IND vs SA: సఫారీలతో టీ20 సిరీస్.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
డిసెంబరు 10 నుంచి దక్షిణాఫ్రికా, భారత్ (SA vs IND) మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ ప్రారంభంకానుంది.
ఇంటర్నెట్ డెస్క్: సొంతగడ్డపై టీ20 సిరీస్లో ఆస్ట్రేలియాను చిత్తుచేసిన టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా, భారత్ (SA vs IND) జట్లు మూడేసి టీ20లు, వన్డేలు.. రెండు టెస్టుల్లో తలపడతాయి. ఈనెల 10, 12, 14 తేదీల్లో టీ20లు.. 17, 19, 21న వన్డేలు జరుగుతాయి. 26న తొలి టెస్టు, జనవరి 3న రెండో టెస్టు ప్రారంభమవుతాయి. ఆసీస్తో టీ20 సిరీస్కు కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav).. సఫారీలతో పొట్టి సిరీస్కూ సారథ్యం వహించనున్నాడు. వన్డేలకు కేఎల్ రాహుల్, టెస్టులకు రోహిత్ శర్మ కెప్టెన్లుగా ఉంటారు. భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్కు ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram), టెస్టు సిరీస్కు తెంబా బావుమా కెప్టెన్సీ బాధ్యతలు చూసుకోనున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఎన్ని టీ20 సిరీస్లు జరిగాయి, ఎవరెన్ని మ్యాచ్లు గెలిచారు, కెప్టెన్లుగా ఎవరు వ్యవహరించారో చూద్దాం.
26 మ్యాచ్లు.. ఆధిపత్యం ఎవరిది?
టీ20 ప్రపంచకప్లతో కలిపి ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు 26 మ్యాచ్లు జరిగాయి. టీమ్ఇండియా 13, దక్షిణాఫ్రికా ఎనిమిది మ్యాచ్ల్లో విజయం సాధించాయి. మూడు మ్యాచ్లు రద్దయ్యాయి. సిరీస్ల పరంగా చూస్తే.. ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్లు ఉన్న సిరీస్లు ఐదు జరగ్గా.. భారత్ రెండింటిని, దక్షిణాఫ్రికా ఒక్క సిరీస్ను దక్కించుకున్నాయి. మరో రెండు సిరీస్లు డ్రాగా ముగిశాయి. ఈ ఫార్మాట్లో భారత్-దక్షిణాఫ్రికా తొలిసారిగా 2006లో, చివరగా 2022 ప్రపంచకప్లో తలపడ్డాయి.
కెప్టెన్లు వీరే..
భారత్, దక్షిణాఫ్రికా మధ్య 2006లో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమ్ఇండియాకు వీరేంద్ర సెహ్వాగ్, సఫారీల జట్టుకు గ్రేమ్ స్మిత్ సారథ్యం వహించారు. 2007, 2009, 2010 టీ20 ప్రపంచకప్ల్లో భాగంగా జరిగిన మ్యాచ్లకు భారత్కు ధోనీ, సౌతాఫ్రికాకు గ్రేమ్ స్మిత్ కెప్టెన్లుగా ఉన్నారు. 2011లో డర్బన్ వేదికగా, 2012లో జొహన్నెస్బర్గ్ వేదికగా ఇరుజట్ల మధ్య జరిగిన టీ20ల్లో టీమ్ఇండియాకు ధోనీ, సఫారీల జట్టుకు జాన్ బోథా సారథ్యం వహించారు. 2012 టీ20 ప్రపంచకప్లో భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్కు ధోనీ, ఏబీ డివిలియర్స్ కెప్టెన్లుగా ఉన్నారు. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య 2014 టీ20 ప్రపంచకప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్కు, 2015లో జరిగిన మూడు టీ20ల సిరీస్లో సౌతాఫ్రికాను డుప్లెసిస్, భారత్ను ధోనీ ముందుండి నడిపించారు. 2018లో జరిగిన మూడు టీ20ల సిరీస్లో టీమ్ఇండియాకు కోహ్లీ, దక్షిణాఫ్రికాకు జేపీ డుమిని సారథులుగా ఉన్నారు. 2019లో జరిగిన మూడు టీ20ల సిరీస్కు కోహ్లీ, క్వింటన్ డికాక్, 2022లో ఐదు టీ20 సిరీస్కు రిషభ్ పంత్, తెంబా బావుమా కెప్టెన్లుగా వ్యవహరించారు. 2022లోనే మరోసారి ఇరుజట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ నిర్వహించగా.. భారత్కు రోహిత్ శర్మ, దక్షిణాఫ్రికాకు బావుమా సారథ్యం వహించారు. చివరగా 2022 టీ20 ప్రపంచకప్లో జరిగిన మ్యాచ్కు రోహిత్, బావుమాలే కెప్టెన్లుగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా