IPL 2023: మళ్లీ టీమ్లకు గాయాల బెడద.. కీలక సమయంలో తప్పని కష్టాలు!
ఐపీఎల్ 2023వ సీజన్లో (IPL 2023) ప్లేఆఫ్స్ రేసు ఊపందుకుంటోంది. కానీ, కీలక ఆటగాళ్లు గాయపడటంతో కొన్ని మ్యాచ్లతోపాటు టోర్నీ మొత్తానికి దూరమైన పరిస్థితి నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సగం మ్యాచ్లు ముగిశాయి. ప్లేఆఫ్స్ కోసం ఇప్పుడే అసలైన సమరం మొదులకానుంది. ఈ క్రమంలో రూ.కోట్లను వెచ్చించి మరీ కొనుగోలు చేసిన ఆటగాళ్లు కీలక మ్యాచ్లకు దూరమైతే ఆయా ఫ్రాంచైజీలకు తీవ్ర నష్టం. లీగ్ ప్రారంభానికి ముందే వైదొలిగితే.. అతడి స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చి మ్యాచ్లకు సన్నద్ధం చేసేవారు. తీరా మెగా టోర్నీ ప్రారంభమైన తర్వాత గాయాల కారణంగా బయటకెళ్లిపోతే.. కొత్తగా చేరే ప్లేయర్తో మ్యాచ్లను ఆడించడం కత్తిమీద సవాలే. ఇలాంటి పరిస్థితి ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆయా ఫ్రాంచైజీలకు ఎదురైంది. ఇలా కొన్ని మ్యాచ్లకు, టోర్నీకి దూరమైన టాప్ ఆటగాళ్లు ఎవరో చూద్దాం..
సుందర్ ఔట్ (Sunder)
తాజాగా ఏడు మ్యాచ్లు ఆడిన తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా దూరమయ్యాడు. తొడకండరాల గాయం వల్ల మిగతా మ్యాచ్ల నుంచి వైదొలిగినట్లు ఇప్పటికే సన్రైజర్స్ ప్రకటించింది. దిల్లీ మీద మినహా.. మిగతా జట్లతో జరిగిన మ్యాచుల్లో గొప్పగా ఏమీ రాణించలేదు.
కేన్కు తీవ్ర గాయం
చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చే వన్డే ప్రపంచకప్లోనూ ఆడతాడో లేదోననేది కూడా అనుమానంగానే ఉంది. ఒక్క మ్యాచ్ కూడా పూర్తిగా ఆడకుండానే ఐపీఎల్ సీజన్ను మిస్ కావడం గమనార్హం.
ఆర్సీబీకి టోప్లే దూరం
ఇంగ్లాండ్ పేసర్ రీస్ టోప్లే కూడా ఈ సీజన్లో కేవలం ఒక్క మ్యాచ్లోనే ఆడాడు. ముంబయితో జరిగిన మ్యాచ్లో భుజానికి గాయం కావడంతో టోర్నీ మొత్తానికి దూరమైపోయాడు. ఇప్పటికే ఆ జట్టుకు రజత్ పటీదార్, విల్ జాక్స్ ఐపీఎల్ ప్రారంభానికి ముందే గాయాల కారణంగా వైదొలిగారు. రెగ్యులర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ నడుముకు గాయం కావడంతో కేవలం బ్యాటింగ్కు మాత్రమే వస్తున్నాడు. అతడి స్థానంలో జట్టును విరాట్ కోహ్లీ నడిపిస్తున్నాడు.
వారిద్దరు కొన్ని మ్యాచ్లకు..
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్లు బెన్ స్టోక్స్, దీపక్ చాహర్ గాయాల కారణంగా కొన్ని మ్యాచ్ల్లో ఆడలేకపోయారు. గొప్పగా ప్రదర్శన కూడా లేకపోవడంతో జట్టు మేనేజ్మెంట్ వారిపై ఒత్తిడి తీసుకురావడం లేదు. అయినా సీఎస్కే ప్లేఆఫ్స్ రేసులోనే ఉంది. కెప్టెన్ ధోనీ కూడా మోకాలి గాయంతో బాధపడుతున్నా సరే ఇప్పటి వరకు అన్ని మ్యాచుల్లోనూ ఆడాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా మూడు మ్యాచుల్లో గాయం కారణంగా దూరమయ్యాడు. అయినా సరే రెండింట్లో విజయం సాధించడం విశేషం.
వ్యక్తిగత కారణాలతో లిటన్.. గాయంతోనే అయ్యర్
కోల్కతా ఆటగాడు లిటన్ దాస్ వ్యక్తిగత కారణాలతో టోర్నీలోని కొన్ని మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. కోల్కతా ఆడిన 8 మ్యాచుల్లో లిటన్ ఒక్కసారి మాత్రమే ఆడాడు. దిల్లీతో మ్యాచ్లో అరంగేట్రం చేసిన లిటన్ కేవలం నాలుగు పరుగులే చేశాడు. అయితే, కుటుంబ సభ్యులకు మెడికల్ ఎమర్జెన్సీ ఉండటంతో బంగ్లాదేశ్కు వెళ్లిపోయాడు. ఇప్పటికే షకిబ్ దూరం కావడంతో అతడి స్థానంలో జేసన్ రాయ్తో కేకేఆర్ ఒప్పందం చేసుకుంది. కేకేఆర్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ కూడా గాయంతోనే మ్యాచ్లు ఆడుతూ వస్తున్నాడు.
ట్రెంట్ బౌల్ట్ కూడా..
జయపుర వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో ట్రెంట్ బౌల్ట్ ఆడలేదు. గాయం కారణంగానే మ్యాచ్కు దూరమైనట్లు రాజస్థాన్ ఫ్రాంచైజీ పేర్కొంది. సీఎస్కేపై ఆర్ఆర్ విజయం సాధించింది. అయితే, తదుపరి మ్యాచుల్లోనూ బౌల్ట్ ఆడతాడా..? లేడా..? అనేది తెలియాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నేనుండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు..?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్