IND vs SL: శ్రీలంకతో మ్యాచ్.. ఆ ‘ఒక్కటే’ భారత్ లక్ష్యం!
వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకున్న భారత్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే ఉండాలంటే మిగతా మ్యాచుల్లోనూ విజయం సాధించాలి. ఈ క్రమంలో గురువారం శ్రీలంకతో టీమ్ఇండియా తలపడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్లో (ODI World Cup 2023) భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. పటిష్ఠమైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లను ఓడించింది. బంగ్లా, అఫ్గాన్ వంటి సంచలనాలకు మారుపేరుగా నిలిచిన టీమ్లపైనా ఆధిపత్యం ప్రదర్శించింది. ఇప్పుడు మరో మ్యాచ్కు భారత్ సన్నద్ధమైంది. అయితే, ఈ జట్టు కూడా మెరుగైన ప్రదర్శన చేసి ప్రత్యర్థులకు షాక్ ఇవ్వగల సత్తా ఉంది. అదే శ్రీలంక టీమ్. గురువారం ముంబయి వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ సందర్భంగా టీమ్ఇండియా లక్ష్యం ‘ఒక్కటే’ అయి ఉండాలి.
ఒకరికొకరు భరోసా..
ప్రస్తుతం భారత్ ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. ఆడిన ఆరింట్లోనూ గెలిచింది. ఇంకా మూడు మ్యాచుల్లో తలపడాల్సి ఉంది. ఇతర జట్లతో పోలిస్తే టీమ్ఇండియాకే అద్భుత అవకాశం ఉంది. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచుల్లో భారత్ మినహా అన్ని టీమ్లూ కనీసం ఒక్కో ఓటమిని చవిచూశాయి. భారత్ మాత్రమే విజయాలతో కొనసాగుతోంది. ఇక మిగిలి మ్యాచుల్లోనూ గెలిస్తే నెంబర్వన్ స్థానంతో ‘టాపర్ ఆఫ్ ది టోర్నీ’గా సెమీస్కు చేరుకుంటుంది. ఇప్పటికే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఎదుర్కొన్న అన్ని పరీక్షలను టీమ్ఇండియా గట్టెక్కేసింది. బ్యాటింగ్లో ఇబ్బంది పడినప్పుడు బౌలర్లు ‘మేమున్నాం’ అంటూ జట్టును గెలిపించారు. బౌలర్లు చేసిన శ్రమను వృథా చేయకుండా బ్యాటర్లూ మిగతా మ్యాచుల్లో విజయతీరాలకు చేర్చారు. షమీ, బుమ్రా పదునైన బౌలింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు. బ్యాటింగ్లో రోహిత్, విరాట్, గిల్, కేఎల్, సూర్య మంచి ఫామ్లో ఉన్నారు. శ్రేయస్ ఫామ్ పరిస్థితి కాస్త ఆందోళనగానే ఉంది. క్రీజ్లో కుదురుకోగలిగితే మంచి ఇన్నింగ్స్ ఆడగల సత్తా అతడి సొంతం.
టీమ్లో ఏమైనా మార్పులు ఉంటాయా?
ఇంగ్లాండ్తో ఆడిన జట్టే శ్రీలంకతోనూ బరిలోకి దిగుతుందా..? ఈ మ్యాచ్కూ హార్దిక్ పాండ్య దూరంగా ఉంటాడు. ముంబయి పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో స్పిన్నర్ను అదనంగా తీసుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే అశ్విన్ నెట్స్లో విపరీతంగా శ్రమిస్తున్నాడని వార్తలు వచ్చాయి. మరోవైపు పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను తీసుకుంటే అదనంగా బ్యాటర్ కూడా అందుబాటులో ఉన్నట్లవుతుంది. గత రెండు మ్యాచుల్లో పెద్దగా రాణించలేకపోయిన సిరాజ్ను పక్కన పెట్టి అశ్విన్ లేదా..? శార్దూల్ను ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
గత ఐదు మ్యాచుల్లోనూ మనదే ఆధిపత్యం
భారత్ - శ్రీలంక జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన వన్డేల్లో మనదే ఆధిపత్యం. మొత్తం 167 వన్డేల్లో ఆడగా.. 98 మ్యాచుల్లో టీమ్ఇండియా విజయం సాధించింది. శ్రీలంక 57 వన్డేల్లో గెలిచింది. మరో 11 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ఒకటి టైగా ముగిసింది. ఇటీవల ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచుల్లోనూ భారత్ విజయం సాధించడం విశేషం. ఇందులో ఆసియా కప్ ఫైనల్లో కేవలం 50 పరుగులకే లంకను టీమ్ఇండియా కుప్పకూల్చింది. సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. మరోసారి సిరాజ్ మియా నుంచి అలాంటి ప్రదర్శన రావాలి. అంతకుముందు ఆసియా కప్ సూపర్ -4 మ్యాచ్లోనూ శ్రీలంకకు ఓటమి తప్పలేదు. ఇప్పుడు వరల్డ్ కప్లో పాథుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, సదీరా సమరవిక్రమ మంచి ఫామ్లో ఉన్న బ్యాటర్లు. మధుశంక, వెల్లలాగే, కసున్ రజిత, తీక్షణతో తస్మాత్ జాగ్రత్త. వీరందరికీ ఉపఖండ పిచ్లు బాగా అలవాటు. ఏమరుపాటుగా ఉంటే షాక్ తగిలే ప్రమాదం లేకపోలేదు. వన్డే ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో ఇరు జట్లూ 9 మ్యాచుల్లో తలపడ్డాయి. చెరో నాలుగింటిలో విజయం సాధించడం విశేషం. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. మెగా టోర్నీల్లో శ్రీలంక తమ శక్తియుక్తులన్నింటితో పోరాడుతుందనేదానికి ఇదొక ఉదాహరణ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?