Harsha Bhogle: 40 ఏళ్ల క్రికెట్ మాటల ప్రవాహం... హర్ష భోగ్లే గురించి ఈ విషయాలు తెలుసా?
హర్ష భోగ్లే.. ఒక స్టార్ కామెంటేటర్గా మనకు తెలుసు. ఇటీవల 40 ఏళ్ల కామెంటరీ ప్రయాణం పూర్తి చేసుకున్న హర్ష (Harsha Bhogle) గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం..
అంతర్జాతీయ స్థాయిలో లేదా దేశవాళీ క్రికెట్ ఆడిన క్రికెటర్లలో చాలా మంది.. ఆటకు వీడ్కోలు పలికాక వ్యాఖ్యాతలుగా మారడం సహజమే. కానీ కేవలం విశ్వవిద్యాలయ స్థాయి వరకే క్రికెట్ ఆడిన ఓ వ్యక్తి.. ప్రపంచం మెచ్చే వ్యాఖ్యాతగా ఎదగడం అరుదు. కానీ క్రికెట్పై ప్రేమతో.. అద్భుతమైన వాక్చాతుర్యంతో క్రికెట్ వ్యాఖ్యానంపై అతను తనదైన ముద్ర వేశాడు. మైదానంలో స్వయంగా క్రికెట్ ఆడి, ఆటపై పరిజ్ఞానం ఉన్న మాజీ క్రికెటర్లతో వ్యాఖ్యానంలో పోటీ పడటమే కాదు.. వాళ్ల కంటే మెరుగ్గా కూడా మాట్లాడగలడనే పేరు తెచ్చుకున్నాడు. 19 ఏళ్ల వయసులో మొదలైన అతని మాటల ప్రవాహం.. 40 ఏళ్లుగా నిరాటంకంగా.. నిరంతరాయంగా.. మనోరంజకంగా సాగుతోంది. అతనే.. హర్ష భోగ్లే (Harsha Bhogle). ఈ పేరు వినని క్రికెట్ అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. తరాలు మారినా.. ఆటగాళ్లు మారినా.. 62 ఏళ్ల వయసులోనూ తన వ్యాఖ్యానంతో ఉర్రూతలూగిస్తున్నాడీ దిగ్గజ కామెంటేటర్.
మన హైదరాబాదే..
హర్ష భోగ్లే పేరు చూసి.. ప్రస్తుతం అతను ఉంటున్న ఊరు చూసి మనవాడు కాదనుకుంటే పొరపడ్డట్టే! హర్ష హైదరాబాద్లోనే పుట్టాడు. ఇక్కడ ఇంజినీరింగ్ వరకూ చదివాడు. భాగ్యనగరంలో ఉండే మరాఠి కుటుంబంలో 1961లో హర్ష జన్మించాడు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ ప్రొఫెసర్లే. తండ్రి ఏడీ భోగ్లే.. ఫ్రెంచ్ భాష ఆచార్యుడు. తల్లి శాలిని భోగ్లే.. సైకాలజీ బోధించేది. 1947లో దేశ విభజన సమయంలో తన తల్లి కుటుంబం పాకిస్థాన్లోని లాహోర్ నుంచి వచ్చిందని ఓ సందర్భంలో హర్ష వెల్లడించాడు. హైదరాబాద్ పబ్లిక్ పాఠశాలలో చదువుకున్న అతను.. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం అహ్మదాబాద్ ఐఐఎంలో పీజీడీఎం పూర్తి చేశాడు. హైదరాబాద్లో ఏపీసీఏ తరపున ఎ- డివిజన్ క్రికెట్ ఆడిన హర్ష.. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కూడా ప్రాతినిథ్యం వహించాడు. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్, మాజీ ఆఫ్స్పిన్నర్ అర్షద్ అయూబ్తో కలిపి ఆడాడు. కానీ అతని క్రికెట్ కెరీర్ ముందుకు సాగలేకపోయింది. కానీ ఆటపై ఇష్టంతో వ్యాఖ్యాతగా మారాడు. తనదైన శైలి వ్యాఖ్యానం, విశ్లేషణతో తక్కువ కాలంలోనే గొప్ప గుర్తింపు పొందాడు.
అలా మొదలై..
మొదట ఆల్ ఇండియా రేడియోతో హర్ష కామెంటేటర్ ప్రయాణం 19 ఏళ్ల వయసులోనే మొదలైంది. కానీ టీవీ కోసం అతని తొలి వన్డే మాత్రం చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య కావడం విశేషం. 1983 సెప్టెంబర్ 10, 1983లో హైదరాబాద్లో జరిగిన ఈ మ్యాచ్ కోసం దూరదర్శన్ తరపున వ్యాఖ్యానం చేసే అవకాశం హర్షకు దక్కింది. అందుకు అతను తీసుకున్న డబ్బు రూ.350. అవకాశం కోసం చూస్తున్న తనకు.. దూరదర్శన్ హైదరాబాద్ నిర్మాత ఛాన్స్ ఇచ్చాడని, ఆ తర్వాత 14 నెలల్లో మరో రెండు వన్డేలు, ఓ టెస్టుకు వ్యాఖ్యాతగా వ్యవహరించానని ఇటీవల ఇన్స్టాగ్రామ్లో హర్ష పోస్టు పెట్టాడు. 40 ఏళ్ల కిత్రం తొలి వన్డే అని పేర్కొన్నాడు. తన మాటకారితనం, ఆటపై అవగాహనతో వేగంగా ఎదిగాడు. 1992 ప్రపంచకప్ కంటే ముందు భారత్తో సిరీస్ కోసం హర్షను ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (ఏబీసీ) ఆహ్వానించింది. ఆ ఘనత సాధించిన భారత తొలి వ్యాఖ్యాత అతనే. అప్పటి నుంచి ఆస్ట్రేలియాలో భారత పర్యటనలకు ఏబీసీ కోసం హర్ష పనిచేశాడు. బీబీసీలో ఎనిమిదేళ్లు బాధ్యతలు నిర్వర్తించాడు. 1996, 1999 ప్రపంచకప్ల కోసం బీబీసీ వ్యాఖ్యాతల బృందంతో కలిసి పని చేశాడు. 1995 నుంచి ఈఎస్పీఎన్, స్టార్ స్పోర్ట్స్కు హర్ష మారాడు. ఐపీఎల్లోనూ తనదైన ముద్ర వేశాడు. క్రికెట్ గొంతుక (వాయిస్ ఆఫ్ క్రికెట్)గా పేరు పొందాడు.
రచయిత కూడా..
‘హర్ష ఆన్లైన్’, ‘హర్ష అన్ప్లగ్డ్’, ‘స్కూల్ క్విజ్ ఒలింపియాడ్’ లాంటి టీవీ కార్యక్రమాలకు కూడా హర్ష వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ‘హర్షా కి ఖోజ్’ అని అతని పేరుతో ఓ టీవీ కార్యక్రమం కూడా నిర్వహించారు. యూట్యూబ్లోనూ తన మాటల జోరు కొనసాగిస్తున్నాడు. బీబీసీ కోసం ‘ట్రావెల్ ఇండియా’ అనే కార్యక్రమంలోనూ హర్ష అలరించాడు. డిస్కవరీ ఛానెల్ ‘ట్రావెల్ విత్ హర్ష భోగ్లే’ కార్యక్రమంలోనూ ఆకట్టుకున్నాడు. 2008 ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ సలహాదారుగా పనిచేశాడు. ప్రపంచవ్యాప్తంగా క్రిక్ఇన్ఫో నిర్వహించిన ఓటింగ్లో ఇష్టమైన టీవీ క్రికెట్ వ్యాఖ్యాతగా హర్ష నిలిచాడు. అతను రచయిత కూడా. మహమ్మద్ అజహరుద్దీన్ జీవిత కథను హర్ష రాశాడు. తన వ్యాసాలను పుస్తకాల రూపంలో తెచ్చాడు. భార్య అనితతో కలిసి ‘ది విన్నింగ్ వే’, ‘ది విన్నింగ్ వే 2.0’ పుస్తకాలను రచించాడు.ఐఐఎం అహ్మదాబాద్లో కలిసి చదువుకున్న అనితనే అతను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. 17 ఏళ్ల నుంచి హర్ష పూర్తిగా శాకాహారి. ముంబయిలో కుటుంబంతో కలిసి ఉంటున్న హర్ష.. మరెన్నో ఏళ్లు తన గొంతుతో క్రికెట్ మజాను మరింత పెంచే దిశగా సాగుతూనే ఉంటాడు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి