Team India: టీమ్ఇండియా టీ20 ‘100’ మార్క్ వీరులు
వన్డేలు, టెస్టుల్లో సెంచరీలు కొట్టడం బ్యాట్స్మెన్కు సాధారణ విషయమే. అదే టీ20ల్లో కొట్టాలంటే అంత తేలికకాదు. ఇన్నింగ్స్ మొత్తంలోనే 120 బంతులు వేస్తే...
వన్డేలు, టెస్టుల్లో సెంచరీలు కొట్టడం బ్యాట్స్మెన్కు సాధారణ విషయమే. అదే టీ20ల్లో కొట్టాలంటే అంత తేలికకాదు. ఇన్నింగ్స్ మొత్తంలోనే 120 బంతులు వేస్తే.. ఒక ఆటగాడు సెంచరీ చేయాలంటే ఎలా ఆడాలి? బౌలర్ ఎవరని చూడకుండా దొరికిన బంతిని దొరికినట్లు ఉతికారేయాలి. అలా ఆడితేనే టీ20ల్లో ‘100’ మార్క్ సాధ్యమవుతుంది. తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ20లో యువ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీ చేశాడు. దీంతో ఈ ఘనత సాధించిన ఐదో భారత బ్యాట్స్మన్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో టీమ్ఇండియా తరఫున ఇంతకుముందు ఎవరెన్ని శతకాలు బాదారో తెలుసుకుందాం..
సురేశ్ రైనా ది ఫస్ట్..
టీమ్ఇండియా తరఫున టీ20ల్లో తొలి శతకం బాదింది మాజీ బ్యాట్స్మన్ సురేశ్ రైనా. 2010 టీ20 ప్రపంచకప్లో గ్రూప్-సీ విభాగంలో సెంట్ లూసియా వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్లో రైనా (101; 60 బంతుల్లో 9x4, 5x6) శతకం బాది విరోచిత బ్యాటింగ్ చేశాడు. 168.33 స్ట్రైక్రేట్తో దక్షిణాఫ్రికా బౌలర్లు రోరీ క్లీన్వెల్ట్, ఆల్బీ మోర్కెల్, రోలోఫ్ వాండర్ మెర్వ్ బౌలింగ్ను తుత్తునియలు చేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా దక్షిణాఫ్రికా బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. 31 పరుగులకే మురళీ విజయ్(0), దినేశ్ కార్తీక్ (16)లను ఔట్ చేసి గట్టి దెబ్బ తీశారు. ఈక్రమంలోనే యువరాజ్(37; 30 బంతుల్లో 3x4, 2x6)తో కలిసి రైనా దుమ్మురేపాడు. వీరిద్దరూ మూడో వికెట్కు 88 పరుగులు జోడించారు. అయితే, కీలక సమయంలో యువీ ఔటవ్వగా యూసుఫ్ పఠాన్ (11), ధోనీ (16)తో కలిసి రైనా మరింత ధాటిగా ఆడాడు. 19 ఓవర్లు పూర్తయ్యేసరికి 95 పరుగులతో ఉన్న అతడు మూడో బంతిని సిక్సర్గా కొట్టి టీ20ల్లో మూడో బ్యాట్స్మన్గా, టీమ్ఇండియా తరఫున తొలి ఆటగాడిగా సెంచరీ కొట్టాడు. కానీ, మరుసటి బంతికే ఇంకో షాట్ ఆడబోయి ఔటయ్యాడు. చివరికి టీమ్ఇండియా 186/5 స్కోర్ చేయగా దక్షిణాఫ్రికా ఛేదనలో 172/5 స్కోర్కు పరిమితమైంది.
రోహిత్ ది సెకండ్..
రైనా తర్వాత టీమ్ఇండియా తరఫున పొట్టి ఫార్మాట్లో సెంచరీ కొట్టిన హీరో రోహిత్ శర్మ. 2015లో దక్షిణాఫ్రికాతో ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన తొలి టీ20లో ఈ ఘనత సాధించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (3) ఆదిలోనే ఔటైనా.. హిట్మ్యాన్ (106; 66 బంతుల్లో 12x4, 5x6) శతకంతో చెలరేగాడు. అతడి స్ట్రైక్రేట్ 160.60గా నమోదైంది. విరాట్ కోహ్లీ (43; 27 బంతుల్లో 1x4, 3x6)తో కలిసి రెండో వికెట్కు 138 పరుగులు జోడించాడు. అయితే, రోహిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాక ఇద్దరూ అబాట్ బౌలింగ్లో ఒకే ఓవర్లో ఔటయ్యారు. తర్వాత భారత్ 200 లక్ష్యం నిర్దేశించినా దక్షిణాఫ్రికా ఛేదించింది. ఇక 2017లో ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లోనూ రోహిత్ (118; 43 బంతుల్లో 12x4, 10x6) మరో సెంచరీ కొట్టాడు. ఈ మ్యాచ్లో అతడి స్ట్రైక్రేట్ 274.41గా నమోదైంది. దీన్ని బట్టి లంక బౌలర్లను ఎలా ఆడుకున్నాడో ఊహించుకోవచ్చు. ఆపై 2018లో బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో హిట్మ్యాన్ (100 నాటౌట్; 56 బంతుల్లో 11x4, 5x6) మూడో శతకం బాదాడు. ఇందులో అతడి స్ట్రైక్రేట్ 175.57గా నమోదైంది. అదే ఏడాది లఖ్నవూ వేదికగా వెస్టిండీస్తో ఆడిన మ్యాచ్లో (111 నాటౌట్; 61 బంతుల్లో 8x4, 7x6) నాలుగో శతకం బాదాడు. ఇందులో అతడి స్ట్రైక్రేట్ (181.96)గా నమోదైంది. కాగా, ఈ మూడు మ్యాచ్ల్లో టీమ్ఇండియా గెలవడం విశేషం.
కేఎల్ రాహుల్ ది థర్డ్..
టీమ్ఇండియా తరఫున పొట్టి క్రికెట్లో శతకం బాదిన మూడో బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్. 2016లో అమెరికాలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో రాహుల్ (110 నాటౌట్; 51 బంతుల్లో 12x4, 5x6) తొలిసారి టీ20ల్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో అతడి స్ట్రైక్రేట్ 215.68గా నమోదైంది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు 245/6 పరుగుల భారీ స్కోర్ చేయగా ఛేదనలో భారత్ అంతే దీటుగా బదులిచ్చింది. అజింక్య రహానె (7), విరాట్ కోహ్లీ (16) విఫలమైనా రోహిత్ (62; 28 బంతుల్లో 4x4, 4x6), రాహుల్ ధాటిగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్కు 89 పరుగులు జోడించారు. అయితే, రోహిత్ కీలక సమయంలో ఔటయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన ధోనీ (43; 25 బంతుల్లో 2x4, 2x6) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్తో కలిసి మ్యాచ్ను గెలిపించినంత పనిచేశాడు. కానీ చివరి బంతికి అతడు ఔటవ్వడంతో టీమ్ఇండియా 244/4తో నిలిచింది. అలా ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఇక 2018లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో ఆడిన మ్యాచ్లో రాహుల్ (101 నాటౌట్; 54 బంతుల్లో 10x4, 5x6) రెండోసారి పొట్టి క్రికెట్లో శతకం బాదాడు. ఇందులో అతడి స్ట్రైక్రేట్ 187.03గా నమోదైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 159/8 స్కోర్ చేయగా ఛేదనలో టీమ్ఇండియా 2 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
దీపక్ హుడా ది ఫోర్త్..
యువ బ్యాట్స్మన్ దీపక్ హుడా (104; 57 బంతుల్లో 9x4, 6x6) ఇటీవల ఐర్లాండ్తో ఆడిన రెండో టీ20లో శతకం బాదాడు. డబ్లిన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో అతడు 182.46 స్ట్రైక్రేట్తో చెలరేగాడు. దీన్నిబట్టి ఐర్లాండ్ బౌలర్లను ఏ విధంగా చితక్కొట్టాడో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన నాలుగో బ్యాట్స్మన్గా నిలిచాడు. అతడికి సంజూ శాంసన్ (77; 42 బంతుల్లో 9x4, 4x6)కూడా తోడవ్వడంతో భారత్ 225/7 భారీ స్కోర్ సాధించింది. తర్వాత ఐర్లాండ్ కూడా గొప్పగా పోరాడింది. ఆ జట్టులోని ప్రతి ఒక్కరూ రాణించడంతో చివరికి 221/5తో నిలిచింది. ఆఖరి ఓవర్లో భారత్ గొప్పగా పుంజుకోవడంతో త్రుటిలో ఓటమి నుంచి తప్పించుకుంది.
సూర్యకుమార్ ది నంబర్ 5..
ఆదివారం ఇంగ్లాండ్తో ఆడిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ (117; 55 బంతుల్లో 14x4, 6x6) అతి గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. 212.73 స్ట్రైక్రేట్తో ఎవరూ ఊహించని బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా తరఫున టీ20ల్లో శతకం బాదిన ఐదో బ్యాట్స్మన్గా నిలిచాడు. తొలుత ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 215/7 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం టీమ్ఇండియా ఛేదనలో తడబడింది. ఆదిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే.. సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్ (28; 23 బంతుల్లో 2x6) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. శ్రేయస్ స్ట్రైక్రొటేట్ చేస్తూ సహకరించగా సూర్య ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కానీ, శ్రేయస్ ఔటయ్యాక టీమ్ఇండియా టపాటపా వికెట్లు కోల్పోయింది. చివరికి సూర్య కూడా ఔటవ్వడంతో భారత్ ఓటమిపాలైంది.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
ఐపీఎల్ ముగిసిన వారం తర్వాత టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మాత్రం ఆడే అవకాశాలు తక్కువే. -
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
ముల్లాన్పుర్ వేదికగా పంజాబ్తో తలపడేందుకు ముంబయి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ రాణించాలని మాజీ క్రికెటర్ ఫించ్ వ్యాఖ్యానించాడు. -
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది. -
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ