా దూసుకుపోతోంది. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రత్యర్థులను హడలెత్తిస్తూ దక్షిణాఫ్రికా విజయాలు సాధిస్తోంది. ఇలాంటి నేపథ్యం కలిగిన భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం కోల్కతా వేదికగా కీలక పోరు జరగనుంది.
బ్యాటర్లు ఇబ్బంది పడితే బౌలర్లు ఆదుకోవడం.. పిచ్ ఎలాంటిదైనా సరే ఇన్స్వింగ్, ఔట్స్వింగ్ బౌలింగ్తో పేసర్లు చెలరేగుతూ ప్రత్యర్థి జట్లను కుప్పకూల్చేయడం భారత జట్టులో చూస్తున్నాం. ఫీల్డింగ్లోనూ మెరుపులతో ప్రత్యర్థులు పరుగులు చేయకుండా నియంత్రిస్తూ టీమ్ఇండియా సాగిపోతోంది. మరోవైపు తొలుత బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్థుల ముందు కొండంత లక్ష్యం నిర్దేశించడం.. అద్భుత బౌలింగ్ దాడితో వికెట్లు తీసి ఓడించడం.. దక్షిణాఫ్రికా స్పెషల్. మొదట బ్యాటింగ్ చేసిన ప్రతి మ్యాచ్లోనూ 300+ పరుగులు చేయడం గమనార్హం. ఇక ఆడిన ఏడింట్లో రెండు సార్లు మాత్రమే ఛేదనకు దిగింది. అందులోనూ నెదర్లాండ్స్ చేతిలో ఓటమిపాలు కావడం గమనార్హం. ఇక పాక్తో బతుకుజీవుడా అంటూ చెమటోడ్చి మరీ నెగ్గింది. ఇదీ ప్రస్తుత వరల్డ్ కప్లో దక్షిణాఫ్రికా జట్టు పరిస్థితి.
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ VS భారత బౌలింగ్
అధికారికంగా సెమీస్ బెర్తును ఖరారు చేసుకున్న టీమ్ఇండియా అగ్రస్థానంతో లీగ్ దశను ముగించాలంటే దక్షిణాఫ్రికా ఓడిస్తే చాలు. అన్ని విభాగాల్లోనూ ఇరు జట్లకు ఏమాత్రం వ్యత్యాసం లేదు. భారత్ జట్టులో రోహిత్, గిల్, విరాట్, శ్రేయస్, కేఎల్ రాహుల్, సూర్యతో కూడిన బ్యాటింగ్ లైనప్ దుర్బేధ్యంగా ఉంటే.. దక్షిణాఫ్రికాకు డికాక్, క్లాసెన్, మార్క్రమ్, రస్సీ వాండర్ డసెన్, మిల్లర్ అదరగొట్టేస్తున్నారు. ఇక బౌలింగ్లోనూ షమీ, బుమ్రా, సిరాజ్తో కూడిన భారత త్రయం గత మ్యాచుల్లో ప్రత్యర్థులను హడలెత్తించారు. దక్షిణాఫ్రికాలోనూ కోయిట్జీ, రబాడ, మార్కో జాన్సెన్తోపాటు స్పిన్నర్లు కేశవ్ మహరాజ్, షంసి మంచి లయతో బౌలింగ్ చేస్తున్నారు.
పిచ్ పరిస్థితి ఇదీ..
కోల్కతా పిచ్ బౌలింగ్కు అనుకూలంగా ఉంటుంది. టాస్ నెగ్గిన జట్టు ఛేదనకే మొగ్గు చూపే అవకాశం ఉంది. దీంతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్కు భారత బౌలింగ్కు పరీక్ష తప్పదు. దీంతో భారత్ షమీ, బుమ్రా, సిరాజ్తోపాటు నాలుగో పేసర్ను తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు ఎవరిని పక్కన పెడతారననేది ఆసక్తికరంగా మారింది.
ఇరు జట్ల టాప్ ఆటగాళ్లు వీరే..
- భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. ఏడు మ్యాచుల్లో 16 వికెట్లు తీశాడు. షమీ 14 వికెట్లు, కుల్దీప్ 10 వికెట్లు పడగొట్టారు.
- భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యంత నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. ఏడు మ్యాచుల్లో 442 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ కూడా 402 పరుగులతో టాప్-5లో ఉన్నాడు.
- డికాక్ 4.. వాండర్ డసెన్ 2.. ఐదెన్ మార్క్రమ్.. క్లాసెన్ ఒక్కోటి.. ఇవేంటని కంగారు పడొద్దు. ఈ ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చేసిన సెంచరీలు. అత్యధిక పరుగుల జాబితాలో క్వింటన్ డికాక్ (545) అగ్రస్థానంలో ఉన్నాడు.
- దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా మార్కో జాన్సెన్ ఉన్నాడు. అతడు ఏడు మ్యాచుల్లో 16 వికెట్లు పడగొట్టాడు. గెరాల్డ్ కోయిట్జీ 14, కేశవ్ మహరాజ్ 11, కగిసో రబాడ 11 చొప్పున వికెట్లు తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?