Dhoni-Harman: రనౌట్లు ఎంత బాధపెడతాయో!.. నెట్టింట అభిమానుల కామెంట్లు
ఫీల్డింగ్లో ప్రత్యర్థి జట్టు చురుగ్గా ఉంటే బ్యాటర్లు అత్యంత జాగ్రత్తగా వ్యవరించాలి. ఏమాత్రం అవకాశం ఇచ్చినా రనౌట్ చేసేస్తారు. ఇలాంటి ప్రమాదమే భారత్కు (Team India) ఎదురైంది. ఆసీస్తో (INDw Vs AUS w) టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో చోటు చేసుకుంది.
(ఫొటో సోర్స్: ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్: సెమీస్లో టీమ్ఇండియా ఓటమికి కెప్టెన్ హర్మన్ప్రీత్ (Harmanpreet kaur) రనౌట్ ప్రధాన కారణం. దీంతో ఈ రనౌట్ గురించి ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోంది. 2019 వన్డే ప్రపంచకప్లో ఎంఎస్ ధోనీ రనౌట్ మాదిరిగానే.. ఇప్పుడు హర్మన్ ఔట్ కావడం వల్లే భారత్ ఓటమిని చవిచూసిందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. హర్మన్తోపాటు జెమీమా రోడ్రిగ్స్ శ్రమించినా ఆసీస్ చేతిలో ఓడిపోవాల్సి వచ్చిదని నెటిజన్లు పేర్కొన్నారు.
‘‘క్రికెట్ అనే గేమ్లో చిన్నపాటి మార్జిన్తోనే గెలుపోటములు చవిచూస్తాం. దానికి ఈ రెండు రనౌట్లు ప్రత్యక్ష ఉదాహరణలు’’
‘‘నిజమైన టీమ్ఇండియా క్రికెట్ అభిమానులు ఈ రెండు రనౌట్లను మరిచిపోలేరు. వుయ్ లవ్ హర్మన్ప్రీత్ కౌర్, ఎంఎస్ ధోనీ’’
‘‘2019 ప్రపంచకప్ రనౌట్ = ఎంఎస్ ధోనీ.. 2023 వరల్డ్ కప్ రనౌట్ = హర్మన్ప్రీత్ కౌర్. రనౌట్లు ఎప్పుడూ బాధపెడతాయి’’
‘‘జెర్సీ నంబర్ 7 ఐసీసీ టోర్నమెంట్ సెమీస్కు జట్టును తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే రనౌట్ రూపంలోనే ముగింపు ఇవ్వడం గమనార్హం. 5 పరుగుల తేడాతో ఓడిపోవడం బాధగా అనిపిస్తోంది. 2019లో ఎంఎస్ ధోనీ.. ఇప్పుడు హర్మన్ కెప్టెన్’’ అని అభిమానులు కామెంట్లు చేశారు.
అప్పుడు కూడా ధోనీ అలా..
2019 వన్డే ప్రపంచకప్లో ధోనీ, రవీంద్ర జడేజా అర్ధశతకాలు సాధించి విజయం వైపుగా దూసుకుపోతున్న వేళ.. వీరిద్దరూ ఔట్ కావడంతో న్యూజిలాండ్ చేతిలో ఓటమి తప్పలేదు. కివీస్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 92/6 స్కోరుతో ఉన్నప్పుడు... ధోనీ - జడేజా ఏడో వికెట్కు 116 పరుగులు జోడించారు. దీంతో భారత ఇన్నింగ్స్ గాడిన పడినట్లు అనిపించింది. అయితే, తొలుత జడేజా వికెట్ను నష్టపోయినప్పటికీ.. ధోనీ ఉన్నాడనే ధీమాతో భారత్ ఆడింది. కానీ, గప్తిల్ మార్టిన్ వేసిన డైరెక్ట్ త్రో వికెట్లను గిరాటేసింది. అర్ధశతకం సాధించి మరీ జట్టును విజయతీరాలకు చేర్చేలా అనిపించిన ధోనీ రనౌట్ కావడంతో భారత్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలం కావడం.. కివీస్ గెలవడం చకచకా జరిగిపోయాయి.
ఇప్పుడు ఇలా..
మహిళల టీ20 ప్రపంచకప్ 2023 సెమీస్లోనూ భారత్ అలాంటి పరిస్థితే ఎదురైంది. ఆసీస్ చేతిలో కేవలం 5 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైంది. హర్మన్ప్రీత్ (52), జెమీమా రోడ్రిగ్స్ (43) రాణించడంతో ఒకానొక దశలో భారత్ విజయం దశగా సాగింది. 2019 ప్రపంచకప్లో ఎలా జరిగిందో.. అలాగే ఇప్పుడు కూడా రోడ్రిగ్స్ ఔటైన కాసేపటికే హర్మన్ రనౌట్ రూపంలో పెవిలియన్కు చేరడంతో భారత ఓటమి దిశగా సాగింది. చివర్లో బ్యాటర్లు రాణించకపోవడంతో పరాజయం తప్పలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్