Rohit Sharma: చికిత్స కోసం ముంబయికి రోహిత్.. చాహర్, కుల్దీప్లకు గాయాలు
బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చికిత్స కోసం తిరిగి భారత్కు రానున్నాడు. బొటన వేలు చికిత్సకు సంబంధించి ముంబయిలోని స్పెషలిస్టు డాక్టర్ను కలవనున్నట్లు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటికే పసికూన బంగ్లాతో వన్డే సిరీస్ను చేజార్చుకున్న భారత్కు మరో కష్టం వచ్చింది. బొటన వేలి గాయంతో రోహిత్ శర్మ భారత్కు వస్తుండడంతో మూడో వన్డేకు దూరం కానున్నాడు. మరోవైపు పేసర్ దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ సైతం గాయాలతో మూడో వన్డే నుంచి తప్పుకోనున్నారు. బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చికిత్స కోసం తిరిగి భారత్కు రానున్నాడు. బొటన వేలు చికిత్సకు సంబంధించి ముంబయిలోని స్పెషలిస్టు డాక్టర్ను కలవనున్నట్లు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పారు. దీంతో మూడో వన్డేకు రోహిత్ దూరం కానున్నాడు. అయితే గాయం తీవ్ర కారణంగా ముంబయికి వెళుతుండడంతో తదుపరి బంగ్లాతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సైతం అందుబాటులో ఉంటాడో లేదో అనుమానంగా ఉంది.
‘‘రోహిత్ తన గాయానికి సంబంధించి చికిత్స కోసం ప్రత్యేక నిపుణుడిని కలిసేందుకు ముంబయికి వెళుతుండడంతో తన తదుపరి మ్యాచ్లో పాల్గొనడు. అయితే గాయం తీవ్రత దృష్ట్యా తర్వాత జరిగే టెస్టు మ్యాచ్లకు అందుబాటులో ఉండే అవకాశాల గురించి కచ్చితంగా చెప్పలేను’’ అని జట్టు హెడ్ కోచ్ ద్రవిడ్ చెప్పారు. దీంతో రోహిత్ టెస్టు సిరీస్లో ఆడే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. అయితే గాయం తీవ్రత అంతగా లేకుండా ఉండి ఫిట్నెస్గా ఉంటే రోహిత్ బంగ్లాకు వెళ్లే అవకాశం ఉంది.
ఇక బంగ్లాతో రెండో వన్డేలో సైతం భారత్ ఓడిపోయింది. దీంతో మరో మ్యాచ్ ఉండగానే బంగ్లా జట్టు 2-0 తేడాతో వన్డే సిరీస్ను గెలుచుకుంది. జట్టు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో తొమ్మిదో నంబర్ బ్యాటర్గా క్రీజులోకి వచ్చిన రోహిత్ అజేయంగా 28 బంతుల్లో 51 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తన వీర విహారంతో గెలిపించినంత పనిచేసినప్పటికీ చివరి మెట్టుపై భారత జట్టు బోల్తా పడింది. చివరి బంతికి ఆరు పరుగులు అవసరమైన సమయంలో రోహిత్ షాట్ విఫలం కావడంతో భారత్ 5 పరుగుల తేడాతో ఓటమి చవి చూడాల్సి వచ్చింది.
రోహిత్ ఇన్నింగ్స్పై ద్రవిడ్ ప్రశంసల జల్లు..
రోహిత్ శర్మ ఆటపై హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో ద్రవిడ్ మాట్లాడారు. ‘‘రోహిత్ బొటన వేలికి తీవ్ర గాయం అయింది. గాయం బాధతో అతడు ఆసుపత్రికి వెళ్లాడు. చేతికి కుట్లు వేశారు. బ్యాటింగ్ చేయడానికి ముందు వైద్యులు అతడికి ఇంజెక్షన్లు ఇచ్చారు. అంత బాధ ఉన్నప్పటికీ ఈ రోజు రోహిత్ శర్మ అసాధారణ స్థాయి ధైర్యసాహసాలు చూపాడు. తన గాయం ఎంత తీవ్రమైనప్పటికీ రోహిత్ బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకున్నాడు. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్తో రోహిత్ మాకు ఎంతో దగ్గరయ్యాడు. భారత్ను గెలిపించడానికి ఎంతో ధైర్యసాహసాలు చేశాడు. ఇది భారత సారథి ఆడిన గొప్ప ఇన్నింగ్స్. దురదృష్టవశాత్తు మేము చివరలో గెలుపు రేఖను దాటలేకపోయం’’ అని కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత