Sunil Chhetri: ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది.
రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్బాల్ స్టార్
జూన్ 6న ఆఖరి మ్యాచ్
దిల్లీ
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. ఆటతో, నాయకత్వంతో దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత జట్టుకు వెన్నెముకలా నిలిచి.. అభిమానులను అలరించి మురిపించిన ఈ మేటి ఫుట్బాలర్ ఇంకొన్ని రోజుల్లో రిటైర్కానున్నట్లు ప్రకటించాడు. జూన్ 6న అతడు చివరిసారి దేశం తరఫున బరిలోకి దిగుతాడు.
ఫుట్బాల్లో ఓ గొప్ప అంకం ముగియనుంది. భారత ఫుట్బాల్ మేటి, కెప్టెన్ సునీల్ ఛెత్రి తన ఇన్నింగ్స్ను ముగిస్తున్నాడు. జూన్ 6న కువైట్తో జరిగే ప్రపంచకప్ అర్హత మ్యాచ్ అనంతరం రిటైర్కానున్నట్లు ప్రకటించాడు. బుధవారం తన సోషల్ మీడియా ఖాతాల్లో ఛెత్రి తన నిర్ణయాన్ని తెలిపాడు. ‘‘కువైట్తో మ్యాచే కెరీర్లో నాకు చివరిది. దేశం తరఫున ఆడాలన్నది ప్రతి ఒక్కరి కల. అది నాకు సాధ్యమైంది. దేశం తరఫున ఆడటానికి మరేదీ సాటిరాదు’’ అని ఓ వీడియో ద్వారా ఛెత్రి తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 2005లో అరంగేట్రం చేసిన ఈ స్టార్ స్ట్రైకర్ ఇప్పటివరకు 94 గోల్స్ కొట్టాడు. దేశం తరఫున అత్యధిక గోల్స్ కొట్టిన, అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా కెరీర్ను ముగించనున్నాడు. మార్చిలో 150వ అంతర్జాతీయ మ్యాచ్ను ఆడిన అతడు.. తాజా వీడియోలో పాకిస్థాన్పై తన అరంగేట్ర మ్యాచ్ను గుర్తు చేసుకున్నాడు. ‘‘ఆ రోజును నేనెప్పటికీ మరిచిపోలేను. దేశం తరఫున నా తొలి మ్యాచ్ను తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. అది నమ్మశక్యం కానిది. అంతకన్నా ముందు రోజు ఉదయం సుఖి సర్ (అప్పటి జట్టు కోచ్ సుఖ్విందర్ సింగ్) నా దగ్గరకు వచ్చి ‘నువ్వు ఆడబోతున్నావు’ అని చెప్పినప్పుడు కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేను’’ అని ఛెత్రి అన్నాడు. ఛెత్రి ఆఖరి మ్యాచ్ కోల్కతాలోని సాల్ట్లేక్ స్టేడియంలో జరుగుతుంది. తన కెరీర్లో ఎక్కువ ఫుట్బాల్ ఆడిన చోటే అతడు రిటైరవుతున్నాడు.
ప్రస్థానమిలా...
ఛెత్రి లేని భారత ఫుట్బాల్ను ఊహించడం కష్టమే. అతడు లేని లోటు భర్తీ చేయడం కూడా. 19 ఏళ్లుగా జట్టులో అంతర్భాగంగా ఉన్నాడు మరి. ఈ 39 ఏళ్ల స్టార్ స్ట్రైకర్.. ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్బాల్ ఆడుతున్న వారిలో, అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో రొనాల్డో, మెస్సి తర్వాతి స్థానంలో మూడో స్థానంలో ఉన్నాడు. భారత్ మూడు సార్లు (2007, 2009, 2012) నెహ్రూ కప్, మూడు సార్లు (2011, 2015, 2021) సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ (శాఫ్) ఛాంపియన్షిప్ గెలవడంలో కీలక పాత్ర పోషించడం ఛెత్రి కెరీర్లో హైలైట్స్. 2008 ఏఎఫ్సీ ఛాలెంజ్ కప్ గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. ఆ విజయంతో భారత్ 27 ఏళ్లలో తొలిసారి ఏఎఫ్సీ ఆసియా కప్ (2011)కు అర్హత సాధించింది. సికింద్రాబాద్లో పుట్టిన ఛెత్రి 2002లో మోహన్ బగాన్ తరఫున క్లబ్ ఫుట్బాల్లో అరంగేట్రం చేశాడు. 2010లో యుఎస్ఏ మేజర్ లీగ్ సాకర్ జట్టు కన్సాస్ సిటీ విజార్డ్స్ తరఫున కూడా ఆడాడు. ఏడుసార్లు ఏఐఎఫ్ఎఫ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న ఛెత్రి.. ఇతర పెద్ద భారత క్లబ్లు ఈస్ట్ బెంగాల్ (2008-2009), డెంపో (2009-2010)లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ముంబయి సిటీ, బెంగళూరు ఎఫ్సీల తరఫున ఆడాడు. క్లబ్ ఫుట్బాల్లో ఛెత్రి మొత్తం 252 గోల్స్ కొట్టాడు.
ఛెత్రి
అరంగేట్రం: 2005లో
మ్యాచ్లు : 150
గోల్స్ : 94
ఆఖరి మ్యాచ్: జూన్ 6న కువైట్తో
3
ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్బాల్ ఆడుతున్న ఆటగాళ్లలో టాప్ స్కోరర్ల జాబితాలో ఛెత్రి స్థానం. 150 మ్యాచ్ల్లో 94 గోల్స్ కొట్టాడు. రొనాల్డో (205 మ్యాచ్ల్లో 128), మెస్సి (180 మ్యాచ్ల్లో 106) అతడి కన్నా ముందున్నారు.
‘‘సునీల్ నిస్సందేహంగా భారత మేటి ఫుట్బాలర్లలో ఒకడు. భారత ఫుట్బాల్కు అతడి సేవ వెలకట్టలేనిది. అతడి రిటైర్మెంట్ భారత ఫుట్బాల్కు పెద్ద లోటు. ఒక సీనియర్గా అతడితో కలిసి ఆడడం నా అదృష్టం’’
భుటియా
‘‘నీ కెరీర్ అసాధారణం. భారత ఫుట్బాల్, భారత క్రీడల్లో నువ్వో దిగ్గజానివి’’
బీసీసీఐ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూపర్-8 పోరుకు ముందే.. ఆ ఇద్దరు స్వదేశానికి!
పొట్టి కప్లో టీమ్ఇండియా అదరగొడుతోంది. హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కి చేరింది. ఫ్లోరిడా వేదికగా లీగ్ స్టేజ్లో ఆఖరి మ్యాచ్ ఆడనుంది. -
హెల్మెట్లో ఇరుక్కున్న బంతి.. బంగ్లా బ్యాటర్ ఏం చేశాడంటే?
బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో బంతి హెల్మెట్లోకి వెళ్లడంతో బంగ్లా బ్యాటర్ విభిన్నంగా స్పందించాడు. ఇప్పుడు అదే నెట్టింట వైరల్గా మారిపోయింది.
-
సూపర్-8కి చేరిన అఫ్గాన్.. కివీస్ ఔట్.. రేసులో ఇంగ్లండ్
టీ20 ప్రపంచ కప్లో సూపర్-8 రేసు ఆసక్తికరంగా సాగుతోంది. కొన్ని టాప్ టీమ్లు ఇంటిముఖం పడుతుండగా.. మరికొన్ని పోరాడుతున్నాయి. -
ఇక పాక్కు ఛాన్స్ లేనట్లే.. ‘ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ ఎడిషన్’: భారత మాజీ స్టార్ పేసర్
సూపర్-8కు చేరుకొనే అవకాశాలు ఇతర జట్ల ఫలితంపై ఆధారపడాల్సిన పరిస్థితి పాకిస్థాన్ క్రికెట్ టీమ్కు ఎదురైంది. నేడు యూఎస్ఏ-ఐర్లాండ్ మ్యాచ్ రద్దైతే మాత్రం పాక్ ఇంటిదారి పట్టక తప్పదు. -
విండీస్ వచ్చేసింది
112/9.. 18 ఓవర్లకు విండీస్ స్కోరు ఇది. కానీ ఇన్నింగ్స్ ముగిసేసరికి 149. చివరి రెండు ఓవర్లలో రూథర్ఫర్డ్ విధ్వంసంతో 37 పరుగులు వచ్చాయి. ఆ ఆఖరి ఓవర్లలో రూథర్ఫర్డ్ చేసిన పరుగులే న్యూజిలాండ్ కొంపముంచాయి. -
షకిబ్ ధనాధన్
టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్కు కీలక విజయం. గురువారం గ్రూప్-డి మ్యాచ్లో ఆ జట్టు 25 పరుగుల తేడాతో నెదర్లాండ్స్పై గెలిచింది. షకిబ్ అల్ హసన్ (64 నాటౌట్; 46 బంతుల్లో 9×4) మెరవడంతో మొదట బంగ్లాదేశ్ 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. -
సూపర్-8పై కన్నేసిన అఫ్గాన్, అమెరికా
సూపర్-8పై కన్నేసిన అఫ్గానిస్థాన్, అమెరికా జట్లు ముఖ్యమైన మ్యాచ్లకు సిద్ధమయ్యాయి. శుక్రవారం గ్రూప్-సిలో పాపువా న్యూగినీతో అఫ్గానిస్థాన్ తలపడుతుంది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచిన అఫ్గాన్కు పాపువా నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవచ్చు. -
కిక్కిచ్చే కిక్
ఫుట్బాల్ ప్రపంచాన్ని ఊపేసే మహా పోరుకు వేళైంది. ఫిఫా ప్రపంచకప్ తర్వాత అత్యధిక మంది వీక్షించే ప్రతిష్ఠాత్మక ఫుట్బాల్ టోర్నీకి సమయం ఆసన్నమైంది. నాలుగేళ్లకోసారి జరిగే యూరో కప్ భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి (శనివారం) 12.30 గంటలకు ఆరంభమవనుంది. -
ఆ స్టేడియం ఇక కనిపించదు
నాసా కౌంటీ అంతర్జాతీయ స్టేడియం.. గత కొన్ని నెలలుగా చర్చంతా దీని గురించే. టీ20 ప్రపంచకప్ కోసం దాదాపు 100 రోజుల్లో ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ఇక్కడి ప్రమాదకర పిచ్లపై విమర్శల వరకూ దీని గురించే మాట్లాడుకున్నారు. -
గుర్తుకొస్తున్నాయి..
ముంబయి ఆటగాళ్లు రోహిత్శర్మ, సూర్యకుమార్ యాదవ్లను చాన్నాళ్ల తర్వాత కలవడం సంతోషంగా ఉందని అమెరికా మీడియం పేసర్ సౌరభ్ నేత్రావల్కర్ అన్నాడు. ముఖ్యంగా సూర్యతో కలిసి నేత్రావల్కర్ ముంబయికి ఎక్కువ మ్యాచ్ల్లో ప్రాతినిథ్యం వహించాడు. -
ప్రపంచ జూనియర్ చెస్ విజేత దివ్య
భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్ సత్తా చాటింది. ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్లో మహిళల విభాగంలో ఆమె విజేతగా నిలిచింది. మొత్తం 11 రౌండ్లలో 10 పాయింట్లు సాధించిన దివ్య.. అగ్రస్థానంలో నిలిచింది. -
క్వార్టర్స్లో ప్రణయ్, సమీర్
ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత ఆటగాళ్లు హెచ్.ఎస్.ప్రణయ్, సమీర్వర్మ క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టారు. గురువారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ప్రణయ్ 21-17, 21-15తో మిషా జిల్బర్మన్ (ఇజ్రాయెల్)పై, సమీర్ 21-14, 14-21, 21-19తో ఎనిమిదో సీడ్ లో కీన్ యూ (సింగపూర్)పై గెలిచారు. -
వింబుల్డన్కు నాదల్ దూరం
ఫిట్నెస్ లేకుండానే ఫ్రెంచ్ ఓపెన్లో దిగి తొలి రౌండ్లోనే వెనుదిరిగిన స్పెయిన్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్.. వింబుల్డన్ నుంచి తప్పుకున్నాడు. జులై 1న ఆరంభమయ్యే ఈ టోర్నీలో ఆడట్లేదని.. ఒలింపిక్స్ కోసం సిద్ధం అవుతున్నట్లు రఫా వెల్లడించాడు. -
ఒలింపిక్ కోటా బెర్తు దేశానిది: బింద్రా
ఒలింపిక్స్ కోటా బెర్తు దేశానికి చెందినదని.. క్రీడాకారులది కాదని భారత దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రా అన్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రుద్రాంక్ష్ పాటిల్కు పారిస్ ఒలింపిక్స్ కోటా బెర్తు లభించింది. -
రోహిత్ శర్మది, నాది ఒకే స్కూల్: అమెరికా క్రికెటర్
అమెరికా జట్టులోని కొంతమంది భారత సంతతి ఆటగాళ్లు జూనియర్ లెవల్లో ఇండియా తరఫున బరిలోకి దిగారు. ప్రస్తుతం టీమ్ఇండియాలో కీలకంగా ఉన్న కొంతమంది ఆటగాళ్లతోనూ కలిసి ఆడారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కోటా ఆత్మహత్యలను ప్రస్తావించొద్దు’.. నీట్ పిటిషన్లపై సుప్రీం
-
‘ఆర్ఆర్ఆర్’ రికార్డును బ్రేక్ చేసిన ‘కల్కి’.. సోషల్ మీడియాలో వైరలవుతోన్న విశేషాలివే
-
‘నేను సమస్యల్లో పడతానేమో’: టీ20ల్లో అమెరికా చేతిలో పాక్ ఓటమిపై మిల్లర్ వ్యాఖ్య
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం.. ఎస్వీ యూనివర్సిటీలో సంబరాలు
-
సూపర్-8 పోరుకు ముందే.. ఆ ఇద్దరు స్వదేశానికి!