Rajeshwari Kumari: అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయ... రజత పతకధారి రాజేశ్వరి కథ ఇదీ!
చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games 2022) రాజేశ్వరి కుమారి (Rajeshwari Kumari) రజత పతకంతో మెరిసింది. ఈ నేపథ్యంలో ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం.
రణ్ధీర్ సింగ్.. ఒకప్పుటి స్టార్ భారత షూటర్! ఏమాత్రం అంచనాలు లేని స్థితిలోనూ అంతర్జాతీయ పతకాలు గెలిచిన ఛాంపియన్! 1978, 1982 ఆసియా క్రీడల్లో కాంస్యాలు నెగ్గిన షూటర్. రాజేశ్వరి కుమారి.. ఆమె కూడా షూటరే.. ఆమెపై కూడా ఎలాంటి అంచనాలు లేవు. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో రజతంతో మెరిసింది! అప్పటి రణ్ధీర్కి ఇప్పుటి రాజేశ్వరికి సంబంధం ఉంది. రణధీర్ కుమార్తే రాజేశ్వరి (Rajeshwari Kumari). నాన్న బాటలో నడిచి.. ఆయన ఆశయాన్ని నిలబెట్టి ఆసియా క్రీడల్లో అదరగొట్టింది ఈ అమ్మాయి.
క్రీడల నేపథ్యం
దిల్లీకి చెందిన రాజేశ్వరి కుమారిది క్రీడల నేపథ్యం. తండ్రి రణ్ధీర్, తాత బాలీంద్ర సింగ్ క్రీడాకారులే. ఈ నేపథ్యం నుంచి వచ్చిన కుమారి 2014లో షూటింగ్ను కెరీర్గా ఎంచుకుంది. త్వరగా ఈ ఆటపై పట్టు సాధించి ఆ ఏడాదే జాతీయ ఛాంపియన్షిప్లో ట్రాప్లో కాంస్యం నెగ్గింది. 2019లో జాతీయ షాట్గన్ ఛాంపియన్షిప్లో జాతీయ రికార్డు నెలకొల్పింది. 2021 ఆసియా షూటింగ్లోనూ పసిడితో మెరిసింది. ఇలా టాప్ స్పోర్ట్స్ ఈవెంట్లలో తన ముద్ర వేస్తూ వచ్చిన రాజేశ్వరి.. ఈ ఏడాది జూన్లో జాతీయ సెలక్షన్ ట్రయల్స్లో ఫైనల్లో సత్తా చాటి ఆసియా క్రీడలకు ఎంపికైంది. ఆసియా క్రీడల్లో ఒత్తిడికి గురి కాకుండా రాణించి పతకాన్ని పట్టేసింది.
ఒలింపిక్ పతకమే లక్ష్యం
రాజేశ్వరీ లక్ష్యం ఒలింపిక్స్ పతకమే. ఇప్పటికే 2024 పారిస్ ఒలింపిక్స్ బెర్తు దక్కించుకున్న ఆమె.. తన లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. తన తండ్రి రణ్ధీర్ మాదిరే ఒలింపిక్స్లోనూ పోటీపడాలని రాజేశ్వరి తహతహలాడుతోంది.
ఆసియా క్రీడల్లో రాజేశ్వరీ పతకం గెలవడం గర్వంగా అనిపిస్తోంది. 1982 దిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్లో రజతం నెగ్గా. ఇప్పుడు రాజేశ్వరి ట్రాప్ ఈవెంట్లోనే రజతం గెలవడం చాలా సంతోషాన్నిస్తోంది. అప్పట్లో ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడు బాలీంద్ర సింగ్ నాకు ఆ పతకాన్ని బహూకరించారు. ఇప్పుడు నేను అదే హోదాలో రాజేశ్వరికి పతకాన్ని అందించడం గొప్ప అనుభూతి
- పుత్రికోత్సాహంతో రణ్ధీర్
ఫ్యాషన్ డిజైనర్గా
రాజేశ్వరీ కెరీర్ షూటింగే కానీ.. షూటింగ్ రేంజ్ నుంచి బయటకు వస్తే ఆమె ఓ ఫ్యాషన్ డిజైనర్. 2021లో చిన్ననాటి స్నేహితుడు సౌరభ్ అగర్వాల్తో కలసి పటియాల స్టయిల్ క్లాత్ బ్రాండ్ స్టోర్ను నెలకొల్పింది రాజేశ్వరి . బాలీవుడ్ సినిమా తారలకు ప్రత్యేకంగా దుస్తులు తయారు చేసి ఇస్తుంది రాజేశ్వరీ. ప్రస్తుతం ఆమె తయారు చేసే దుస్తులకు సినిమా తారల్లోనే కాదు బయట మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉంది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్