Harmilan Bains: 13 ఏళ్ల వయసులోనే నిషేధం... ఆపై వరుస గాయాలు.. హర్మిలన్ పోరాటమిదీ!
మోడల్ కాదు అథ్లెటే... హర్మిలన్ బైన్స్ (Harmilan Bains) ను చూడగానే సగటు క్రీడాభిమాని అనే మాట ఇది. ఎందుకంటే ఆమె మోడల్లా ఉంటుంది మరి. ఇంకా ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం...
ఆమెను చూస్తే ఎవరీ మోడల్ అనిపిస్తుంది.. ఉంగరాల జట్టు.. అందమైన ముఖం.. ఎండకు కలిమిపోతుందా అన్నట్లుండే మేని ఛాయ. ఈ అమ్మాయి వస్తుంటే అందరి చూపులు ఆమె మీదే! విశేషం ఏమిటంటే ఆమె ఓ విజేత! ర్యాంప్ మీద కాదు! అథ్లెటిక్స్ ట్రాక్ మీద! సున్నితంగా అనిపించే ఈ అమ్మాయి పతకాల పంట పండిస్తోంది. తాజాగా ఆసియా క్రీడల్లో (Asian Games 2022) రజతంతో అదరగొట్టింది. ఆ అథ్లెటే హర్మిలన్ బైన్స్ (Harmilan Bains).
అమ్మా, నాన్న అథ్లెట్లే
ఆసియా క్రీడల్లో 1500 మీటర్ల పరుగులో సత్తా చాటిన పంజాబ్ అమ్మాయి హర్మిలన్ అథ్లెటిక్స్ కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తల్లి మాధురి సింగ్ కూడా అంతర్జాతీయ అథ్లెటే. హర్మిలిన్ కడుపులో ఉండగానే ఓ ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రాక్లో పరుగులు తీసింది మాధురి. అథ్లెటిక్స్ అంటే ప్రాణంగా ఉండే మాధురి.. హర్మిలిన్ పుట్టిన నాలుగేళ్ల తర్వాత మళ్లీ ట్రాక్లోకి వచ్చి 2002 బుసాన్ ఆసియా క్రీడల్లో 800 మీటర్ల పరుగులో రజతం గెలిచింది. విశేషం ఏమిటంటే హర్మిలన్ నాన్న అమన్దీప్ బైన్స్ కూడా అథ్లెటే. దక్షిణ ఆసియా క్రీడల్లో పతకం గెలిచాడు. ఇలా అమ్మ, నాన్న స్ఫూర్తితో పరుగును నరనరానా జీర్ణించుకున్న హర్మిలన్ ట్రాక్లో పతకాల వేటలో సాగుతోంది.
అనుకోకుండా నిషేధం
13 ఏళ్ల వయసులో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడిందనే కారణంతో హర్మిలన్పై రెండేళ్ల నిషేధం పడింది. స్థానికంగా ఒక వైద్యుడు ఇచ్చిన మందులు వాడడం వల్ల ఆమె అనుకోకుండా నాడా పరీక్షల్లో పట్టుబడింది. దీంతో కుంగిపోయినా.. మళ్లీ ట్రాక్లో వచ్చిన ఆమె 2015లో సెలక్షన్స్లో సత్తా చాటి సాయ్ హాస్టల్లో చోటు దక్కించుకుంది. అక్కడ అథ్లెటిక్స్లో రాటుదేలింది. సీబీఎస్ఈ జాతీయ అథ్లెటిక్స్లో 1500 మీటర్లలో పసిడి గెలిచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది.
అదే ఏడాది అండర్-18 జాతీయ ఛాంపియన్షిప్లో 800 మీటర్లు, 500 మీటర్లలో రజతాలు సొంతం చేసుకున్న హర్మిలన్ 2016లో వియత్నాంలో జరిగిన ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్లో 1500 మీ పరుగులో కాంస్యం నెగ్గి అంతర్జాతీయ పతకాల ఖాతా తెరిచింది. అక్కడ నుంచి ఆమె ప్రదర్శన మరింత మెరుగవుతూ వచ్చింది. 2021లో 800, 1500 మీ పరుగులో జాతీయ ఛాంపియన్ అయిన హర్మిలిన్... ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లోనూ ఇదే ఈవెంట్లలో పసిడి పతకాలతో మెరిసింది.
గాయంతో దూరమైనా
2022లో మోకాలి గాయం కారణంగా హర్మిలన్ జోరుకు బ్రేక్ పడింది. కామన్వెల్త్ క్రీడలు, ప్రపంచ ఛాంపియన్షిప్ లాటి ప్రధాన ఈవెంట్లకు దూరమైంది. 10 నెలల విరామం తర్వాత ఈ ఏడాది అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్లో పునరాగమనం చేసిన ఈ పంజాబ్ రన్నర్...1500 మీ, 800 మీటర్ల పరుగులో రజతాలతో సత్తా చాటింది. ఇదే క్రమంలో ఆసియా క్రీడలకు అర్హత సాధించిన ఆమె హాంగ్జౌలోనూ అదరగొట్టింది. ఒలింపిక్స్కు అర్హత సాధించి సత్తా చాటాలన్నది హర్మిలన్ కల. ఆ కలను తీర్చుకునే దిశగా ఇప్పుడు ఆసియా పతకంతో ఓ అడుగు ముందుకేసింది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.