Robin Uthappa: టీ20 లీగ్లో వీరవిహారం.. జాతీయ జట్టులోకి మాత్రం పోరాటం
ధోనీ, సెహ్వాగ్, యువరాజ్, గంభీర్, కార్తిక్, ఇర్ఫాన్ పఠాన్.. వీరంతా భారత్ తొలి పొట్టి ప్రపంచకప్ను నెగ్గిన జట్టులో సభ్యులు.. వీరితోపాటు మరొక ఆటగాడు కూడా ఉన్నాడు..........
ఇదీ రాబిన్ ఉతప్ప ప్రస్థానం
ధోనీ, సెహ్వాగ్, యువరాజ్, గంభీర్, కార్తిక్, ఇర్ఫాన్ పఠాన్.. వీరంతా భారత్ తొలి పొట్టి ప్రపంచకప్ను నెగ్గిన జట్టులో సభ్యులు. వీరితోపాటు మరొక ఆటగాడు కూడా ఉన్నాడు. ప్రతిభకు కొదవలేని ఆటగాడు.. కానీ జాతీయ జట్టులోకి అడపాదడపా రావడం.. ఏదో రెండు మ్యాచ్లు ఆడేసి మళ్లీ దూరమవడం.. ఇదీ సీనియర్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ సాగిన తీరు. అయితే భారత టీ20 లీగ్లో మాత్రం తనదైన దూకుడైన ఆట తీరును ప్రదర్శించాడు. తనదైన రోజున బ్యాట్లో మ్యాచ్ను శాసించాడు. తాజాగా రాబిన్ ఉతప్ప జాతీయ, అంతర్జాతీయ ఫార్మాట్లకు వీడ్కోలు పలికేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకకు చెందిన రాబిన్ ఉతప్ప.. విరాట్ కోహ్లీ కంటే ముందే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. వన్డే స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు. వికెట్ కీపర్గానూ బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే ఎంఎస్ ధోనీ ఉండటంతో ఉతప్పకు అవకాశాలు తక్కువగానే వచ్చాయి. భారత్ తరఫున కేవలం 46 వన్డేలు, 12 టీ20లకు మాత్రమే ఆడగలిగాడు. టెస్టు జట్టులోకే ఎంట్రీ కాలేకపోయాడు. కానీ భారత టీ20 లీగ్లో మాత్రం అదరగొట్టేశాడు. ఇప్పటి వరకు 205 మ్యాచుల్లో 130.30 స్ట్రైక్రేట్తో 4,952 పరుగులు సాధించాడు. ఇందులో 27 అర్ధశతకాలు ఉన్నాయి. బెంగళూరు, రాజస్థాన్, ముంబయి, కోల్కతా, చెన్నై జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
పాక్పై అర్ధశతకం
పాకిస్థాన్ జట్టుతో భారత్ తలపడేటప్పుడు ప్రతి ఆటగాడిపై ఒత్తిడి ఉంటుంది. అయితే 2007 టీ20 ప్రపంచకప్లో తొలిసారి ఆడిన రాబిన్ ఉతప్ప మాత్రం ఏమాత్రం బెరుకు లేకుండా అర్ధశతకం కొట్టేశాడు. మహమ్మద్ అసిఫ్, ఉమర్ గుల్, యాసిర్ అరాఫత్ లాంటి బౌలర్లను ఎదుర్కొని కేవలం 39 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్లో భారత్ తరఫున ఉతప్పదే అత్యధిక స్కోరు. అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో భారత్ తరఫున అర్ధశతకం సాధించిన తొలి బ్యాటర్గానూ రాబిన్ ఉతప్ప రికార్డు సృష్టించాడు. తర్వాత జాతీయ జట్టు తరఫున కొన్ని మ్యాచ్లను ఆడినా.. సరైన గుర్తింపు రాలేదు. అయితే భారత-ఏ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. టీమ్ఇండియా తరఫున తన చివరి మ్యా్చ్ను 2015లో ఆడాడు.
భారత టీ20 లీగ్లో..
జాతీయ జట్టులో స్థానం కోసం పోరాడిన రాబిన్.. భారత టీ20 లీగ్లో మాత్రం దుమ్మురేపాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఓపెనర్గా వచ్చి దూకుడు ప్రదర్శించాడు. 2008లోనే ముంబయి తరఫున తొలి సీజన్ ఆడాడు. మొదటి మ్యాచ్లోనే 38 బంతుల్లో 48 పరుగులు సాధించాడు. ఆ తర్వాత 2009 సీజన్కే బెంగళూరుకు మారిపోయాడు. అయితే ఆ సీజన్లో పెద్దగా రాణించలేదు. 2010లో పంజాబ్ జట్టులో చేరిన ఈ కుడిచేతివాటం ఆటగాడు.. మరుసటి సీజన్లో అప్పటి పుణె వారియర్స్లో చేరాడు. పుణె జట్టును తొలగించిన తర్వాత కోల్కతా (2014-19) తరఫున ఆడాడు. 2020 సీజన్లో రాజస్థాన్కు మారిపోయిన రాబిన్ ఉతప్ప.. గత రెండు సీజన్లలో మాత్రం చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.