T20 World Cup: కప్‌ వేటకు బయల్దేరారు

టీ20 ప్రపంచకప్‌ కోసం భారత తొలి బృందం అమెరికా బయల్దేరింది. 

Published : 26 May 2024 02:56 IST

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌ కోసం భారత తొలి బృందం అమెరికా బయల్దేరింది. కెప్టెన్‌ రోహిత్‌శర్మతో పాటు బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్, కుల్‌దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్‌ సిరాజ్, అర్ష్‌దీప్‌ సింగ్, ఖలీల్‌ అహ్మద్, అక్షర్‌ పటేల్, శివమ్‌ దూబెతో పాటు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ శనివారం విమానమెక్కారు. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లితో పాటు ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌కు చేరిన జట్లలో కొందరు ఆటగాళ్లు త్వరలో యుఎస్‌ వెళ్తారు. జూన్‌ 2న ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తన తొలి మ్యాచ్‌లో (జూన్‌ 5) ఐర్లాండ్‌తో తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని