T20 League: వీళ్లంతా సింగిల్ మ్యాచ్ హీరోలు : క్లిక్కయ్యారు.. గెలిపించారు
భారత టీ20 లీగ్.. అటు క్రికెటర్లకు, ఇటు ప్రేక్షకులకు కనులపండుగ. వేసవి మొత్తం వినోదాన్ని పంచుతూ అసలుసిసలైన క్రికెట్ మజాను అందిస్తుంది...
భారత టీ20 లీగ్.. అటు క్రికెటర్లకు, ఇటు ప్రేక్షకులకు వేసవి వినోదాన్ని పంచుతూ అసలు సిసలైన క్రికెట్ మజాను అందిస్తోంది. ఈ సీజన్లో కొందరు ఆటగాళ్లు ఒకే ఒక్క ఇన్నింగ్స్తో తళుక్కున మెరిశారు. సంచలన బ్యాటింగ్తో తమ జట్లను విజయతీరాలకు చేర్చారు. అలా ఈ సీజన్లో సింగిల్ మ్యాచ్ హీరోలుగా నిలిచిన ఆటగాళ్లెవరంటే..
రజత్ పటీదార్: బెంగళూరు యువ సంచలనం రజత్ పటీదార్ తాజాగా లఖ్నవూతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రెచ్చిపోయాడు. అతడు ఒక్క ఇన్నింగ్స్తోనే హీరో అయ్యాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 207/4 పరుగుల భారీ స్కోర్ చేసింది. వన్డౌన్ బ్యాట్స్మన్గా వచ్చిన రజత్ (112; 54 బంతుల్లో 12x4, 7x6) దంచికొట్టాడు. ముఖ్యంగా చివరి ఐదు ఓవర్లలో దినేశ్ కార్తీక్ (37; 23 బంతుల్లో 5x4, 1x6)తో కలిసి 84 పరుగులు జోడించాడు. దీంతో ఆ ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అనంతరం లఖ్నవూ ఛేదనలో 193/6 పరుగులకు పరిమితమై 14 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ప్యాట్ కమిన్స్: ఈ సీజన్లో మొదటి సంచలన బ్యాటింగ్ చేసింది కోల్కతా ఆటగాడు ప్యాట్ కమిన్స్. ముంబయితో జరిగిన 14వ మ్యాచ్లో కమిన్స్ 14 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. దీంతో ఈ టోర్నీ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధ శతకం సాధించిన కేఎల్ రాహుల్ సరసన నిలిచాడు. ఈ మ్యాచ్లో ముంబయి తొలుత బ్యాటింగ్ చేసి 161/4 పరుగులు చేయగా.. కోల్కతా 16 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. 15 ఓవర్లకు 127/5తో లక్ష్యం దిశగా సాగుతున్న ఆ జట్టు 16వ ఓవర్ పూర్తయ్యేసరికి మ్యాచ్ గెలిచింది. డానియల్ సామ్స్ వేసిన ఆ ఓవర్లో కమిన్స్ (56 నాటౌట్;15 బంతుల్లో 4X4, 6X6) వరుసగా 6, 4, 6, 6, నోబాల్ 2, 4, 6 రెచ్చిపోవడంతో కోల్కతా తేలిగ్గా మ్యాచ్ను సొంతం చేసుకుంది.
ఉతప్ప, దూబే: చెన్నై ఆటగాళ్లు రాబిన్ ఉతప్ప, శివమ్ దూబే కూడా ఓకే ఒక్క ఇన్నింగ్స్లో దంచికొట్టి అభిమానులను అలరించారు. బెంగళూరుతో జరిగిన 22వ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 216/4 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఉతప్ప (88; 50 బంతుల్లో 4x4, 9x6), దూబే (95 నాటౌట్; 46 బంతుల్లో 5x4, 8x6) మూడో వికెట్కు 165 పరుగులు జోడించారు. ఇక ఛేదనకు దిగిన బెంగళూరు మ్యాచ్ గెలిచేందుకు విశ్వ ప్రయత్నం చేసినా చివరికి 193/9 స్కోర్తో నిలిచింది. దీంతో 23 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ గేమ్ తర్వాత ఉతప్ప, దూబే మరో మ్యాచ్లో ఈ స్థాయిలో చెలరేగలేదు.
ధోనీ: ధోనీ ఈ సీజన్లో కోల్తాతో ఆడిన తొలి మ్యాచ్లోనే అర్ధశతకంతో మెరిసి అభిమానులను మెప్పించాడు. అయితే, ముంబయితో తలపడిన 33వ మ్యాచ్లో ధోనీ (28 నాటౌట్; 13 బంతుల్లో 3x4, 1x6) రెచ్చిపోయాడు. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 155/7 పరుగుల స్కోర్ చేయగా.. ఛేదనలో చెన్నై 19 ఓవర్లకు 139/6తో నిలిచింది. చివరి ఓవర్లో ఆ జట్టు విజయానికి 17 పరుగులు అవసరం కాగా పరిస్థితులు కష్టంగా మారాయి. జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్లో మొదటి బంతికే ప్రిటోరియస్ (22; 14 బంతుల్లో 2x4, 1x6) ఔటవ్వడంతో సమీకరణం 5 బంతుల్లో 17 పరుగులుగా మారింది. బ్రావో రెండో బంతికి సింగిల్ తీసివ్వగా.. తర్వాత ధోనీ వరుసగా 6, 4, 2, 4 దంచికొట్టి చెన్నైకి అద్భుత విజయాన్ని అందించాడు. దీంతో 40 ఏళ్ల వయస్సులోనూ తాను మేటి ఫినిషర్నని నిరూపించుకున్నాడు.
రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్: గుజరాత్ ఈ సీజన్లో అద్భుతంగా ఆడిందంటే కారణం జట్టు సమష్టిగా రాణించడమే. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించారు. ముఖ్యంగా రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ పలు సందర్భాల్లో ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపించారు. ఇక హైదరాబాద్తో తలపడిన 40వ మ్యాచ్లో వీరిద్దరూ ఓడిపోతుందనుకున్న మ్యాచ్ను గెలిపించారు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేసి 195/6 పరుగుల భారీ స్కోర్ సాధించగా.. గుజరాత్ ఛేదనలో 17 ఓవర్లకు 149/5తో నిలిచి ఓటమిపాలయ్యేలా కనిపించింది. అయితే, రాహుల్ తెవాతియా (40 నాటౌట్; 21 బంతుల్లో 4x4, 2x6), రషీద్ ఖాన్ (31; 11 బంతుల్లో 4x6) సంచలన బ్యాటింగ్ చేశారు. చివరి ఓవర్లో 22 పరుగులు అవసరమైన వేళ తెవాతియా ఒక సిక్సర్, సింగిల్ తీసివ్వగా.. తర్వాత రషీద్ ఖాన్ 3 సిక్సర్లు బాది గుజరాత్ జట్టుతో పాటు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
రుతురాజ్: గతేడాది అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈసారి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాడు. అయితే, హైదరాబాద్తో తలపడిన 46వ మ్యాచ్లో విధ్వంసం సృష్టించాడు. ఆ మ్యాచ్లో చెన్నై తొలుత బ్యాటింగ్ చేసి 202/2 భారీ స్కోర్ చేసింది. రుతురాజ్ (99; 57 బంతుల్లో 6x4, 6x6), డెవాన్ కాన్వే (85; 55 బంతుల్లో 8x4, 4x6) తొలివికెట్కు 182 పరుగులు జోడించారు. కానీ, రుతురాజ్ శతకానికి ఒక్క పరుగు దూరంలో ఔటయ్యాడు. తర్వాత హైదరాబాద్ 189/6తో నిలిచి 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
రోమన్ పావెల్: దిల్లీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ రోమన్ పావెల్ కూడా ఈ సీజన్లో ఒక్క ఇన్నింగ్స్లో మెరిశాడు. హైదరాబాద్తో ఆడిన 50వ మ్యాచ్లో అతడు పెను విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో దిల్లీ తొలుత బ్యాటింగ్ చేసి 207/3 పరుగులు చేసింది. ఓపెనర్ వార్నర్ (92 నాటౌట్; 58 బంతుల్లో 12x4, 3x6)తో కలిసి పావెల్ (67; 35 బంతుల్లో 3x4, 6x6) మెరుపు బ్యాటింగ్ చేశాడు. దీంతో నాలుగో వికెట్కు వీరిద్దరూ 122 పరుగులు జోడించారు. చివరికి హైదరాబాద్ ఛేదనలో 186/8తో నిలిచి 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
విరాట్ కోహ్లీ: ఈ సీజన్లో బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ ఫామ్లో లేక తంటాలు పడుతున్నాడు. అయితే, లీగ్ స్టేజ్లో గుజరాత్తో తలపడిన 67వ మ్యాచ్లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ 168/5 స్కోర్ సాధించగా బెంగళూరు లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ విరాట్ (73; 54 బంతుల్లో 8x4, 2x6) తనలోని మునుపటి ఆటగాడిని గుర్తుచేస్తూ ఇన్నింగ్స్ నడిపించాడు. చూడచక్కని షాట్లతో అభిమానులను అలరించాడు. దీంతో కోహ్లీ ఈ సీజన్లో తొలిసారి తనలోని అసలైన ఆటగాడిని బయటకు తీశాడు.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం