Shubman Gill: కొడుకును క్రికెటర్గా చూడాలని ఊరొదిలి వచ్చేసి.. గిల్ జీవితం ఇదీ!
శుభ్మన్ గిల్.. డబుల్ సెంచరీ.. క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. పంజాబ్ నుంచి ఎన్నో అంచనాలతో జట్టులోకి వచ్చిన గిల్ (Shubman Gill) ఇప్పుడు అదరగొడుతున్నాడు. ఓసారి గిల్ లైఫ్ తరచి చూస్తే...
‘నా కొడుకు వికెట్ తీస్తే.. వంద రూపాయలు ఇస్తా!’..
ఓ తండ్రి ఇలా సవాలు విసిరాడు అంటే.. కొడుకు మీద, కొడుకు ఆట మీద ఎంత నమ్మకం ఉంటుందో చెప్పండి. ఈ సవాలు విసిరింది ఎవరో కాదు ఉప్పల్లో డబుల్ సెంచరీతో కదం తొక్కిన శుభ్మన్ గిల్ తండ్రి. అయితే ఇది ఇప్పటి మాట కాదు.. శుభ్మన్ ఇంకా ప్రొఫెషనల్ క్రికెట్ ప్రారంభించని తొలి రోజుల్లో జరిగింది. గిల్ డబుల్ సెంచరీతో ఇప్పుడు ఇవే మాటలు వైరల్ అవుతున్నాయి. గిల్ లైఫ్లోకి తొంగి చూస్తే.. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి.
‘మూడేళ్ల పిల్లాడికి బొమ్మలు ఇవ్వాలి కానీ.. ఈ బ్యాటు బాలేంటి?’ శుభ్మన్ ఇంట్లో 20 ఏళ్ల క్రితం ఈ మాట ఎక్కువగా వినిపించేదట. ఆ మాటలకు చిన్న నవ్వు నవ్వేవారు లఖ్విందర్. ఎందుకంటే శుభ్మన్ ఎప్పుడూ బొమ్మలు కావాలి అనలేదట. బ్యాటు, బాలుంటే చాలు.. వాటితోనే రోజంతా గడిచిపోయేదట. నిద్రపోతున్నప్పుడు కూడా పక్క మీద బ్యాటు, బాల్ ఉండాల్సిందే. అంతలా చిన్నతనం నుంచే శుభ్మన్ క్రికెట్ను ప్రేమించాడట. చిన్నతనంలో ఏదో సరదాకు అడుగుతున్నాడేమో అనుకున్న లఖ్విందర్.. ఆ తర్వాత క్రికెట్ మీద కొడుకుకు ఉన్న ఆసక్తి చూసి.. ఏకంగా తన పొలంలో గ్రౌండ్, పిచ్ తయారు చేశారు.
వికెట్కి ₹100
క్రికెట్ అంటే.. ఒకరిద్దరి ఆట కాదు కదా.. అందుకే తన కొడుక్కి బౌలింగ్ వేయడానికి డబ్బులతో పోటీ పెట్టేవారు లఖ్విందర్. అప్పుడు ఆయన అన్న మాటే.. ‘నా కొడుకు వికెట్ తీస్తే.. రూ. వంద ఇస్తా’. అప్పుడు ఎంతమంది వికెట్ పడగొట్టారో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం గిల్ వికెట్ కోసం అంతర్జాతీయ బౌలర్లు తెగ ప్రయత్నిస్తున్నారు. వాళ్లకు శుభ్మన్ వికెట్ దొరకడం అంత ఈజీగా కుదరడం లేదనే విషయం మీకూ తెలుసు. ఇది ప్రస్తుతం అనుకోండి.. మళ్లీ కాస్త వెనక్కి వెళ్తే.. శుభ్మన్ కోసం లఖ్విందర్ కుటుంబం చేసిన త్యాగాలు కనిపిస్తాయి.
కుటుంబమంతా ఊరొదిలి
శుభ్మన్కు క్రికెట్ మీద ఉన్న అభిమానం చూసి.. లఖ్విందర్ ఏకంగా ఊరే మారిపోయారు. తన కొడుకును ప్రొఫెషనల్ క్రికెటర్ను చేయాలనే తమ కల కోసం మొహాలీకి షిఫ్ట్ అయిపోయింది శుభ్మన్ కుటుంబం. అక్కడ ఓ స్కూల్లో కోచింగ్ తీసుకోవడం ప్రారంభించి.. ఆ తర్వాత పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అకాడెమీలో చేరాడు శుభ్మన్. కొడుకు క్రికెట్ అంటే లఖ్విందర్కు ఎంత ఇష్టమో.. తండ్రి వ్యవసాయం అంటే శుభ్మన్కూ అంతే ఇష్టం. అందుకే తన పల్లెటూరు (పంజాబ్లోని ఫజిల్కా గ్రామం) రోజుల్ని శుభ్మన్ ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటాడు. తండ్రిలా వ్యవసాయం చేయాలనేది గిల్ కల మరి.
తండ్రిని చూసే...
కొడుకును క్రికెటర్గా చూడాలని లఖ్విందర్ ఎంతగానో శ్రమించారు. పుట్టి, పెరిగిన ఊరును వదిలేసి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్కు దగ్గరలోనే ఇంటిలో అద్దెకు దిగారు. కొడుకు క్రికెట్ ఆడితే చాలు.. మిగిలినవన్నీ తర్వాతే అనుకునేవారు ఆయన. అనుకున్నట్లుగా శుభ్మన్ ప్రొఫెషనల్ క్రికెటర్ అయ్యాడు. ఒక్కో అడుగు వేస్తూ.. ఇప్పుడు టీమ్ ఇండియాలో చోటు సంపాదించుకున్నాడు. అంతేకాదు ఎంతోమందిని కాకుండా తనకు జట్టులో చోటు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్న వాళ్లకు డబుల్ సెంచరీ చేసి సమాధానం చెప్పాడు. అయితే ఇదంతా కూల్ అండ్ కామ్గా చేశాడు. తన తండ్రి కూడా ఇలానే కూల్ అండ్ కామ్గా పని చేసేవారని శుభ్మన్ అంటుంటాడు.
ఇది ట్రైలర్ మాత్రమే...
డిసెంబరు 2020లో ఆస్ట్రేలియా సిరీస్ కోసం శుభ్మన్ టెస్టుల్లోకి తొలిసారి వచ్చాడు. గబ్బాలో జరిగిన రెండో టెస్టులో 91 పరుగులు చేసి.. జట్టు విజయంలో పాలుపంచుకున్నాడు. అక్కడికి సుమారు రెండేళ్ల తర్వాత శుభ్మన్ వన్డే అరంగేట్రం జరిగింది. ఆగస్టు 2022లో జింబాబ్వే సిరీస్ కోసం జట్టులోకి తీసుకున్నారు. టీ20ల్లోకి ఎంట్రీ ఈ ఏడాదే జరిగింది. ఇటీవల శ్రీలంక సిరీసే గిల్కి తొలి టీ20 సిరీస్. గతేడాది బంగ్లాదేశ్ టెస్టులో సెంచరీతో అదరగొట్టిన శుభ్మన్.. ఈ ఏడాది వన్డేల్లో డబుల్ సెంచరీతో తన పేరును రికార్డుల్లోకి ఎక్కించాడు. శుభ్మన్ జోరు చూస్తుంటే.. భారత క్రికెట్ కొత్త ఆశాకిరణం అంటూ మాజీలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. స్థానిక మ్యాచుల్లో గిల్ ఆట చూసినవాళ్లు అయితే.. ఇది ట్రైలర్ మాత్రమే.. ‘పిక్చర్ అబీ బాకీ హై దోస్త్’ అంటున్నారు.
కొడుకు క్రికెట్ కోసం పొలాన్ని మైదానం చేసి, ఊరొదిలి పట్నం వచ్చేశారు అంటే.. ఆ తండ్రి కల వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంది అనే డౌట్ మీకూ వచ్చిందా.. మాకూ ఇదే డౌట్ వచ్చి చూస్తే.. క్రికెటర్ అవ్వాలనేది శుభ్మన్ తండ్రి లఖ్విందర్ కల అట. అయితే తన పరిస్థితుల కారణంగా అవ్వలేకపోయారు. కానీ తన బిడ్డను దేశం గర్వించే క్రికెటర్గా మలిచి అందించారు. ఉప్పల్లో డబుల్ సెంచరీ మనకు విజయం అందిస్తే.. తండ్రికి పుత్రోత్సాహం అందించి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా.
ఇదంతా గిల్ స్టార్ క్రికెటర్ అవ్వకముందు.. ఇప్పుడు గిల్ క్రికెటర్గానే కాదు.. సోషల్ మీడియాలోనూ స్టారే. ఐపీఎల్లో అదరగొట్టిన తర్వాత యాడ్స్, అండార్స్మెంట్లతో దూసుకుపోతున్నాడు. టీమ్ ఇండియాలోకి ఎంట్రీ తర్వాత అవి ఇంకా పెరిగాయి. బాలీవుడ్ హీరోలా ఉంటాడనే పోలిక కూడా మీరు వినే ఉంటారు. వాటి గురించి మరోసారి చదువుకుందాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు