Shubman Gill: కొడుకును క్రికెటర్గా చూడాలని ఊరొదిలి వచ్చేసి.. గిల్ జీవితం ఇదీ!
శుభ్మన్ గిల్.. డబుల్ సెంచరీ.. క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. పంజాబ్ నుంచి ఎన్నో అంచనాలతో జట్టులోకి వచ్చిన గిల్ (Shubman Gill) ఇప్పుడు అదరగొడుతున్నాడు. ఓసారి గిల్ లైఫ్ తరచి చూస్తే...
‘నా కొడుకు వికెట్ తీస్తే.. వంద రూపాయలు ఇస్తా!’..
ఓ తండ్రి ఇలా సవాలు విసిరాడు అంటే.. కొడుకు మీద, కొడుకు ఆట మీద ఎంత నమ్మకం ఉంటుందో చెప్పండి. ఈ సవాలు విసిరింది ఎవరో కాదు ఉప్పల్లో డబుల్ సెంచరీతో కదం తొక్కిన శుభ్మన్ గిల్ తండ్రి. అయితే ఇది ఇప్పటి మాట కాదు.. శుభ్మన్ ఇంకా ప్రొఫెషనల్ క్రికెట్ ప్రారంభించని తొలి రోజుల్లో జరిగింది. గిల్ డబుల్ సెంచరీతో ఇప్పుడు ఇవే మాటలు వైరల్ అవుతున్నాయి. గిల్ లైఫ్లోకి తొంగి చూస్తే.. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి.
‘మూడేళ్ల పిల్లాడికి బొమ్మలు ఇవ్వాలి కానీ.. ఈ బ్యాటు బాలేంటి?’ శుభ్మన్ ఇంట్లో 20 ఏళ్ల క్రితం ఈ మాట ఎక్కువగా వినిపించేదట. ఆ మాటలకు చిన్న నవ్వు నవ్వేవారు లఖ్విందర్. ఎందుకంటే శుభ్మన్ ఎప్పుడూ బొమ్మలు కావాలి అనలేదట. బ్యాటు, బాలుంటే చాలు.. వాటితోనే రోజంతా గడిచిపోయేదట. నిద్రపోతున్నప్పుడు కూడా పక్క మీద బ్యాటు, బాల్ ఉండాల్సిందే. అంతలా చిన్నతనం నుంచే శుభ్మన్ క్రికెట్ను ప్రేమించాడట. చిన్నతనంలో ఏదో సరదాకు అడుగుతున్నాడేమో అనుకున్న లఖ్విందర్.. ఆ తర్వాత క్రికెట్ మీద కొడుకుకు ఉన్న ఆసక్తి చూసి.. ఏకంగా తన పొలంలో గ్రౌండ్, పిచ్ తయారు చేశారు.
వికెట్కి ₹100
క్రికెట్ అంటే.. ఒకరిద్దరి ఆట కాదు కదా.. అందుకే తన కొడుక్కి బౌలింగ్ వేయడానికి డబ్బులతో పోటీ పెట్టేవారు లఖ్విందర్. అప్పుడు ఆయన అన్న మాటే.. ‘నా కొడుకు వికెట్ తీస్తే.. రూ. వంద ఇస్తా’. అప్పుడు ఎంతమంది వికెట్ పడగొట్టారో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం గిల్ వికెట్ కోసం అంతర్జాతీయ బౌలర్లు తెగ ప్రయత్నిస్తున్నారు. వాళ్లకు శుభ్మన్ వికెట్ దొరకడం అంత ఈజీగా కుదరడం లేదనే విషయం మీకూ తెలుసు. ఇది ప్రస్తుతం అనుకోండి.. మళ్లీ కాస్త వెనక్కి వెళ్తే.. శుభ్మన్ కోసం లఖ్విందర్ కుటుంబం చేసిన త్యాగాలు కనిపిస్తాయి.
కుటుంబమంతా ఊరొదిలి
శుభ్మన్కు క్రికెట్ మీద ఉన్న అభిమానం చూసి.. లఖ్విందర్ ఏకంగా ఊరే మారిపోయారు. తన కొడుకును ప్రొఫెషనల్ క్రికెటర్ను చేయాలనే తమ కల కోసం మొహాలీకి షిఫ్ట్ అయిపోయింది శుభ్మన్ కుటుంబం. అక్కడ ఓ స్కూల్లో కోచింగ్ తీసుకోవడం ప్రారంభించి.. ఆ తర్వాత పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అకాడెమీలో చేరాడు శుభ్మన్. కొడుకు క్రికెట్ అంటే లఖ్విందర్కు ఎంత ఇష్టమో.. తండ్రి వ్యవసాయం అంటే శుభ్మన్కూ అంతే ఇష్టం. అందుకే తన పల్లెటూరు (పంజాబ్లోని ఫజిల్కా గ్రామం) రోజుల్ని శుభ్మన్ ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటాడు. తండ్రిలా వ్యవసాయం చేయాలనేది గిల్ కల మరి.
తండ్రిని చూసే...
కొడుకును క్రికెటర్గా చూడాలని లఖ్విందర్ ఎంతగానో శ్రమించారు. పుట్టి, పెరిగిన ఊరును వదిలేసి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్కు దగ్గరలోనే ఇంటిలో అద్దెకు దిగారు. కొడుకు క్రికెట్ ఆడితే చాలు.. మిగిలినవన్నీ తర్వాతే అనుకునేవారు ఆయన. అనుకున్నట్లుగా శుభ్మన్ ప్రొఫెషనల్ క్రికెటర్ అయ్యాడు. ఒక్కో అడుగు వేస్తూ.. ఇప్పుడు టీమ్ ఇండియాలో చోటు సంపాదించుకున్నాడు. అంతేకాదు ఎంతోమందిని కాకుండా తనకు జట్టులో చోటు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్న వాళ్లకు డబుల్ సెంచరీ చేసి సమాధానం చెప్పాడు. అయితే ఇదంతా కూల్ అండ్ కామ్గా చేశాడు. తన తండ్రి కూడా ఇలానే కూల్ అండ్ కామ్గా పని చేసేవారని శుభ్మన్ అంటుంటాడు.
ఇది ట్రైలర్ మాత్రమే...
డిసెంబరు 2020లో ఆస్ట్రేలియా సిరీస్ కోసం శుభ్మన్ టెస్టుల్లోకి తొలిసారి వచ్చాడు. గబ్బాలో జరిగిన రెండో టెస్టులో 91 పరుగులు చేసి.. జట్టు విజయంలో పాలుపంచుకున్నాడు. అక్కడికి సుమారు రెండేళ్ల తర్వాత శుభ్మన్ వన్డే అరంగేట్రం జరిగింది. ఆగస్టు 2022లో జింబాబ్వే సిరీస్ కోసం జట్టులోకి తీసుకున్నారు. టీ20ల్లోకి ఎంట్రీ ఈ ఏడాదే జరిగింది. ఇటీవల శ్రీలంక సిరీసే గిల్కి తొలి టీ20 సిరీస్. గతేడాది బంగ్లాదేశ్ టెస్టులో సెంచరీతో అదరగొట్టిన శుభ్మన్.. ఈ ఏడాది వన్డేల్లో డబుల్ సెంచరీతో తన పేరును రికార్డుల్లోకి ఎక్కించాడు. శుభ్మన్ జోరు చూస్తుంటే.. భారత క్రికెట్ కొత్త ఆశాకిరణం అంటూ మాజీలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. స్థానిక మ్యాచుల్లో గిల్ ఆట చూసినవాళ్లు అయితే.. ఇది ట్రైలర్ మాత్రమే.. ‘పిక్చర్ అబీ బాకీ హై దోస్త్’ అంటున్నారు.
కొడుకు క్రికెట్ కోసం పొలాన్ని మైదానం చేసి, ఊరొదిలి పట్నం వచ్చేశారు అంటే.. ఆ తండ్రి కల వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంది అనే డౌట్ మీకూ వచ్చిందా.. మాకూ ఇదే డౌట్ వచ్చి చూస్తే.. క్రికెటర్ అవ్వాలనేది శుభ్మన్ తండ్రి లఖ్విందర్ కల అట. అయితే తన పరిస్థితుల కారణంగా అవ్వలేకపోయారు. కానీ తన బిడ్డను దేశం గర్వించే క్రికెటర్గా మలిచి అందించారు. ఉప్పల్లో డబుల్ సెంచరీ మనకు విజయం అందిస్తే.. తండ్రికి పుత్రోత్సాహం అందించి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా.
ఇదంతా గిల్ స్టార్ క్రికెటర్ అవ్వకముందు.. ఇప్పుడు గిల్ క్రికెటర్గానే కాదు.. సోషల్ మీడియాలోనూ స్టారే. ఐపీఎల్లో అదరగొట్టిన తర్వాత యాడ్స్, అండార్స్మెంట్లతో దూసుకుపోతున్నాడు. టీమ్ ఇండియాలోకి ఎంట్రీ తర్వాత అవి ఇంకా పెరిగాయి. బాలీవుడ్ హీరోలా ఉంటాడనే పోలిక కూడా మీరు వినే ఉంటారు. వాటి గురించి మరోసారి చదువుకుందాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు