IND vs SL: శ్రీలంకతో మ్యాచ్.. ఆ ‘ఒక్కటే’ భారత్ లక్ష్యం!
వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకున్న భారత్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే ఉండాలంటే మిగతా మ్యాచుల్లోనూ విజయం సాధించాలి. ఈ క్రమంలో గురువారం శ్రీలంకతో టీమ్ఇండియా తలపడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్లో (ODI World Cup 2023) భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. పటిష్ఠమైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లను ఓడించింది. బంగ్లా, అఫ్గాన్ వంటి సంచలనాలకు మారుపేరుగా నిలిచిన టీమ్లపైనా ఆధిపత్యం ప్రదర్శించింది. ఇప్పుడు మరో మ్యాచ్కు భారత్ సన్నద్ధమైంది. అయితే, ఈ జట్టు కూడా మెరుగైన ప్రదర్శన చేసి ప్రత్యర్థులకు షాక్ ఇవ్వగల సత్తా ఉంది. అదే శ్రీలంక టీమ్. గురువారం ముంబయి వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ సందర్భంగా టీమ్ఇండియా లక్ష్యం ‘ఒక్కటే’ అయి ఉండాలి.
ఒకరికొకరు భరోసా..
ప్రస్తుతం భారత్ ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. ఆడిన ఆరింట్లోనూ గెలిచింది. ఇంకా మూడు మ్యాచుల్లో తలపడాల్సి ఉంది. ఇతర జట్లతో పోలిస్తే టీమ్ఇండియాకే అద్భుత అవకాశం ఉంది. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచుల్లో భారత్ మినహా అన్ని టీమ్లూ కనీసం ఒక్కో ఓటమిని చవిచూశాయి. భారత్ మాత్రమే విజయాలతో కొనసాగుతోంది. ఇక మిగిలి మ్యాచుల్లోనూ గెలిస్తే నెంబర్వన్ స్థానంతో ‘టాపర్ ఆఫ్ ది టోర్నీ’గా సెమీస్కు చేరుకుంటుంది. ఇప్పటికే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఎదుర్కొన్న అన్ని పరీక్షలను టీమ్ఇండియా గట్టెక్కేసింది. బ్యాటింగ్లో ఇబ్బంది పడినప్పుడు బౌలర్లు ‘మేమున్నాం’ అంటూ జట్టును గెలిపించారు. బౌలర్లు చేసిన శ్రమను వృథా చేయకుండా బ్యాటర్లూ మిగతా మ్యాచుల్లో విజయతీరాలకు చేర్చారు. షమీ, బుమ్రా పదునైన బౌలింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు. బ్యాటింగ్లో రోహిత్, విరాట్, గిల్, కేఎల్, సూర్య మంచి ఫామ్లో ఉన్నారు. శ్రేయస్ ఫామ్ పరిస్థితి కాస్త ఆందోళనగానే ఉంది. క్రీజ్లో కుదురుకోగలిగితే మంచి ఇన్నింగ్స్ ఆడగల సత్తా అతడి సొంతం.
టీమ్లో ఏమైనా మార్పులు ఉంటాయా?
ఇంగ్లాండ్తో ఆడిన జట్టే శ్రీలంకతోనూ బరిలోకి దిగుతుందా..? ఈ మ్యాచ్కూ హార్దిక్ పాండ్య దూరంగా ఉంటాడు. ముంబయి పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో స్పిన్నర్ను అదనంగా తీసుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే అశ్విన్ నెట్స్లో విపరీతంగా శ్రమిస్తున్నాడని వార్తలు వచ్చాయి. మరోవైపు పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను తీసుకుంటే అదనంగా బ్యాటర్ కూడా అందుబాటులో ఉన్నట్లవుతుంది. గత రెండు మ్యాచుల్లో పెద్దగా రాణించలేకపోయిన సిరాజ్ను పక్కన పెట్టి అశ్విన్ లేదా..? శార్దూల్ను ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
గత ఐదు మ్యాచుల్లోనూ మనదే ఆధిపత్యం
భారత్ - శ్రీలంక జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన వన్డేల్లో మనదే ఆధిపత్యం. మొత్తం 167 వన్డేల్లో ఆడగా.. 98 మ్యాచుల్లో టీమ్ఇండియా విజయం సాధించింది. శ్రీలంక 57 వన్డేల్లో గెలిచింది. మరో 11 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ఒకటి టైగా ముగిసింది. ఇటీవల ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచుల్లోనూ భారత్ విజయం సాధించడం విశేషం. ఇందులో ఆసియా కప్ ఫైనల్లో కేవలం 50 పరుగులకే లంకను టీమ్ఇండియా కుప్పకూల్చింది. సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. మరోసారి సిరాజ్ మియా నుంచి అలాంటి ప్రదర్శన రావాలి. అంతకుముందు ఆసియా కప్ సూపర్ -4 మ్యాచ్లోనూ శ్రీలంకకు ఓటమి తప్పలేదు. ఇప్పుడు వరల్డ్ కప్లో పాథుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, సదీరా సమరవిక్రమ మంచి ఫామ్లో ఉన్న బ్యాటర్లు. మధుశంక, వెల్లలాగే, కసున్ రజిత, తీక్షణతో తస్మాత్ జాగ్రత్త. వీరందరికీ ఉపఖండ పిచ్లు బాగా అలవాటు. ఏమరుపాటుగా ఉంటే షాక్ తగిలే ప్రమాదం లేకపోలేదు. వన్డే ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో ఇరు జట్లూ 9 మ్యాచుల్లో తలపడ్డాయి. చెరో నాలుగింటిలో విజయం సాధించడం విశేషం. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. మెగా టోర్నీల్లో శ్రీలంక తమ శక్తియుక్తులన్నింటితో పోరాడుతుందనేదానికి ఇదొక ఉదాహరణ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆట తీరుపై నెట్టింట విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీ20 ఫార్మాట్కు తగ్గట్టుగా స్ట్రైక్రేట్ ఉండటం లేదని కొందరు మాజీలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వాటిపై ఏబీ డివిలియర్స్ స్పందించాడు. -
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
ఈ ఐపీఎల్ సీజన్లో తొలిసారి ధోనీ ఔటయ్యాడు. అయితే, అతడు చివరి ఓవర్లో సింగిల్ను తిరస్కరించడంపై నెట్టింట చర్చకు తెర లేచింది. -
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
-
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..
-
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ