IPL 2023 : ఈ ఐపీఎల్ టోర్నీలో ప్రకటనల పంట.. ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందంటే?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టోర్నీలో ఒకటి ఐపీఎల్(IPL). ప్రతీ సీజన్కు ప్రేక్షకాదరణతోపాటు ప్రకటనల ఆదాయాన్ని పెంచుకుంటూ ఇది ముందుకు సాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్ : ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023(IPL 2023) సీజన్ క్రీడాభిమానులకు ఎన్నో మధురస్మృతులను మిగిల్చింది. ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు ఐదోసారి విజేతగా నిలిచి ముంబయి రికార్డును సమం చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టోర్నీల్లో ఒకటైన ఐపీఎల్.. అటు ప్రకటనల రూపంలోనూ భారీ ఆదాయాన్ని సాధించి పెట్టింది. ₹10,120 కోట్ల యాడ్ రెవెన్యూ వచ్చినట్లు మార్కెట్ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ ‘రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్’ తెలిపింది. ప్రకటనల ఆదాయంలో ఇది గణనీయమైన వృద్ధి అని పేర్కొంది.
ఆ కంపెనీ నివేదిక ప్రకారం..
- ప్రసార హక్కులు పొందిన జియోసినిమా, స్టార్ స్పోర్ట్స్ మొత్తం ₹4700 కోట్లు ప్రకటనల రూపంలో ఆదాయం పొందాయి.
- ఇక ఫ్రాంచైజీలు ₹1450 కోట్లు యాడ్ల ద్వారా సమకూర్చుకోగా.. బీసీసీఐకి మరో ₹430 కోట్లు వచ్చాయి.
- మొత్తం ఆదాయంలో 65 శాతం బీసీసీఐ, ఫ్రాంచైజీలు, బ్రాడ్కాస్టర్ల ద్వారానే ప్రత్యక్షంగా వచ్చింది.
- మిగతా 35 శాతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, ఇతర మీడియా, ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ల ద్వారా పరోక్షంగా లభించింది.
- ఇక ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్లు ₹2,800 కోట్ల వరకూ ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్జించాయి. గత ఐపీఎల్ సీజన్లోని ఆదాయం(₹2,250 కోట్లు)తో పోల్చితే ఇది 24 శాతం అధికం. ఈ గేమింగ్ ప్లాట్పామ్లలో 61 మిలియన్ యూజర్లు పాల్గొన్నారు.
- ఈ గేమింగ్ ప్లాట్ఫామ్లలో IPL 2023లో కొత్తగా 35 శాతం యూజర్లు ఆడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!